ఏ ముహూర్తాన మహేష్ , త్రివిక్రమ్ కాంబో ఎనౌన్స్ అయిందో అప్పటి నుండి SSMB28 షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. అన్నీ ప్లాన్ చేసి నాలుగు రోజులు యాక్షన్ సీక్వెన్స్ చేస్తే అది కాస్త త్రివిక్రమ్ ఎక్స్ పెక్ట్ చేసినట్టుగా రాలేదు. దాంతో ఆ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చేయడం , ఆ వెంటనే మహేష్ మదర్ ఇందిరా దేవి , తండ్రి కృష్ణ మరణం పొందటంతో పెద్ద గ్యాప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమా ఈ ఏడాది థియేటర్స్ లోకి రావడం కష్టమే అనుకుంటున్న మహేష్ ఫ్యాన్స్ కి తాజాగా నిర్మాత కూడా గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రకటించినట్లు ఆగస్ట్ 11 కే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని నాగ వంశీ ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ అండ్ టీం ఆగస్ట్ రిలీజ్ టార్గెట్ పెట్టుకునే వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా మహేష్ త్రివిక్రమ్ మీద త్వరగా ఘాట్ కంప్లీట్ చేయాలనే ఒత్తిడి తెస్తున్నాడట. అందుకే అరవై రోజుల పాటు బ్రేక్ లేకుండా షెడ్యూల్ జరిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
దీనికి రీజన్ మహేష్ రాజమౌళితో చేయబోయే పాన్ ఇండియా మూవీ. ఇంత వరకు మహేష్ కారణం చేతే షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఇకపై త్రివిక్రమ్ ఈ సినిమాను టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేయాల్సి ఉంది. ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసి రాజమౌళి సినిమా కోసం సిక్స్ ప్యాక్ వర్కవుట్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడు మహేష్. సుకుమార్ సినిమా కోసం అప్పట్లో మహేష్ సిక్స్ ప్యాక్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు రాజమౌళి కోసం ఆ లుక్ ట్రై చేయనున్నాడు. ఇప్పటికే రాజమౌళి మహేష్ కి లుక్ పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడు. మరి త్రివిక్రమ్ అండ్ టీం మహేష్ పెట్టిన టార్గెట్ రీచ్ అయి ఆగస్ట్ లోపే షూటింగ్ ఫినిష్ చేస్తారా ? వేచి చూడాలి.
This post was last modified on January 18, 2023 8:44 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…