ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరిసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రాలకు తోడు.. వారసుడు, తెగింపు లాంటి రెండు అనువాద చిత్రాలు చాలా ముందుగానే షెడ్యూల్ అయిపోయాయి. వాటికే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టంగా ఉంటే.. ‘కళ్యాణం కమనీయం’ అనే చిన్న సినిమా కూడా సంక్రాంతి రేసులోకి వచ్చింది. థియేటర్లు అందుబాటులో లేవు.
పైగా ఇదేమో చిన్న సినిమా, దానికి బజ్ కూడా లేదు. ఇంత పోటీ మధ్య ఈ చిన్న చిత్రాన్ని రిలీజ్ చేయడం అవసరమా అన్న చర్చ జరిగింది. కానీ యువి క్రియేషన్స్ వాళ్లు చాలా కాన్ఫిడెంట్గా రంగంలోకి దిగేశారు.
2017లో ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలకు పోటీగా ‘శతమానం భవతి’ రిలీజై సూపర్ హిట్టయినట్లే ఇది కూడా ఆడేస్తుందని అనుకున్నారేమో తెలియదు. కానీ యువి వాళ్లది ఆత్మవిశ్వాసం కాదు.. అతి విశ్వాసం అని తెర మీద బొమ్మ పడ్డాక కానీ అర్థం కాలేదు.
‘కళ్యాణం కమనీయం’ చాలా సాధారణమైన సినిమా. షార్ట్ ఫిలింని కొంచెం పొడిగించినట్లు ఉందే తప్ప.. దీన్ని ఫీచర్ ఫిలింగా తీసేంత విషయం లేదు. ఆరంభం నుంచి ఒకే గ్రాఫ్ మెయింటైన్ చేస్తూ.. ఎక్కడా పైకి లేవకుండానే ముగిసిపోయింది.
అసలు ఏ ధైర్యంతో ఈ కాన్సెప్ట్ను సినిమాగా తీశారు.. ఇంకే ధైర్యంతో సంక్రాంతిలో భారీ చిత్రాల మధ్య పోటీకి నిలిపారు అన్నది అర్థం కావడం లేదు. పరిమిత సంఖ్యలో అయినా సరే.. ఈ సినిమా కోసం కేటాయించిన థియేటర్లు వృథా అయిపోయాయి.
‘వారసుడు’ కోసం దిల్ రాజు చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు తీసేసుకోగా.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు సరిపడా థియేటర్లు లేక, టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతుంటే.. ‘కళ్యాణం కమనీయం’ జనాల్లేక ఖాళీగా వెలవెలబోతోంది. యువి వాళ్లు చేసింది ఎంత పెద్ద తప్పో చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి?
This post was last modified on January 15, 2023 6:39 pm
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…
అది మార్చి.. ఎన్నికలకు 50 రోజులకు పైగానే సమయం ఉంది. సర్వేల సంస్థలు ప్రజలను కలుస్తున్నాయి. మీకు ఏ సీఎం…
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ఇన్నాళ్లూ జరిగిన ప్రచారంలో అస్సలు నిజం లేదని తేలిపోయింది.…