Movie News

మైత్రికి అభిమానుల టార్చర్ 

ఒక అగ్ర నిర్మాణ సంస్థ నుండి ఓ స్టార్ హీరో సినిమా వస్తుందంటే వాటి అప్ డేట్స్ కోసం ఆ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేస్తూ ఆ ప్రొడక్షన్ హౌజ్ నిర్మాతలు , టీంపై ఒత్తిడి తీసుకురావడం కామన్. కానీ ఓ అగ్ర సంస్థ నుండి ఒకే సారి రెండు బడా హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో దిగితే ? ఇరు అభిమానులు అప్ డేట్స్ కోసం , ప్రమోషన్స్ కోసం ఆ సంస్థ ను టార్చర్ పెట్టడం ఖాయం. సరిగ్గా ఇప్పుడు మైత్రికి మెగా , నందమూరి ఫ్యాన్స్ తో అదే టార్చర్ ఉంది.

ఇటు వైపు చిరు ‘వాల్తేరు వీరయ్య’ , అటు బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాల ప్రమోషన్స్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ అభిమానులతో ఇబ్బంది పడుతుంది. మేకింగ్ నుండి థియేటర్స్ రిలీజ్ వరకూ ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతూ మేకర్స్ ఫైనల్ గా ఘాట్ ఫినిష్ చేసి సంక్రాంతి రిలీజ్ కి రెడీ చేస్తుంటే మరో వైపు అభిమానుల తాకిడి నిర్మాతలకు టార్చర్ గా మారింది. 

ఆ హీరో సాంగ్ లాంచ్ అలా చేశారు, మా హీరో సాంగ్ లాంచ్ ఇలా చేశారు అంటూ చాలా ప్రశ్నలే ఎదుర్కుంటున్నారు నిర్మాతలు. అందుకే ఇరు అభిమానలను సంతోష పెట్టేలా ఒకదానికి ఏం చేస్తే మరొక దానికి అదే చేయాల్సి వస్తుంది. బాలయ్య కంటే చిరు ఫ్యాన్స్ మైత్రి పై ఎక్కువ గుస్సా గా ఉంటున్నారు.

అందుకే ఈ మధ్యే వారితో ఓ మీటింగ్ పెట్టుకొని వారిని చల్లార్చే ప్రయత్నం చేశారు మేకర్స్. అందులో భాగంగానే చిరంజీవి వాల్తేరు వీరయ్య కి సెట్ లో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. మీడియాతో ఇంట్రాక్షన్ పెట్టుకున్నారు. దీంతో ఇప్పుడు ‘వీరసింహా రెడ్డి’ కి అలాంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే ఆలోచన లేదా అంటూ మైత్రి ను బాలయ్య ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక థియేటర్స్ కూడా ఇటు తక్కువ అటు ఎక్కువ లేకుండా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ముందుగానే నిర్మాతలకు సూచిస్తున్నారు.

ఇది కూడా మైత్రి సంస్థ ను ఖంగారు పెడుతుంది. ఏదేమైనా మైత్రికి ఈ సంక్రాంతి సినిమాలతో పెద్ద ఇబ్బందే. ఒక సంస్థ నుండి సంక్రాంతికి రెండు బడా సినిమాలు రావడం ఇదే మొదటి సారి. ఆ రికార్డ్ మాత్రం మైత్రికే సొంతమైంది.

This post was last modified on December 31, 2022 7:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

54 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago