మొన్న జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య తన తండ్రి పాత జ్ఞాపకాల గురించి మాట్లాడుతూ యథాలాపంగా అన్నారో లేక పొరపాటుగా నోరు జారారో మొత్తానికి అక్కినేని తొక్కినేని అని ప్రాసలో వెళ్లిపోవడం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారి తీసింది. ఏఎన్ఆర్ ఫ్యాన్స్ దీని మీద తీవ్రంగా స్పందించారు. ఇదంతా జరిగి రెండు రోజులు అవుతున్నా బాలకృష్ణ వైపు నుంచి ఎలాంటి క్షమాపణ లేదా సర్దుబాటు మెసేజ్ రాకపోవడంతో ఇది మరింత రభసకు దారి తీసింది. ముఖ్యంగా ఈ కామెంట్ మీద స్పందించాలని అభిమానులు చేసిన ఒత్తిడికి అక్కినేని బ్రదర్స్ చైతు అఖిల్ ట్విట్టర్ ని వేదికగా ఎంచుకున్నారు
చాలా హుందాగా తమ మనసులో మాటను చెప్పారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలని వాళ్ళను అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని చెప్పి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఈ మూడు లైన్లలోనూ మొదటి పేరు ఎన్టీఆర్ పెట్టడం వల్ల గౌరవం విషయంలో ఇక్కడా తగ్గకుండా చూసుకున్నారు. అన్నదమ్ములు ఒకేసారి ఇలా ఒకటే ట్వీట్ పెట్టడం బాగుంది కానీ ఇంకా వారసుడిగా నాగార్జున వైపు నుంచి బదులు రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆయనా ఇదే సందేశాన్ని పెట్టే సూచనలున్నాయి
దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడాలని సగటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇంకా పెద్దది చేయడం వల్ల బయట వాళ్లకు ఇదో సెన్సేషనల్ ఇష్యూగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఇటీవలే ఓ వివాదం విషయంలో ఓపెన్ లెటర్ ద్వారా సారీ చెప్పి పెద్దరికం నిలబెట్టుకున్న బాలయ్య ఇప్పుడూ అదే చేస్తే వచ్చే నష్టమేమీ లేదు. పైగా తన తండ్రితో పధ్నాలుగు మల్టీస్టారర్స్ లో నటించిన ఏఎన్ఆర్ గురించి నాలుగు చక్కని మాటలు చెప్పి ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడితే మంచిది. లాగుతూ పోయేకొద్దీ తాడు తెగుతుందే తప్ప గొడవ ఇంతటితో ఆగదు.
This post was last modified on January 24, 2023 1:35 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…