యాభై సినిమాల నిర్మాణానికి అతి దగ్గరగా ఉన్న దిల్ రాజు గారి అనుభవం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాతగా పక్కనపెడితే డిస్ట్రిబ్యూటర్ గా ఆయనకున్న సుదీర్ఘ అనుభవం ఇప్పుడున్న టాప్ ప్రొడ్యూసర్లలో చాలా మందికి లేదన్నది వాస్తవం. అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా తమిళ బిగ్గెస్ట్ స్టార్ హీరో విజయ్ తో మొదటిసారి తీసిన వరిసు అలియాస్ వారసుడు గురించి వస్తున్న వార్తలు ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఓవర్సీస్ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ కంటెంట్ ఇంకా చేరలేదని ఎప్పుడు అందుతుందో తెలియని కారణంగా అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టలేదనే వార్త ట్విట్టర్ ని ఊపేస్తోంది.
పక్కా ప్లానింగ్ తో అన్నీ టైం ప్రకారం చేసే రాజుగారు ఎక్కడో పొరపాటు చేసుంటారని అనుకోలేం. పైగా థియేటర్ పంపకాల విషయంలో తనే కేంద్ర బిందువుగా మారిన తరుణంలో ఏ చిన్న తప్పు జరిగినా దానికి భారీ మూల్యం ఉంటుందని తెలుసు. కాబట్టి ప్రతి క్షణం అలెర్ట్ గా ఉంటూ అన్నీ సవ్యంగా జరిగేలా చూసుకుంటారు. తాజాగా వారసుడుకి రిలీజ్ చేసిన నైజాం లిస్టు ఉన్న ప్రకటనలో డేట్ లేకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. సదరు ఎగ్జిబిటర్లు సైతం దీని గురించి ఏమీ చెప్పేలేకపోతున్నారు. అంటే తెరవెనుక బయట కనిపించని ఏదో వ్యవహారం నడుస్తున్న మాట నిజమే.
ప్రస్తుతం ఎస్విసి బృందం దీన్ని పరిష్కరించే పనిలో ఉంది. 11న వరిసు వచ్చేసి ఒకటి రెండు రోజులు ఆలస్యంగా వారసుడు వచ్చినా పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే బుధవారం వచ్చే సోలో అడ్వాంటేజ్ పోగొట్టుకుని తెగింపుకి ఫ్రీ రోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తోడు ఆన్ లైన్ రివ్యూలు పైరసీ బెడదలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి రెండు వెర్షన్లు రిలీజ్ చేయడం అవసరం. యుఎస్ లో బుకింగ్స్ స్టార్ట్ చేస్తే తప్ప ఖరారుగా ఏదీ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ఈ పనుల ఒత్తిడిలో ఉన్న దిల్ రాజు మీడియాకు అందుబాటులో లేరు. ఒకటి రెండు రోజుల్లో ఈ అయోమయాన్ని కుండబద్దలు కొట్టేయడం ఇప్పుడు అత్యవసరం.
This post was last modified on January 7, 2023 4:09 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…