ఏ ముహూర్తాన మహేష్ , త్రివిక్రమ్ కాంబో ఎనౌన్స్ అయిందో అప్పటి నుండి SSMB28 షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. అన్నీ ప్లాన్ చేసి నాలుగు రోజులు యాక్షన్ సీక్వెన్స్ చేస్తే అది కాస్త త్రివిక్రమ్ ఎక్స్ పెక్ట్ చేసినట్టుగా రాలేదు. దాంతో ఆ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చేయడం , ఆ వెంటనే మహేష్ మదర్ ఇందిరా దేవి , తండ్రి కృష్ణ మరణం పొందటంతో పెద్ద గ్యాప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమా ఈ ఏడాది థియేటర్స్ లోకి రావడం కష్టమే అనుకుంటున్న మహేష్ ఫ్యాన్స్ కి తాజాగా నిర్మాత కూడా గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రకటించినట్లు ఆగస్ట్ 11 కే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని నాగ వంశీ ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ అండ్ టీం ఆగస్ట్ రిలీజ్ టార్గెట్ పెట్టుకునే వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా మహేష్ త్రివిక్రమ్ మీద త్వరగా ఘాట్ కంప్లీట్ చేయాలనే ఒత్తిడి తెస్తున్నాడట. అందుకే అరవై రోజుల పాటు బ్రేక్ లేకుండా షెడ్యూల్ జరిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
దీనికి రీజన్ మహేష్ రాజమౌళితో చేయబోయే పాన్ ఇండియా మూవీ. ఇంత వరకు మహేష్ కారణం చేతే షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఇకపై త్రివిక్రమ్ ఈ సినిమాను టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేయాల్సి ఉంది. ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసి రాజమౌళి సినిమా కోసం సిక్స్ ప్యాక్ వర్కవుట్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడు మహేష్. సుకుమార్ సినిమా కోసం అప్పట్లో మహేష్ సిక్స్ ప్యాక్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు రాజమౌళి కోసం ఆ లుక్ ట్రై చేయనున్నాడు. ఇప్పటికే రాజమౌళి మహేష్ కి లుక్ పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడు. మరి త్రివిక్రమ్ అండ్ టీం మహేష్ పెట్టిన టార్గెట్ రీచ్ అయి ఆగస్ట్ లోపే షూటింగ్ ఫినిష్ చేస్తారా ? వేచి చూడాలి.
This post was last modified on January 18, 2023 8:44 am
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…
అది మార్చి.. ఎన్నికలకు 50 రోజులకు పైగానే సమయం ఉంది. సర్వేల సంస్థలు ప్రజలను కలుస్తున్నాయి. మీకు ఏ సీఎం…
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ఇన్నాళ్లూ జరిగిన ప్రచారంలో అస్సలు నిజం లేదని తేలిపోయింది.…