Movie News

కమెడియన్ చేపల పులుసు సూపర్ హిట్

జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్లు చాలామంది జీవితంలో బాగానే స్థిరపడ్డారు. వారిలో కిరాక్ ఆర్పీ ఒకడు. నెల్లూరు యాసలో అతను జబర్దస్త్ స్కిట్లలో పండించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడ వచ్చిన పేరుతో పెద్ద ఎత్తున ఈవెంట్లు చేయడం.. వేరే షోల్లో, సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో అతడి దశ తిరిగిపోయింది.

ఐతే మిగతా కమెడియన్లలా కేవలం కామెడీకి పరిమితం అయిపోకుండా ఇటీవలే అతనో వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం.. కర్రీ పాయింట్ కావడం విశేషం. కర్రీ పాయింట్ ఏమైనా పెద్ద వ్యాపారమా అని తీసిపడేయకండి. అతను పెట్టింది మామూలు కర్రీ పాయింట్ కాదు. నెల్లూరు చేపల పులుసు మాత్రమే అమ్మే కర్రీ పాయింట్. ఆంధ్రా ప్రాంతాల్లో చేపల పులుసుకు ఫేమస్ అయిన వాటిలో నెల్లూరు ఒకటి. తన ఊరి టేస్టు మిగతా వాళ్లకు కూడా పరిచయం చేయడానికి అతను కొంచెం పెద్ద స్థాయిలోనే కర్రీ పాయింట్ పెట్టాడు.

రెస్టారెంట్ కాకుండా కేవలం టేక్ అవే.. అది కూడా చేపల పులుసు మాత్రమే అమ్మేలా కూకట్ పల్లిలో ఈ వ్యాపారం మొదులపెట్టాడు ఆర్పీ. అక్కడి నుంచి ఐదారు కిలోమీటర్ల అవతల కొంచెం గ్రామీణ టచ్ ఉన్న విశాలమైన ప్రాంతంలో పెద్ద కిచెన్ ఏర్పాటు చేశాడు. అక్కడ రెండంకెల సంఖ్యలో మనుషుల్ని పెట్టుకుని భారీగా కిచెన్ నిర్మించాడు. పెద్ద పెద్ద పాత్రల్లో నాటు స్టయిల్లో చేపల పులుసు వండించడం.. అవే పాత్రల్ని కూకట్ పల్లికి తీసుకెళ్లి కర్రీ పాయింట్లో అమ్మడం.. ఇలా నడుస్తోంది వ్యవహారం.

మొత్తం ఇందుకోసం రూ.40 లక్షల పెట్టుబడి పెడితే.. కేవలం నెల రోజుల్లో ఆ మొత్తం వెనక్కి వచ్చేసిందంటే ఈ వ్యాపరం ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈ నెల్లూరు చేపల పులుసుకు సంబంధించిన కర్రీ పాయింట్ ఫేమస్ అయిపోవడంతో మీడియా ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు ఆర్పీ వద్దకు వరుస కట్టేశాయి. ఈ కర్రీ పాయింట్ స్టోరీ ఇప్పుడు యూట్యూబ్ ఛానెళ్లలో వైరల్ అవుతుండడం విశేషం.

This post was last modified on December 20, 2022 5:43 pm

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

3 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

3 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

4 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

4 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

4 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

4 hours ago