సంక్రాంతి సీజన్ సినిమాల పోటీ పూర్తయింది. చిరు , బాలయ్య ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తూ భారీ వసూళ్లు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు శివరాత్రి పోటీపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి సందర్భంగా దనుష్ ‘సార్ ‘, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ , విశ్వక్ సేన్ ‘ దాస్ కా దమ్కీ’ ప్రకటించారు.
అయితే ఉన్నపళంగా సమంత శివరాత్రి పోటీలో భారీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హటాత్తుగా దిల్ రాజు ‘శాకుంతలం’ సినిమాను శివరాత్రి బరిలో దించాడు. ఫిబ్రవరి 17న రిలీజ్ అంటూ ప్రమోషన్స్ మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు కుర్ర హీరోలు మరో ఆల్టర్నెట్ డేట్ చూసుకునే ప్లానింగ్ లో ఉన్నారట.
దనుష్ ‘సార్’ ఫిబ్రవరి 17నే ‘శాకుంతలం’ తో రావడం పక్కా. కానీ సమంత ఎఫెక్ట్ తో కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అలాగే విశ్వక్ సేన్ ‘దాస్ కా దమ్కీ’ మార్చ్ కి పోస్ట్ పోన్ కానున్నాయని సమాచారం. దమ్కీ కోసం ఇప్పటికే మార్చి లో ఓ డేట్ చూసుకున్నాడట విశ్వక్. ఇక వినరో భాగ్యము కి సంబందించి కూడా బన్నీ వాస్ మార్చి లో మరో డేట్ ఎంచుకొనున్నాడని తెలుస్తుంది.
ప్రస్తుతానికి ఇంకా కుర్ర హీరోల సినిమాలకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్స్ ఫైనల్ అవ్వలేదు. కానీ ఫిబ్రవరి నుండి మార్చ్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక తెలుగులో దనుష్ సినిమా ఓపెనింగ్ మీద ‘శాకుంతలం’ ఎఫెక్ట్ పడటం ఖాయం. సమంత మీద సింపతీతో కొంత విజువల్స్ కోసం ఇంకొంత ఈ సినిమా చూసేందుకు తెలుగు ఆడియన్స్ మొగ్గు చూపుతారు. పైగా దిల్ రాజు ఈ సినిమాకి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. సో దనుష్ ‘సార్’ కి కూడా తెలుగు స్టేట్స్ లో ఆశించిన థియేటర్స్ దక్కపోవచ్చు.
This post was last modified on January 17, 2023 6:23 pm
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…
అది మార్చి.. ఎన్నికలకు 50 రోజులకు పైగానే సమయం ఉంది. సర్వేల సంస్థలు ప్రజలను కలుస్తున్నాయి. మీకు ఏ సీఎం…
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ఇన్నాళ్లూ జరిగిన ప్రచారంలో అస్సలు నిజం లేదని తేలిపోయింది.…