అందమైన హీరోయిన్లు క్యాన్సర్ బారిన పడి.. కళావిహీనంగా తయారైతే అభిమానులు వారిని చూసి తట్టుకోవడం కష్టమే. సోనాలి బింద్రే సహా చాలామంది హీరోయిన్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. దక్షిణాది హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. ఈ మలయాళ భామ తెలుగులో ఒక టైంలో వరుసగా క్రేజీ సినిమాల్లో నటించింది.
కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. ఆమె క్యాన్సర్ బారిన పడి సినిమాలకు దూరమైంది. అదృష్టం కొద్దీ ఆ మహమ్మారి నుంచి కొంచెం త్వరగానే కోలుకుంది. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నపుడు మీడియా దృష్టిలో పడకుండా ఉన్న ఆమె.. మళ్లీ మామూలు మనిషయ్యాక లైమ్ లైట్లోకి వచ్చింది. తిరిగి సినిమాల్లో కూడా నటించింది. మళ్లీ ఆమెను మునుపటి గ్లోతో చూడడం అభిమానులకు ఆనందాన్నిచ్చింది.
కానీ ఇప్పుడు మమత మళ్లీ ఓ వ్యాధి బారిన పడింది. ఈసారి సమస్య మరీ పెద్దది కాదు కానీ.. మమతను బాగా ఇబ్బంది పెడుతున్నదే. ఒక చర్మ సంబంధిత సమస్య కారణంగా శరీరమంతా పొడిబారిపోయి.. తెల్లటి మచ్చలు వచ్చేస్తున్నాయట. మామూలుగా హీరోయిన్లకు ఇలాంటి సమస్య ఎదురైతే బయటికి చెప్పుకోరు. కానీ మమత మాత్రం ఒంటి మీద తెల్లటి మచ్చలతో కళ తప్పిన తన బాడీని చూపించడానికి వెనుకాడలేదు. ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోను షేర్ చేసి.. సమస్య గురించి చెప్పేసింది.
ఎండ తగలడం కోసం ఆరుబయట కూర్చున్న ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘‘ఓ సూర్యుడా.. నాకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ నీ కాంతి అవసరం. నేను నా రంగును కోల్పోతున్నా. నేను ప్రతి రోజూ నీ కోసం ఎదురు చూస్తుంటా. సూర్యకిరణాలు తాకాలని బయటికి వస్తున్నా. ఇప్పుడు నాకు నీ అవసరం చాలా ఉంది. నీ దయతో ఇక్కడ ఉన్నా. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొంది.
ప్రస్తుతం తన సమస్యకు చికిత్స తీసుకుంటున్న మమత.. క్యాన్సర్ను జయించినట్లే ఈ వ్యాధినీ అధిగమిస్తుందని ఆశిద్దాం.
This post was last modified on January 16, 2023 12:46 pm
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…