Movie News

శ్రీదేవి కూడా స్లో పాయిజన్ అవుతుందా

ఒకప్పటి ఫామ్ లో లేడని ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్న దేవిశ్రీప్రసాద్ కు వాల్తేరు వీరయ్య చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకపక్క దీనికి పోటీగా గత రెండేళ్లుగా చెలరేగిపోతున్న తమన్ కంపోజ్ చేస్తున్న వీరసింహారెడ్డి ఉంది. మరోవైపు చిరంజీవికి ఖైదీ నెంబర్ 150 తర్వాత ఇస్తున్న ఆల్బమ్ కావడంతో రెండు రకాలుగా దేవి మీద ఒత్తిడి ఉంది. తనపై నెగటివ్ క్యాంపైన్ ఏ స్థాయిలో ఉందంటే కేవలం బాస్ పార్టీ ప్రోమోకే సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో చెడుగుడు ఆడేశారు. కట్ చేస్తే ఇప్పుడదే ఛార్ట్ బస్టర్ అయిపోయి ఏకంగా ముప్పై మిలియన్ల వ్యూస్ దాటే దిశగా పరిగెత్తుతోంది. గ్రౌండ్ లెవెల్ లో దీని రీచ్ ఇంకో స్థాయిలో ఉంది

తాజాగా నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంటూ సాగే పాటను నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. ఫ్రాన్స్ లో షూట్ చేసిన విజువల్స్ బాగున్నాయి. సింపుల్ గా ఉన్నప్పటికీ మెగాస్టార్ సిగ్నేచర్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. అందరూ భయపడినట్టు దేవి గాత్రంతో కాకుండా వేరే సింగర్స్ తో పాడించారు. ట్యూన్ ఓ అద్భుతం అనే రేంజ్ లో లేదు కానీ డీసెంట్ గానే సాగింది. అయితే ట్విట్టర్ తదితర ప్లాట్ ఫార్మ్స్ లో మిశ్రమ స్పందనే దక్కుతోంది. ముందు ఇలా అనిపించి తర్వాత స్లో పాయిజన్ లా ఎక్కేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అది జరిగితే దేవికి రెండో పాట గండం తప్పినట్టే.

వీరసింహారెడ్డిలో జై బాలయ్య పాట బాస్ పార్టీని దాటలేకపోయినా మంచి స్పందనే దక్కించుకుంది. దానికన్నా ఎక్కువ ఫాస్ట్ బీట్ తో సాగే సుగుణ సుందరి వేగంగా దూసుకుపోతోంది. వచ్చే వారం ఐటెం సాంగ్ రాబోతోంది. ఇది అసలు బ్లాస్ట్ అని దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. మొత్తానికి పక్కా ప్లానింగ్ తో ఏదీ ఎక్కువ తక్కువ అనిపించకుండా రెండు సినిమాలకు మైత్రి సంస్థ చేస్తున్న ప్రమోషన్ ప్లానింగ్ ఇప్పటిదాకా చక్కగా సాగింది. ఇద్దరు హీరోల అభిమానులను సంతృప్తి పరిచేలా నడిపించారు. ఇంకొక్క ఇరవై రోజులు ఇదే కంటిన్యూ చేస్తే సరి

Share
Show comments

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

1 hour ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago