గత నెల విడుదలైన దృశ్యం 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేసిన బాలీవుడ్ ఇప్పుడు 23న రిలీజ్ కాబోతున్న సర్కస్ మీద గురి పెట్టింది. రణ్వీర్ సింగ్ హీరోగా డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. యాక్షన్ అయినా సింగం అయినా చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి కామెడీ డ్రామా అయినా తనదైన శైలిలో మాస్ టచ్ ఇస్తాడని గుర్తింపు ఉన్న ఇతని మీద పెద్ద అంచనాలే ఉన్నాయి. ప్రమోషన్లు బలంగా చేశారు. ట్రైలర్ లో ఎంటర్ టైన్మెంట్ కనిపించింది కానీ ఆ స్థాయిలో సినిమా మొత్తం ఉంటేనే హిట్టు కొడుతుంది లేదంటే రణ్వీర్ సింగ్ కు ఈ ఏడాది మరో షాక్ తప్పదు.
ఇందులో ఇద్దరు హీరోయిన్లు. దీపికా పదుకునే మాత్రమే హైలైట్ అవుతుండగా పూజా హెగ్డేని టీమ్ పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. తను ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ షూటింగ్ తో పాటు మహేష్ బాబు 28తో బిజీగా ఉంది కానీ వీలు చూసుకుని రమ్మంటే కాదనలేదుగా. అయినా కూడా తన కన్నా ఎక్కువగా దీపికా పేరే వినిపిస్తోంది. ప్రాధాన్యత విషయంలో ముంబై మీడియా భార్యాభర్తల వైపే మొగ్గు చూపిస్తోంది. పైగా ఆ మధ్య వదిలిన వీడియో సాంగ్ లో రణ్వీర్ దీపికల జోడి, డాన్సు కనువిందుగా ఉండటంతో పూజా పాత్ర నామమాత్రమేనా అనే అనుమానం కలగడం సహజం.
టాలీవుడ్ లో ఎంత దివ్యమైన కెరీర్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లోనూ నెగ్గాలని పూజా హెగ్డే ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది. 2016లో హృతిక్ రోషన్ తో మోహెన్జొదారోతో డెబ్యూ చేసినప్పుడు అది డిజాస్టర్ కొట్టింది ఆ తర్వాత హౌస్ ఫుల్ 4 చేసింది కానీ అందులో క్యాస్టింగ్ ఎక్కువ ఉండటంతో గుంపులో గోవిందా అయ్యింది. రాధే శ్యామ్ హిందీలోనూ ఏమంత గొప్పగా ఆడలేదు. అయినా పట్టు వదలకుండా మరో రెండు ఒప్పేసుకుంది. తీరా చూస్తే సర్కస్ బుకింగ్స్ ఏమంత స్పీడ్ గా లేవు. టాక్ వస్తేనే నిలబడుతుంది. మరి సీనియర్ సల్లు భాయ్ కి జోడిగా నటించిన కిభాకిజా అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on December 21, 2022 11:43 am
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…