అందమైన హీరోయిన్లు క్యాన్సర్ బారిన పడి.. కళావిహీనంగా తయారైతే అభిమానులు వారిని చూసి తట్టుకోవడం కష్టమే. సోనాలి బింద్రే సహా చాలామంది హీరోయిన్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. దక్షిణాది హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. ఈ మలయాళ భామ తెలుగులో ఒక టైంలో వరుసగా క్రేజీ సినిమాల్లో నటించింది.
కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. ఆమె క్యాన్సర్ బారిన పడి సినిమాలకు దూరమైంది. అదృష్టం కొద్దీ ఆ మహమ్మారి నుంచి కొంచెం త్వరగానే కోలుకుంది. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నపుడు మీడియా దృష్టిలో పడకుండా ఉన్న ఆమె.. మళ్లీ మామూలు మనిషయ్యాక లైమ్ లైట్లోకి వచ్చింది. తిరిగి సినిమాల్లో కూడా నటించింది. మళ్లీ ఆమెను మునుపటి గ్లోతో చూడడం అభిమానులకు ఆనందాన్నిచ్చింది.
కానీ ఇప్పుడు మమత మళ్లీ ఓ వ్యాధి బారిన పడింది. ఈసారి సమస్య మరీ పెద్దది కాదు కానీ.. మమతను బాగా ఇబ్బంది పెడుతున్నదే. ఒక చర్మ సంబంధిత సమస్య కారణంగా శరీరమంతా పొడిబారిపోయి.. తెల్లటి మచ్చలు వచ్చేస్తున్నాయట. మామూలుగా హీరోయిన్లకు ఇలాంటి సమస్య ఎదురైతే బయటికి చెప్పుకోరు. కానీ మమత మాత్రం ఒంటి మీద తెల్లటి మచ్చలతో కళ తప్పిన తన బాడీని చూపించడానికి వెనుకాడలేదు. ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోను షేర్ చేసి.. సమస్య గురించి చెప్పేసింది.
ఎండ తగలడం కోసం ఆరుబయట కూర్చున్న ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘‘ఓ సూర్యుడా.. నాకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ నీ కాంతి అవసరం. నేను నా రంగును కోల్పోతున్నా. నేను ప్రతి రోజూ నీ కోసం ఎదురు చూస్తుంటా. సూర్యకిరణాలు తాకాలని బయటికి వస్తున్నా. ఇప్పుడు నాకు నీ అవసరం చాలా ఉంది. నీ దయతో ఇక్కడ ఉన్నా. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొంది.
ప్రస్తుతం తన సమస్యకు చికిత్స తీసుకుంటున్న మమత.. క్యాన్సర్ను జయించినట్లే ఈ వ్యాధినీ అధిగమిస్తుందని ఆశిద్దాం.
This post was last modified on January 16, 2023 12:46 pm
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…
అది మార్చి.. ఎన్నికలకు 50 రోజులకు పైగానే సమయం ఉంది. సర్వేల సంస్థలు ప్రజలను కలుస్తున్నాయి. మీకు ఏ సీఎం…
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ఇన్నాళ్లూ జరిగిన ప్రచారంలో అస్సలు నిజం లేదని తేలిపోయింది.…