స్టార్ హీరోలకు అయితే తమన్ లేదంటే దేవిశ్రీప్రసాద్ అనే రెండే ఆప్షన్లతో టాలీవుడ్ సంగీత దర్శకుల కొరతతో ఎంతగా అల్లాడిపోతోందో చూస్తూనే ఉన్నాం. అనూప్ లాంటి ఇంకొందరు ఉన్నారు కానీ బడా సినిమాలను మోసే రేంజ్ లో ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ధమాకా రూపంలో భీమ్స్ సెసిరోలియో ఇచ్చిన పాటలు ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించాయో వసూళ్ల సాక్షిగా యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ ప్రూఫ్ గా కళ్ళముందు కనిపిస్తూనే ఉంది. గతంలో ఇదే రవితేజకు భీమ్స్ 2015లో బెంగాల్ టైగర్ కు స్కోర్ కంపోజ్ చేసినప్పుడు రాని పేరు ఏడేళ్ల తర్వాత దక్కడమంటే విశేషమే.
ధమాకా సక్సెస్ లో శ్రీలీల గ్లామర్ తర్వాత అంతగా దోహదపడింది జింతాక జింతాక, దండకడియాల్ పాటలే. సెకండ్ హాఫ్ లో వచ్చే పల్సర్ బైక్ సాంగ్ ఒరిజినల్ ట్యూన్ కాకపోయినా దాన్ని రీమిక్స్ చేసిన తీరు చిత్రీకరించిన విధానం మాస్ కి ఓ రేంజ్ లో ఎక్కేసింది. విడుదలకు ముందు ఈవెంట్ లో మాస్ మహారాజా ప్రత్యేకంగా ఇతని గురించి చెప్పడం విని అందరూ మాములే అనుకున్నారు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అతని ప్రతిభను నమ్మినందుకు తగిన ఫలితం దక్కింది. 2012లో నువ్వా నేనాతో డెబ్యూ చేసిన భీమ్స్ కి చెప్పుకోదగ్గ బ్రేక్ దశాబ్దం తర్వాత దొరకడం విశేషం.
రవితేజ నెక్స్ట్ మూవీ రావణాసురలోనూ హర్షవర్ధన్ తో కలిసి భీమ్స్ పాటలు ఇవ్వబోతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్ కి రిపీట్ అనిపించే ఆల్బమ్స్ రావడం చాలా తగ్గింది. ధమాకా ఇంతగా కనెక్ట్ అవ్వడానికి కారణం కామెడీతో పాటు స్క్రీన్ మీద పేలిపోయిన పాటలే. ఒకవేళ శ్రీలీల బదులు మరో హీరోయిన్, భీమ్స్ స్థానంలో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా అవుట్ ఫుట్ లో తేడా వచ్చింది. కేవలం రవితేజ ఎనర్జీనే సినిమాలను నిలబెట్టాదని ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ రుజువు చేసాయిగా. భీమ్స్ ఇదే టెంపోని కొనసాగిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ప్రతి ఆల్బమ్ అంచనాలకు తగ్గట్టు ఇస్తేనే సుమా.
This post was last modified on January 5, 2023 11:02 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…