ఆన్ లైన్లో సంచలనం రేపుతున్న Balakrishna అన్ స్టాపబుల్ షో బాహుబలి ఎపిసోడ్ లో అధిక శాతం ప్రభాస్ పెళ్లి చుట్టే చర్చ జరగడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మేడం ఎవరూ ఎవరూ బాలయ్య అన్నేసిసార్లు పదే పదే అడగటం అక్కడితో ఆగక రామ్ చరణ్ కు ఫోన్ చేసి ఈ విషయం మీద అయిదు నిమిషాలకు పైగానే సంభాషణ కొనసాగించడం పలు ప్రశ్నలను లేవనెత్తింది. పైగా కృతి సనన్ ఫోటో చూపించి మరీ స్క్రీన్ మీద హైలైట్ చేయడం ఇంకో ట్విస్ట్. Prabhas దాన్ని సోషల్ మీడియా సృష్టేనని నవ్వుతు తేలిగ్గా కొట్టి పారేసినప్పటికీ ఈ టాపిక్ కి అంత టైం అవసరమా అనేదే అసలు డౌట్.
నిజానికి ఈ కృతి సనన్ ఇష్యూ ని నెటిజెన్లు ఎప్పుడో మర్చిపోయారు. భేడియా ప్రమోషన్లో అన్న మాటలను పట్టుకుని సోషల్ మీడియాలో ఓ రెండు రోజులు హడావిడి చేశారు కానీ ఆ తర్వాత ఆగిపోయింది. తిరిగి ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేయడం ద్వారా మరోసారి అనుమానాలకు తావిచ్చినట్టయింది. ఆది పురుష్ లో సీత పాత్ర చేస్తున్న కృతిని అదే పేరుతోనే బాలయ్య సంబోధించి గుర్తు చేయడం వెనుక ఉద్దేశం ఎవరికీ అంతు చిక్కలేదు. అయితే ఫ్యాన్స్ వెర్షన్ మరోలా ఉంది. కేవలం రెండు భాగాలుగా ఎపిసోడ్ ని ప్రీమియర్ చేయడం కోసమే ఎడిటింగ్ లో కోత వేయాల్సిన లెన్త్ ని అలాగే ఉంచేశారని అంటున్నారు.
ఏది ఎలా ఉన్నా కృతి మీద ఎక్కువ ఫోకస్ పడ్డ మాట వాస్తవం. ఒకవేళ త్వరగా తేల్చాయాలి అనుకుంటే నేరుగా ఆమెకే ఫోన్ చేసినా సరిపోయేది. దేశవిదేశాల్లో ఎక్కడ ఉన్నా కనెక్ట్ కావడం క్షణాల్లో పని కదా. అనుష్కను సైతం ఇన్ డైరెక్ట్ గా గుర్తు చేశారు కానీ ఆమె ఇంటి పేరు తప్ప ఇంకేమి వినిపించలేదు. మొత్తానికి ప్రభాస్ పెళ్లి గురించిన సస్పెన్స్ ఇందులోనూ కొనసాగింది. వచ్చే వారం గోపిచంద్ తోనూ దీనికి సంబంధించిన టాపిక్ ఉంది కానీ అప్పుడైనా క్లారిటీ వచ్చే అవకాశాలు తక్కువే. ఇప్పటికే వంద మిలియన్ నిమిషాల వ్యూస్ దాటేసిన బాహుబలి ఎపిసోడ్ ఇంకెన్ని సంచలనాలు రేపనుందో.
This post was last modified on December 31, 2022 11:06 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…