నిన్నా మొన్నటి దాకా టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరెంటే అయితే పూజా హెగ్డే లేదా రష్మిక మందన్న అంటూ ఈ రెండు పేర్లే గుర్తొచ్చేవి. తాజాగా శ్రీలీల ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ కోసం పరుగులు పెడుతోంది. పెళ్ళి సందD కమర్షియల్ గా వర్కౌట్ కావడంలో, ధమాకా అంత పెద్ద స్థాయిలో వంద కోట్ల గ్రాసర్ గా నిలవడంలో తన పాత్ర ఎంతో ఉందని గుర్తించిన దర్శక నిర్మాతలు భారీ ఆఫర్లతో క్యూ కడుతున్న మాట వాస్తవం. అందం అభినయంతో పాటు యూత్ కి మాస్ కి బాగా కనెక్ట్ అయ్యే చలాకీతనం ఆడియన్స్ ని ఇట్టే ఆకట్టుకుంటోంది. అయితే ఇదే కొన్ని చిక్కులు తెస్తున్నట్టు వినికిడి.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ లో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈమె ఫ్యాన్స్ ప్రత్యేకంగా తన నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టే మహేష్ శ్రీలీల కాంబోలో ఒక పక్కా ఫోక్ సాంగ్ ని తమన్ తో ట్యూన్ చేయిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ధమాకాలో దండ కడియాల్, పల్సర్ బైక్ పాటలకు వచ్చిన స్పందన చూసి ఒకవేళ ఇదే తరహా ఎనర్జీని సూపర్ స్టార్ తో చూపిస్తే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుని దానికి తగ్గట్టే సెటప్ ని సిద్ధం చేస్తున్నారట. ఆ రేంజ్ లో ఉంది శ్రీలీల మహత్యం.
ఈ కారణంగానే ముందు తనదే మొత్తం ప్రాధాన్యం ఉంటుందని భావించిన పూజా హెగ్డే మారిన స్క్రిప్ట్ లో శ్రీలీల క్యారెక్టర్ కు స్కోప్ పెరగడం చూసి కినుక వహించిందని లీకైన వర్గాల గుసగుస. అయితే వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు బెట్టు చేసి అడిగితే బాగుండదు అందులోనూ క్రేజీ కాంబో మూవీ కాబట్టి ఇంకేమి అనలేక తన సన్నిహితులతో అన్నట్టు వినికిడి. ఇది నిజమో కాదో పక్కనపెడితే తమ సినిమాల్లో శ్రీలీలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విషయంలో దర్శకులు స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. బాలయ్య అనిల్ రావిపూడి కలయికలో రాబోయే చిత్రంలోనూ ఎక్కువ లెన్తే ఇచ్చారని తెలిసింది .
This post was last modified on January 22, 2023 2:00 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…