తమిళనాట సంక్రాంతి సినిమాల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఇప్పటిదాకా రిలీజ్ డేట్ల విషయంలో ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వకపోవడమే దీనికి కారణం. వారసుడు జనవరి 12 అని ముందు నుంచి ప్రచారం జరిగినట్టే ఆ మధ్య పోస్టర్లు వచ్చాయి కానీ రీసెంట్ గా వచ్చినవాటిలో దాన్ని తీసేసి కేవలం పొంగల్ 2023 అని పెట్టారు. ఇక అజిత్ తెగింపు గురించి నిర్మాత బోనీ కపూర్ చాలా గుట్టుని మైంటైన్ చేస్తున్నారు. ఒక రోజు ముందు అంటే 11న రావాలని ఆయన ప్లాన్. కానీ విజయ్ ఫ్యాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు. ఇది వాళ్లకు సంబంధం లేని విషయమే అయినా తమ హీరో ఓపెనింగ్స్ రికార్డులు పోతాయని టెన్షన్.
డిస్ట్రిబ్యూటర్లకు డబ్బింగ్ హక్కులు కొన్న ఇతర ప్రొడ్యూసర్లకు ప్రస్తుతానికి 11 అని చెప్పి ఉంచారు కానీ చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే తప్ప దాదాపు లాక్ అయినట్టే. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రెండింటికి ఏమంత భీభత్సంగా లేకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకోవడంతో బజ్ పెరిగేలా ప్రమోషన్లు పెంచాలని అజిత్ విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. చేతిలో కేవలం ఒక వారం మాత్రమే సమయం ఉండటంతో ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
తమిళంలోనే అలా ఉంటే తెగింపుకి ఇక్కడ కనీస హైప్ లేకపోవడంలో ఆశ్చర్యం లేదు. తక్కువ థియేటర్లు అయినా సరే ఒకే రోజు రెండు వెర్షన్లు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. మరోవైపు తమిళనాడులో పొంగల్ మూవీస్ హడావిడి ఓ రేంజ్ లో జరుగుతోంది. థియేటర్లను ఇప్పటి నుంచే బ్యానర్లు డెకరేషన్లతో సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఏ రేంజ్ లో వార్ ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పుడది ఇంకా ముదరబోతోంది. తనకే సంఘాలు లేవని అజిత్ పలుమార్లు తేల్చి చెప్పినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం గొడవలు పడుతూనే ఉంటారు. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో తెగింపుని ఎమోషనల్ డ్రామాగా వారసుడుని తెరకెక్కించారు
This post was last modified on January 4, 2023 1:39 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…