తమిళనాట సంక్రాంతి సినిమాల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఇప్పటిదాకా రిలీజ్ డేట్ల విషయంలో ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వకపోవడమే దీనికి కారణం. వారసుడు జనవరి 12 అని ముందు నుంచి ప్రచారం జరిగినట్టే ఆ మధ్య పోస్టర్లు వచ్చాయి కానీ రీసెంట్ గా వచ్చినవాటిలో దాన్ని తీసేసి కేవలం పొంగల్ 2023 అని పెట్టారు. ఇక అజిత్ తెగింపు గురించి నిర్మాత బోనీ కపూర్ చాలా గుట్టుని మైంటైన్ చేస్తున్నారు. ఒక రోజు ముందు అంటే 11న రావాలని ఆయన ప్లాన్. కానీ విజయ్ ఫ్యాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు. ఇది వాళ్లకు సంబంధం లేని విషయమే అయినా తమ హీరో ఓపెనింగ్స్ రికార్డులు పోతాయని టెన్షన్.
డిస్ట్రిబ్యూటర్లకు డబ్బింగ్ హక్కులు కొన్న ఇతర ప్రొడ్యూసర్లకు ప్రస్తుతానికి 11 అని చెప్పి ఉంచారు కానీ చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే తప్ప దాదాపు లాక్ అయినట్టే. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రెండింటికి ఏమంత భీభత్సంగా లేకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకోవడంతో బజ్ పెరిగేలా ప్రమోషన్లు పెంచాలని అజిత్ విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. చేతిలో కేవలం ఒక వారం మాత్రమే సమయం ఉండటంతో ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
తమిళంలోనే అలా ఉంటే తెగింపుకి ఇక్కడ కనీస హైప్ లేకపోవడంలో ఆశ్చర్యం లేదు. తక్కువ థియేటర్లు అయినా సరే ఒకే రోజు రెండు వెర్షన్లు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. మరోవైపు తమిళనాడులో పొంగల్ మూవీస్ హడావిడి ఓ రేంజ్ లో జరుగుతోంది. థియేటర్లను ఇప్పటి నుంచే బ్యానర్లు డెకరేషన్లతో సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఏ రేంజ్ లో వార్ ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పుడది ఇంకా ముదరబోతోంది. తనకే సంఘాలు లేవని అజిత్ పలుమార్లు తేల్చి చెప్పినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం గొడవలు పడుతూనే ఉంటారు. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో తెగింపుని ఎమోషనల్ డ్రామాగా వారసుడుని తెరకెక్కించారు
This post was last modified on January 4, 2023 1:39 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…