సంక్రాంతి సినిమాలకు థియేటర్ల కేటాయింపు విషయంలో రెండు నెలలుగా పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమా అయినా.. డిమాండ్ తక్కువున్నా ‘వారసుడు’ సినిమాకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో, మంచి మంచి స్క్రీన్లు అట్టిపెడుతుండడం పట్ల చాలా అభ్యంతరాలే వ్యక్తమయ్యాయి.
దీని గురించి మీడియాలో ఎంత రగడ జరిగినా.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా జోక్యం చేసుకుని తెలుగు సినిమాలకే ప్రాధాన్యం దక్కాలని స్టేట్మెంట్ ఇచ్చినా దిల్ రాజు వెనక్కి తగ్గట్లేదు. ముందు రిలీజ్ డేట్ ఇచ్చాం.. సమస్య ఉంటే ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు, నేను మాట్లాడుకుంటాం.. ఇది వ్యాపారం కాబట్టి నా సినిమాకు ఎక్కువ స్క్రీన్లు ఇచ్చుకుంటే తప్పేంటి.. చివరికి దమ్మున్న సినిమానే నిలబవడుతుంది.. లాంటి వాదనలతో విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
కానీ ఆయన ఎంత సమర్థించుకున్నప్పటికీ.. మైత్రీ వాళ్లు మౌనం వహిస్తున్నప్పటికీ.. గ్రౌండ్ లెవెల్లో చిరు, బాలయ్య అభిమానులకు మాత్రం పరిస్థితులు రుచించడం లేదు. వైజాగ్ ఏరియాలో మూడు సంక్రాంతి సినిమాలకు సంబంధించి థియేటర్ల జాబితాతో ప్రకటనలు వెలువడగా.. అందులో ‘వారసుడు’దే స్పష్టమైన పైచేయి.
ఇప్పటిదాకా ఖరారైన జాబితాలు చూస్తే.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు కలిపి ఎన్ని స్క్రీన్లు కేటాయించారో.. ‘వారసుడు’ ఒక్క దానికే అన్ని స్క్రీన్లు ఇచ్చుకున్నారు. అందులోనూ మెలోడీ, సంగం లాంటి మంచి మంచి స్క్రీన్లు ‘వారసుడు’కు ఇవ్వడం.. చిరు, బాలయ్య సినిమాలకు ప్రాధాన్యం తగ్గించడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇది ఎంత వ్యాపారం అన్నా సరే.. భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న చిరు, బాలయ్య సినిమాలకు కాదని.. డిమాండ్ లేని తమిళ అనువాద చిత్రానికి సంక్రాంతి టైంలో ఎక్కువ సంఖ్య, మంచి మంచి స్క్రీన్లు ఇవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీకెండ్ వరకు ఇలా కేటాయించిన స్క్రీన్లలోనే ఆయా సినిమాలను నడిపిస్తే అంతకంటే అన్యాయం ఉండదని మండిపడుతున్నారు.
This post was last modified on January 2, 2023 11:16 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…