Movie News

రగిలిపోతున్న చిరు, బాలయ్య ఫ్యాన్స్

సంక్రాంతి సినిమాలకు థియేటర్ల కేటాయింపు విషయంలో రెండు నెలలుగా పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమా అయినా.. డిమాండ్ తక్కువున్నా ‘వారసుడు’ సినిమాకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో, మంచి మంచి స్క్రీన్లు అట్టిపెడుతుండడం పట్ల చాలా అభ్యంతరాలే వ్యక్తమయ్యాయి.

దీని గురించి మీడియాలో ఎంత రగడ జరిగినా.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా జోక్యం చేసుకుని తెలుగు సినిమాలకే ప్రాధాన్యం దక్కాలని స్టేట్మెంట్ ఇచ్చినా దిల్ రాజు వెనక్కి తగ్గట్లేదు. ముందు రిలీజ్ డేట్ ఇచ్చాం.. సమస్య ఉంటే ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు, నేను మాట్లాడుకుంటాం.. ఇది వ్యాపారం కాబట్టి నా సినిమాకు ఎక్కువ స్క్రీన్లు ఇచ్చుకుంటే తప్పేంటి.. చివరికి దమ్మున్న సినిమానే నిలబవడుతుంది.. లాంటి వాదనలతో విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

కానీ ఆయన ఎంత సమర్థించుకున్నప్పటికీ.. మైత్రీ వాళ్లు మౌనం వహిస్తున్నప్పటికీ.. గ్రౌండ్ లెవెల్లో చిరు, బాలయ్య అభిమానులకు మాత్రం పరిస్థితులు రుచించడం లేదు. వైజాగ్ ఏరియాలో మూడు సంక్రాంతి సినిమాలకు సంబంధించి థియేటర్ల జాబితాతో ప్రకటనలు వెలువడగా.. అందులో ‘వారసుడు’దే స్పష్టమైన పైచేయి.

ఇప్పటిదాకా ఖరారైన జాబితాలు చూస్తే.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు కలిపి ఎన్ని స్క్రీన్లు కేటాయించారో.. ‘వారసుడు’ ఒక్క దానికే అన్ని స్క్రీన్లు ఇచ్చుకున్నారు. అందులోనూ మెలోడీ, సంగం లాంటి మంచి మంచి స్క్రీన్లు ‘వారసుడు’కు ఇవ్వడం.. చిరు, బాలయ్య సినిమాలకు ప్రాధాన్యం తగ్గించడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఇది ఎంత వ్యాపారం అన్నా సరే.. భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న చిరు, బాలయ్య సినిమాలకు కాదని.. డిమాండ్ లేని తమిళ అనువాద చిత్రానికి సంక్రాంతి టైంలో ఎక్కువ సంఖ్య, మంచి మంచి స్క్రీన్లు ఇవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీకెండ్ వరకు ఇలా కేటాయించిన స్క్రీన్లలోనే ఆయా సినిమాలను నడిపిస్తే అంతకంటే అన్యాయం ఉండదని మండిపడుతున్నారు.

This post was last modified on January 2, 2023 11:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

43 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago