Movie News

‘వారసుడు’ వెనుక మెగా వ్యూహం ?

‘వారసుడు’ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికే చాలా ఇష్యూస్ ఎదుర్కున్నాడు దిల్ రాజు. అటు మెగా ఫ్యాన్స్ ఇటు బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దిల్ రాజును ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నైజాం , ఉత్తరాంధ్ర లో మంచి థియేటర్స్ అన్నీ వారసుడు కోసం దిల్ రాజు బ్లాక్ చేశారని ఫ్యాన్స్ తమ కోపాన్ని దిల్ రాజుపై చూపిస్తూనే ఉన్నారు. అయినా రిలీజ్ విషయంలో, థియేటర్స్ కౌంట్ లో తగ్గదేదే లే అంటూ దిల్ రాజు చెప్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూళ్లో కూడా ‘వారసుడు’కి తను నిర్మాత అని తన వ్యాపారం తను చేసుకుంటానని ఫైనల్ గా ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఆడుతుందని చెప్పుకున్నాడు.

కానీ రాత్రికి రాత్రి ‘వారసుడు’ రిలీజ్ డేట్ మార్చేసుకున్నారు రాజు. ఇప్పటికే ‘వారసుడు’ తెలుగు రిలీజ్ పై దిల్ రాజు ఇండస్ట్రీ నుండి మీడియా నుండి చాలా ప్రశ్నలు ఎదుర్కున్నారు. కానీ వాటన్నిటికీ జవాబిస్తూనే వచ్చాడు. ఒక టైమ్ లో దిల్ రాజు ఇక తగ్గడేమో అనుకున్నారంతా ఫైనల్ గా వెనక్కి తగ్గి ‘వారసుడు’ తెలుగు రిలీజ్ ను జనవరి 11 నుండి 14 కి వాయిదా వేసుకున్నారు. తమిళ్ లో ప్రకటించిన జనవరి 11 కే సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అక్కడ రిలీజైన రెండ్రోజుల తర్వాత ఇక్కడ డబ్బింగ్ సినిమాగా వారసుడు రిలీజ్ కానుంది.

అయితే ‘వారసుడు’ రిలీజ్ విషయంలో వెనక నుండి ఇండస్ట్రీ పెద్దలు కొందరు చక్రం తిప్పారని తెలుస్తుంది. ముఖ్యంగా దీని వెనుక మెగా వ్యూహం ఉందని టాక్ వినిపిస్తుంది. దిల్ రాజు తో నేరుగా చిరంజీవి మాట్లాడారని అంటున్నారు. ఇక మైత్రి నిర్మాతలు మొన్నటి వరకూ దిల్ రాజు తో మాట్లాడుతూనే ఉన్నారట, కానీ దిల్ రాజు మొండి పట్టు చూసి ఫైనల్ గా మెగా స్టార్ ని రంగంలోకి దింపారని అంటున్నారు. చిరు విషయంలోకి ఎంటరయ్యాకే దిల్ రాజు వెనక్కి తగ్గారని, అందుకే తన డబ్బింగ్ సినిమాను వెనక్కి జరిపి వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య లకి దిల్ రాజు సైడ్ ఇచ్చారని తెలుస్తుంది. ఏదేమైనా ఈ సారి సంక్రాంతి సినిమాల తెరవెనుక చాలా జరుగుతున్నాయి.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

2 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

5 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

5 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

6 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

6 hours ago