ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా.. తన బేనర్ నుంచి వస్తున్న అనువాద చిత్రం ‘వారసుడు’కు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు పట్టున్న ఏరియాల్లో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు దీటుగా స్క్రీన్లు అట్టిపెట్టేస్తున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. చిరు, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు లేని బాధ మిగతా వాళ్లకు ఎందుకు.. అయినా ముందు రిలీజ్ డేట్ ప్రకటించింది మా సినిమాకే.. అంటూ ఆయన తన వాదనను గట్టిగానే వినిపించారు.
ఈ లాజిక్కులు ఎలా ఉన్నా సరే.. చిరు, బాలయ్యల ముందు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ మార్కెట్ ఎంత.. ఆయన సినిమాకున్న క్రేజెంత అన్న ప్రశ్న తలెత్తితే.. ఆ సినిమాకు కేటాయిస్తున్న థియేటర్ల సంఖ్య సహేతుకంగా అనిపించడం లేదు. వైజాగ్ సిటీలో చిరు, బాలయ్యల సినిమాలకు తలో నాలుగు థియేటర్లు కేటాయించి.. విజయ్ చిత్రానికి 6 స్క్రీన్లు ఇచ్చారన్న ప్రచారం రాజు మీద విమర్శలకు మరింత ఊతమిస్తోంది.
ఇదిలా ఉంటే.. అంతిమంగా బాగున్న సినిమా ఆడుతుంది, మిగతావి పక్కకు వెళ్లిపోతాయని రాజు సహా ఇండస్ట్రీ పెద్దలందరూ అంటుంటారు. ఐతే ఒకవేళ ‘వారసుడు’ చిత్రానికి టాక్ బాలేకపోయి.. లేదంటే మనవాళ్లకు దాని పట్ల ఆసక్తి లేక ఆక్యుపెన్సీ అంతంతమాత్రంగా ఉండి.. అదే సమయంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు మంచి టాక్ వచ్చి వాటికి డిమాండ్ పెరిగితే, అందుకు తగ్గట్లుగా థియేటర్లు లేకపోతే.. అప్పుడు దిల్ రాజు తగ్గుతాడా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.
సంక్రాంతి సెలవులన్నీ అయిపోయాక, వారం పది రోజుల తర్వాత ‘వారసుడు’కు స్క్రీన్లు తగ్గించి వేరే వాటికి ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సెలవుల్లోనే ఎవరికైనా గరిష్ట ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ ‘వారసుడు’కు రెండో రోజు నుంచి డిమాండ్ లేని పక్షంలో వీకెండ్లోనే థియేటర్లు, షోలు తగ్గించి మిగతా చిత్రాలకు ఇచ్చినట్లయితే అప్పుడు దిల్ రాజుది పెద్ద మనసు, ఇండస్ట్రీ బాగు కోసమే ఆయన ఆలోచిస్తారని భావించవచ్చు. అలా కాకుంటే మాత్రం ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలకు విలువ ఉండదు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…