సంక్రాంతి సినిమాలకు టెన్షన్

క్రిస్మస్ సినిమాల సందడి పూర్తయింది. ఇక ప్రేక్షకుల చూపు సంక్రాంతి సినిమాల మీదే ఉన్నాయి. వచ్చే ఏడాది పొంగల్ బరిలో చిరు , బాలయ్య బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతుండటంతో మూవీ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతానికి రెండు సినిమాలకు షూటింగ్స్ క్లైమాక్స్ వచ్చేశాయి. ఓ వైపు ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు.

ఇదే సంక్రాంతికి విజయ్ , అజిత్ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో విడుదల కాబోతున్నాయి. దిల్ రాజు ‘వారసుడు’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక మైత్రి నిర్మాతలు కూడా రెండు సినిమాలపై గట్టిగా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారు. యూవీ క్రియేషన్స్ నుండి కూడా ఓ చిన్న సినిమా బరిలో దిగింది. యూవీ నిర్మాతలు ఈ సీజన్ లో తమ సినిమాకు కూడా ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.

ఇప్పటికే సంక్రాంతి సినిమాలకు సంబంధించి భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాల నిర్మలందరూ భయబ్రాంతులతో అడుగేసే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మళ్ళీ కోవిడ్ 19 కేసులు పెరుగుతుండటంతో మాస్క్ తప్పనిసరి అని అంటూ ప్రచారం జరుగుతుంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మళ్ళీ కరోన ఎంటరైతే ఎలా పోరాటం చేయాలనే ప్లాన్స్ తో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. చైనాలో ఇప్పటికే కోవిడ్ మరణాలు ఎక్కువవుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మళ్ళీ భయం మొదలైంది. చాలా మంది మాస్కులతో బయటికొస్తున్నారు.

మరి ఈ క్రమంలో వచ్చే సంక్రాంతికి జనవరిలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందా ? అనే డైలమాలో పడ్డారు నిర్మాతలు. తమ సినిమాలపై పెట్టుకున్న ఆశలను గుర్తుచేసుకుంటూ లోలోపల భయపడుతున్నారు. ఇక్కడ కోవిడ్ ఎఫెక్ట్ అంతగా లేకపోతే పర్లేదు కానీ లేదంటే సంక్రాంతి సినిమాలపై గట్టి ఎఫెక్ట్ పడుతుంది.