గత నెల విడుదలైన దృశ్యం 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేసిన బాలీవుడ్ ఇప్పుడు 23న రిలీజ్ కాబోతున్న సర్కస్ మీద గురి పెట్టింది. రణ్వీర్ సింగ్ హీరోగా డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. యాక్షన్ అయినా సింగం అయినా చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి కామెడీ డ్రామా అయినా తనదైన శైలిలో మాస్ టచ్ ఇస్తాడని గుర్తింపు ఉన్న ఇతని మీద పెద్ద అంచనాలే ఉన్నాయి. ప్రమోషన్లు బలంగా చేశారు. ట్రైలర్ లో ఎంటర్ టైన్మెంట్ కనిపించింది కానీ ఆ స్థాయిలో సినిమా మొత్తం ఉంటేనే హిట్టు కొడుతుంది లేదంటే రణ్వీర్ సింగ్ కు ఈ ఏడాది మరో షాక్ తప్పదు.
ఇందులో ఇద్దరు హీరోయిన్లు. దీపికా పదుకునే మాత్రమే హైలైట్ అవుతుండగా పూజా హెగ్డేని టీమ్ పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. తను ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ షూటింగ్ తో పాటు మహేష్ బాబు 28తో బిజీగా ఉంది కానీ వీలు చూసుకుని రమ్మంటే కాదనలేదుగా. అయినా కూడా తన కన్నా ఎక్కువగా దీపికా పేరే వినిపిస్తోంది. ప్రాధాన్యత విషయంలో ముంబై మీడియా భార్యాభర్తల వైపే మొగ్గు చూపిస్తోంది. పైగా ఆ మధ్య వదిలిన వీడియో సాంగ్ లో రణ్వీర్ దీపికల జోడి, డాన్సు కనువిందుగా ఉండటంతో పూజా పాత్ర నామమాత్రమేనా అనే అనుమానం కలగడం సహజం.
టాలీవుడ్ లో ఎంత దివ్యమైన కెరీర్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లోనూ నెగ్గాలని పూజా హెగ్డే ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది. 2016లో హృతిక్ రోషన్ తో మోహెన్జొదారోతో డెబ్యూ చేసినప్పుడు అది డిజాస్టర్ కొట్టింది ఆ తర్వాత హౌస్ ఫుల్ 4 చేసింది కానీ అందులో క్యాస్టింగ్ ఎక్కువ ఉండటంతో గుంపులో గోవిందా అయ్యింది. రాధే శ్యామ్ హిందీలోనూ ఏమంత గొప్పగా ఆడలేదు. అయినా పట్టు వదలకుండా మరో రెండు ఒప్పేసుకుంది. తీరా చూస్తే సర్కస్ బుకింగ్స్ ఏమంత స్పీడ్ గా లేవు. టాక్ వస్తేనే నిలబడుతుంది. మరి సీనియర్ సల్లు భాయ్ కి జోడిగా నటించిన కిభాకిజా అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on December 21, 2022 11:43 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…