2021 లో చాలా తక్కువ సినిమాలు రిలీజయ్యాయి. అందులో బాలయ్య ‘అఖండ’ , బన్నీ ‘పుష్ప’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో గట్టి సౌండ్ చేశాయి. కోవిడ సెకండ్ వేవ్ తర్వాత భారీ విజయాలు అందుకున్న ఈ ఇద్దరి నుండి సినిమా రాలేదు. స్టార్ హీరోలంతా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. అయితే బాలయ్య -గోపీచంద్ మాలినేని కాంబో సినిమా ఈ ఇయర్ దసరా రిలీజ్ అనుకునే మొదలు పెట్టారు. కానీ కుదరలేదు.
ఆ తర్వాత డిసెంబర్ లో అఖండ రిలీజ్ సెంటిమెంట్ తో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు అది కూడా పనవ్వలేదు. ఇక చేసేదేం లేక ఫైనల్ గా సంక్రాంతి సీజన్ లో వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తున్నారు.సో అంతా అనుకున్నట్టు జరిగితే బాలయ్య నుండి ఈ ఇయర్ గ్యాప్ ఉండేది కాదు. అనుకోకుండా గ్యాప్ వచ్చింది.
‘అల వైకుంఠపురములో’ “గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఈ ఇయర్ అతని కెరీర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యింది. నిజానికి బన్నీ -సుకుమార్ తో పుష్ప సినిమా మాత్రమే అనుకున్నాడు. కానీ మధ్యలో సడెన్ గా రెండు భాగాల ప్లాన్ కారణంగా పుష్ప 1 , పుష్ప 2 గా కథ విడిపోయింది. దీంతో పార్ట్ 1 కి పార్ట్ 2 కి మధ్య బన్నీ ఏడాది గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
పుష్ప 1 విడులై ఏడాది గడిచింది ఇప్పటికీ పార్ట్ 2 ఘాట్ పట్టుమని పది రోజులు కూడా జరగలేదు. వచ్చే ఏడాది జనవరి నుండి పుష్ప 2 ఘాట్ స్పీడప్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఇక సుక్కు మేకింగ్ కారణంగా అల్లు అర్జున్ డైరీలో ఈ ఏడాది పేజీ లేకుండా పోయింది. ఒక స్టార్ హీరో ఇలా ఏడాది గ్యాప్ రావడం అంటే ఫ్యాన్స్ తట్టుకోలేరు. కానీ పుష్ప 1 సక్సెస్ తో బన్నీ ఫ్యాన్స్ ఎంత టైమ్ తీసుకున్నా పర్లేదు అన్నట్టుగా ఉన్నారు. ఏదేమైనా బాలయ్య , బన్నీ ఈ ఏడాదిని వట్టిగా వదిలేసి షూటింగ్స్ తోనే సరిపెట్టుకున్నారు.
This post was last modified on December 31, 2022 11:18 pm
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…