మొన్న జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య తన తండ్రి పాత జ్ఞాపకాల గురించి మాట్లాడుతూ యథాలాపంగా అన్నారో లేక పొరపాటుగా నోరు జారారో మొత్తానికి అక్కినేని తొక్కినేని అని ప్రాసలో వెళ్లిపోవడం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారి తీసింది. ఏఎన్ఆర్ ఫ్యాన్స్ దీని మీద తీవ్రంగా స్పందించారు. ఇదంతా జరిగి రెండు రోజులు అవుతున్నా బాలకృష్ణ వైపు నుంచి ఎలాంటి క్షమాపణ లేదా సర్దుబాటు మెసేజ్ రాకపోవడంతో ఇది మరింత రభసకు దారి తీసింది. ముఖ్యంగా ఈ కామెంట్ మీద స్పందించాలని అభిమానులు చేసిన ఒత్తిడికి అక్కినేని బ్రదర్స్ చైతు అఖిల్ ట్విట్టర్ ని వేదికగా ఎంచుకున్నారు
చాలా హుందాగా తమ మనసులో మాటను చెప్పారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలని వాళ్ళను అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని చెప్పి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఈ మూడు లైన్లలోనూ మొదటి పేరు ఎన్టీఆర్ పెట్టడం వల్ల గౌరవం విషయంలో ఇక్కడా తగ్గకుండా చూసుకున్నారు. అన్నదమ్ములు ఒకేసారి ఇలా ఒకటే ట్వీట్ పెట్టడం బాగుంది కానీ ఇంకా వారసుడిగా నాగార్జున వైపు నుంచి బదులు రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆయనా ఇదే సందేశాన్ని పెట్టే సూచనలున్నాయి
దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడాలని సగటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇంకా పెద్దది చేయడం వల్ల బయట వాళ్లకు ఇదో సెన్సేషనల్ ఇష్యూగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఇటీవలే ఓ వివాదం విషయంలో ఓపెన్ లెటర్ ద్వారా సారీ చెప్పి పెద్దరికం నిలబెట్టుకున్న బాలయ్య ఇప్పుడూ అదే చేస్తే వచ్చే నష్టమేమీ లేదు. పైగా తన తండ్రితో పధ్నాలుగు మల్టీస్టారర్స్ లో నటించిన ఏఎన్ఆర్ గురించి నాలుగు చక్కని మాటలు చెప్పి ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడితే మంచిది. లాగుతూ పోయేకొద్దీ తాడు తెగుతుందే తప్ప గొడవ ఇంతటితో ఆగదు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…