ఇటు తెలుగులో ‘అర్జున్ రెడ్డి’తో.. అటు హిందీలో దాని రీమేక్ ‘కబీర్ సింగ్’తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అతడి తర్వాతి సినిమా కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘అర్జున్ రెడ్డి’ విడుదలై మూడేళ్లు అయిపోవడంతో మళ్లీ తెలుగులో ఎప్పుడు సినిమా తీస్తాడా అని ఇక్కడి వాళ్లు చూస్తున్నారు.
‘కబీర్ సింగ్’ తర్వాత బాలీవుడ్లోనే సినిమా చేయడానికి సిద్ధమైన సందీప్ అక్కడి వాళ్లలోనూ క్యూరియాసిటీ పెంచాడు. కొన్ని నెలల కిందటే తన కొత్త ప్రాజెక్టు గురించి ప్రకటన కూడా వచ్చింది. ‘కబీర్ సింగ్’ నిర్మాతలే అతడి తర్వాతి చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. ఇందులో హీరో ఎవరన్నది ప్రకటించలేదు. రణబీర్ కపూర్ పేరు వినిపించింది. ఇక ప్రకటనే తరువాయి అనుకున్నారు.
కానీ కరోనా దెబ్బకు మొత్తం పరిస్థితి తలకిందులైంది. చేతిలో ఉన్న ప్రాజెక్టులే చాలా ఆలస్యం అవుతుండటంతో రణబీర్.. వెంటనే సందీప్ రాబోయే ఏడాది కాలంలో సందీప్ సినిమాను మొదలుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. వెంటనే మరే హీరో కూడా సందీప్తో సినిమా చేసే అవకాశం లేదు. దీంతో ఆల్రెడీ కమిటైన సినిమాను హోల్డ్లో పెట్టాడట సందీప్.
ఆ సినిమా సంగతి ఏమవుతుందో ఏమో కానీ.. ప్రస్తుతానికి ట్రెండ్కు తగ్గట్లుగా ఓ వెబ్ సిరీస్ చేయడానికి అతను సిద్ధమయ్యాడట. ఓ స్టార్ హీరోయిన్తో బోల్డ్గా సాగే ఓ సిరీస్ చేయబోతున్నాడట సందీప్. ఇందుకు స్క్రిప్ట్, ఇతర ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని.. త్వరలోనే ఈ సిరీస్ పట్టాలెక్కుతుందని సమాచారం. మరి ఈ సిరీస్, తర్వాత బాలీవుడ్ సినిమా పూర్తి చేసుకుని మళ్లీ సందీప్ టాలీవుడ్లోకి ఎప్పుడు పునరాగమనం చేస్తాడో?
This post was last modified on July 20, 2020 4:01 pm
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
రాష్ట్రంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను మాత్రమే భర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీఎం విచక్షణ…
"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయన మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నా" ఓ 15 ఏళ్ల కిందట కర్ణాటకలో జరిగిన రాజకీయం…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…