తమిళనాట సంక్రాంతి సినిమాల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఇప్పటిదాకా రిలీజ్ డేట్ల విషయంలో ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వకపోవడమే దీనికి కారణం. వారసుడు జనవరి 12 అని ముందు నుంచి ప్రచారం జరిగినట్టే ఆ మధ్య పోస్టర్లు వచ్చాయి కానీ రీసెంట్ గా వచ్చినవాటిలో దాన్ని తీసేసి కేవలం పొంగల్ 2023 అని పెట్టారు. ఇక అజిత్ తెగింపు గురించి నిర్మాత బోనీ కపూర్ చాలా గుట్టుని మైంటైన్ చేస్తున్నారు. ఒక రోజు ముందు అంటే 11న రావాలని ఆయన ప్లాన్. కానీ విజయ్ ఫ్యాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు. ఇది వాళ్లకు సంబంధం లేని విషయమే అయినా తమ హీరో ఓపెనింగ్స్ రికార్డులు పోతాయని టెన్షన్.
డిస్ట్రిబ్యూటర్లకు డబ్బింగ్ హక్కులు కొన్న ఇతర ప్రొడ్యూసర్లకు ప్రస్తుతానికి 11 అని చెప్పి ఉంచారు కానీ చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే తప్ప దాదాపు లాక్ అయినట్టే. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రెండింటికి ఏమంత భీభత్సంగా లేకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకోవడంతో బజ్ పెరిగేలా ప్రమోషన్లు పెంచాలని అజిత్ విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. చేతిలో కేవలం ఒక వారం మాత్రమే సమయం ఉండటంతో ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
తమిళంలోనే అలా ఉంటే తెగింపుకి ఇక్కడ కనీస హైప్ లేకపోవడంలో ఆశ్చర్యం లేదు. తక్కువ థియేటర్లు అయినా సరే ఒకే రోజు రెండు వెర్షన్లు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. మరోవైపు తమిళనాడులో పొంగల్ మూవీస్ హడావిడి ఓ రేంజ్ లో జరుగుతోంది. థియేటర్లను ఇప్పటి నుంచే బ్యానర్లు డెకరేషన్లతో సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఏ రేంజ్ లో వార్ ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పుడది ఇంకా ముదరబోతోంది. తనకే సంఘాలు లేవని అజిత్ పలుమార్లు తేల్చి చెప్పినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం గొడవలు పడుతూనే ఉంటారు. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో తెగింపుని ఎమోషనల్ డ్రామాగా వారసుడుని తెరకెక్కించారు
This post was last modified on January 4, 2023 1:39 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…