2021 లో చాలా తక్కువ సినిమాలు రిలీజయ్యాయి. అందులో బాలయ్య ‘అఖండ’ , బన్నీ ‘పుష్ప’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో గట్టి సౌండ్ చేశాయి. కోవిడ సెకండ్ వేవ్ తర్వాత భారీ విజయాలు అందుకున్న ఈ ఇద్దరి నుండి సినిమా రాలేదు. స్టార్ హీరోలంతా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. అయితే బాలయ్య -గోపీచంద్ మాలినేని కాంబో సినిమా ఈ ఇయర్ దసరా రిలీజ్ అనుకునే మొదలు పెట్టారు. కానీ కుదరలేదు.
ఆ తర్వాత డిసెంబర్ లో అఖండ రిలీజ్ సెంటిమెంట్ తో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు అది కూడా పనవ్వలేదు. ఇక చేసేదేం లేక ఫైనల్ గా సంక్రాంతి సీజన్ లో వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తున్నారు.సో అంతా అనుకున్నట్టు జరిగితే బాలయ్య నుండి ఈ ఇయర్ గ్యాప్ ఉండేది కాదు. అనుకోకుండా గ్యాప్ వచ్చింది.
‘అల వైకుంఠపురములో’ “గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఈ ఇయర్ అతని కెరీర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యింది. నిజానికి బన్నీ -సుకుమార్ తో పుష్ప సినిమా మాత్రమే అనుకున్నాడు. కానీ మధ్యలో సడెన్ గా రెండు భాగాల ప్లాన్ కారణంగా పుష్ప 1 , పుష్ప 2 గా కథ విడిపోయింది. దీంతో పార్ట్ 1 కి పార్ట్ 2 కి మధ్య బన్నీ ఏడాది గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
పుష్ప 1 విడులై ఏడాది గడిచింది ఇప్పటికీ పార్ట్ 2 ఘాట్ పట్టుమని పది రోజులు కూడా జరగలేదు. వచ్చే ఏడాది జనవరి నుండి పుష్ప 2 ఘాట్ స్పీడప్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఇక సుక్కు మేకింగ్ కారణంగా అల్లు అర్జున్ డైరీలో ఈ ఏడాది పేజీ లేకుండా పోయింది. ఒక స్టార్ హీరో ఇలా ఏడాది గ్యాప్ రావడం అంటే ఫ్యాన్స్ తట్టుకోలేరు. కానీ పుష్ప 1 సక్సెస్ తో బన్నీ ఫ్యాన్స్ ఎంత టైమ్ తీసుకున్నా పర్లేదు అన్నట్టుగా ఉన్నారు. ఏదేమైనా బాలయ్య , బన్నీ ఈ ఏడాదిని వట్టిగా వదిలేసి షూటింగ్స్ తోనే సరిపెట్టుకున్నారు.
This post was last modified on December 31, 2022 11:18 pm
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…