Movie News

అప్పుడు క్యాన్సర్.. పాపం ఇప్పుడేమో

అందమైన హీరోయిన్లు క్యాన్సర్ బారిన పడి.. కళావిహీనంగా తయారైతే అభిమానులు వారిని చూసి తట్టుకోవడం కష్టమే. సోనాలి బింద్రే సహా చాలామంది హీరోయిన్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. దక్షిణాది హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. ఈ మలయాళ భామ తెలుగులో ఒక టైంలో వరుసగా క్రేజీ సినిమాల్లో నటించింది.

కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. ఆమె క్యాన్సర్ బారిన పడి సినిమాలకు దూరమైంది. అదృష్టం కొద్దీ ఆ మహమ్మారి నుంచి కొంచెం త్వరగానే కోలుకుంది. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నపుడు మీడియా దృష్టిలో పడకుండా ఉన్న ఆమె.. మళ్లీ మామూలు మనిషయ్యాక లైమ్ లైట్లోకి వచ్చింది. తిరిగి సినిమాల్లో కూడా నటించింది. మళ్లీ ఆమెను మునుపటి గ్లోతో చూడడం అభిమానులకు ఆనందాన్నిచ్చింది.

కానీ ఇప్పుడు మమత మళ్లీ ఓ వ్యాధి బారిన పడింది. ఈసారి సమస్య మరీ పెద్దది కాదు కానీ.. మమతను బాగా ఇబ్బంది పెడుతున్నదే. ఒక చర్మ సంబంధిత సమస్య కారణంగా శరీరమంతా పొడిబారిపోయి.. తెల్లటి మచ్చలు వచ్చేస్తున్నాయట. మామూలుగా హీరోయిన్లకు ఇలాంటి సమస్య ఎదురైతే బయటికి చెప్పుకోరు. కానీ మమత మాత్రం ఒంటి మీద తెల్లటి మచ్చలతో కళ తప్పిన తన బాడీని చూపించడానికి వెనుకాడలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను షేర్ చేసి.. సమస్య గురించి చెప్పేసింది.

ఎండ తగలడం కోసం ఆరుబయట కూర్చున్న ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘‘ఓ సూర్యుడా.. నాకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ నీ కాంతి అవసరం. నేను నా రంగును కోల్పోతున్నా. నేను ప్రతి రోజూ నీ కోసం ఎదురు చూస్తుంటా. సూర్యకిరణాలు తాకాలని బయటికి వస్తున్నా. ఇప్పుడు నాకు నీ అవసరం చాలా ఉంది. నీ దయతో ఇక్కడ ఉన్నా. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొంది.

ప్రస్తుతం తన సమస్యకు చికిత్స తీసుకుంటున్న మమత.. క్యాన్సర్‌ను జయించినట్లే ఈ వ్యాధినీ అధిగమిస్తుందని ఆశిద్దాం. 

This post was last modified on January 16, 2023 12:46 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

46 minutes ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

1 hour ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

3 hours ago