Movie News

మైత్రికి అభిమానుల టార్చర్ 

ఒక అగ్ర నిర్మాణ సంస్థ నుండి ఓ స్టార్ హీరో సినిమా వస్తుందంటే వాటి అప్ డేట్స్ కోసం ఆ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేస్తూ ఆ ప్రొడక్షన్ హౌజ్ నిర్మాతలు , టీంపై ఒత్తిడి తీసుకురావడం కామన్. కానీ ఓ అగ్ర సంస్థ నుండి ఒకే సారి రెండు బడా హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో దిగితే ? ఇరు అభిమానులు అప్ డేట్స్ కోసం , ప్రమోషన్స్ కోసం ఆ సంస్థ ను టార్చర్ పెట్టడం ఖాయం. సరిగ్గా ఇప్పుడు మైత్రికి మెగా , నందమూరి ఫ్యాన్స్ తో అదే టార్చర్ ఉంది.

ఇటు వైపు చిరు ‘వాల్తేరు వీరయ్య’ , అటు బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాల ప్రమోషన్స్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ అభిమానులతో ఇబ్బంది పడుతుంది. మేకింగ్ నుండి థియేటర్స్ రిలీజ్ వరకూ ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతూ మేకర్స్ ఫైనల్ గా ఘాట్ ఫినిష్ చేసి సంక్రాంతి రిలీజ్ కి రెడీ చేస్తుంటే మరో వైపు అభిమానుల తాకిడి నిర్మాతలకు టార్చర్ గా మారింది. 

ఆ హీరో సాంగ్ లాంచ్ అలా చేశారు, మా హీరో సాంగ్ లాంచ్ ఇలా చేశారు అంటూ చాలా ప్రశ్నలే ఎదుర్కుంటున్నారు నిర్మాతలు. అందుకే ఇరు అభిమానలను సంతోష పెట్టేలా ఒకదానికి ఏం చేస్తే మరొక దానికి అదే చేయాల్సి వస్తుంది. బాలయ్య కంటే చిరు ఫ్యాన్స్ మైత్రి పై ఎక్కువ గుస్సా గా ఉంటున్నారు.

అందుకే ఈ మధ్యే వారితో ఓ మీటింగ్ పెట్టుకొని వారిని చల్లార్చే ప్రయత్నం చేశారు మేకర్స్. అందులో భాగంగానే చిరంజీవి వాల్తేరు వీరయ్య కి సెట్ లో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. మీడియాతో ఇంట్రాక్షన్ పెట్టుకున్నారు. దీంతో ఇప్పుడు ‘వీరసింహా రెడ్డి’ కి అలాంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే ఆలోచన లేదా అంటూ మైత్రి ను బాలయ్య ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక థియేటర్స్ కూడా ఇటు తక్కువ అటు ఎక్కువ లేకుండా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ముందుగానే నిర్మాతలకు సూచిస్తున్నారు.

ఇది కూడా మైత్రి సంస్థ ను ఖంగారు పెడుతుంది. ఏదేమైనా మైత్రికి ఈ సంక్రాంతి సినిమాలతో పెద్ద ఇబ్బందే. ఒక సంస్థ నుండి సంక్రాంతికి రెండు బడా సినిమాలు రావడం ఇదే మొదటి సారి. ఆ రికార్డ్ మాత్రం మైత్రికే సొంతమైంది.

This post was last modified on December 31, 2022 7:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతి కూలీల కడుపు నింపుతోంది!

నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిర్మాణ రంగ పనులతో కోలాహలంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రానికి…

52 minutes ago

ష‌ర్మిల ర‌చ్చ రాజ‌కీయం.. ఇలా అయితే క‌ష్ట‌మే..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ప్ర‌జా రాజ‌కీయాల కంటే కూడా.. ర‌చ్చ రాజ‌కీయాల‌ను ఎంచుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని…

2 hours ago

ఏపీ బీజేపీని ఓవ‌ర్ టేక్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ..!

తాజాగా జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాదుల దాడిలో.. ఏపీ వాసులు స‌హా 26 మంది…

3 hours ago

మే వచ్చినా మౌనంలోనే వీరమల్లు

మే నెల వచ్చేసింది. ఇంతకు ముందు చెప్పిన ప్రకారం తొమ్మిదో తేదీ రావాల్సిన హరిహర వీరమల్లు నిర్మాణ సంస్థ చెప్పకుండానే…

4 hours ago

నాని ‘హిట్’ కొట్టడం ఇండస్ట్రీకి అవసరం

గత ముప్పై రోజులకు పైగా డ్రై పీరియడ్ నరకం చవి చూసిన థియేటర్లకు మళ్ళీ కళ వచ్చేసింది. నాని హిట్…

6 hours ago

కూటమి దమ్మేంటో వైసీపీకి తెలిసొచ్చినట్టే!

ఏపీలో విపక్షం వైసీపీ గతంలో మాదిరిగా దూకుడుగా సాగడం లేదు. వైసీపీ వేస్తున్న ప్రతి అడుగూ బెడిసికొడుతుండటం, అధికార పక్షంపై…

13 hours ago