Movie News

దిల్ రాజు అప్పుడైనా తగ్గుతాడా?

ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా.. తన బేనర్ నుంచి వస్తున్న అనువాద చిత్రం ‘వారసుడు’కు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు పట్టున్న ఏరియాల్లో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు దీటుగా స్క్రీన్లు అట్టిపెట్టేస్తున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. చిరు, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు లేని బాధ మిగతా వాళ్లకు ఎందుకు.. అయినా ముందు రిలీజ్ డేట్ ప్రకటించింది మా సినిమాకే.. అంటూ ఆయన తన వాదనను గట్టిగానే వినిపించారు.

ఈ లాజిక్కులు ఎలా ఉన్నా సరే.. చిరు, బాలయ్యల ముందు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ మార్కెట్ ఎంత.. ఆయన సినిమాకున్న క్రేజెంత అన్న ప్రశ్న తలెత్తితే.. ఆ సినిమాకు కేటాయిస్తున్న థియేటర్ల సంఖ్య సహేతుకంగా అనిపించడం లేదు. వైజాగ్ సిటీలో చిరు, బాలయ్యల సినిమాలకు తలో నాలుగు థియేటర్లు కేటాయించి.. విజయ్ చిత్రానికి 6 స్క్రీన్లు ఇచ్చారన్న ప్రచారం రాజు మీద విమర్శలకు మరింత ఊతమిస్తోంది.

ఇదిలా ఉంటే.. అంతిమంగా బాగున్న సినిమా ఆడుతుంది, మిగతావి పక్కకు వెళ్లిపోతాయని రాజు సహా ఇండస్ట్రీ పెద్దలందరూ అంటుంటారు. ఐతే ఒకవేళ ‘వారసుడు’ చిత్రానికి టాక్ బాలేకపోయి.. లేదంటే మనవాళ్లకు దాని పట్ల ఆసక్తి లేక ఆక్యుపెన్సీ అంతంతమాత్రంగా ఉండి.. అదే సమయంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు మంచి టాక్ వచ్చి వాటికి డిమాండ్ పెరిగితే, అందుకు తగ్గట్లుగా థియేటర్లు లేకపోతే.. అప్పుడు దిల్ రాజు తగ్గుతాడా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.

సంక్రాంతి సెలవులన్నీ అయిపోయాక, వారం పది రోజుల తర్వాత ‘వారసుడు’కు స్క్రీన్లు తగ్గించి వేరే వాటికి ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సెలవుల్లోనే ఎవరికైనా గరిష్ట ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ ‘వారసుడు’కు రెండో రోజు నుంచి డిమాండ్ లేని పక్షంలో వీకెండ్లోనే థియేటర్లు, షోలు తగ్గించి మిగతా చిత్రాలకు ఇచ్చినట్లయితే అప్పుడు దిల్ రాజుది పెద్ద మనసు, ఇండస్ట్రీ బాగు కోసమే ఆయన ఆలోచిస్తారని భావించవచ్చు. అలా కాకుంటే మాత్రం ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలకు విలువ ఉండదు.

This post was last modified on December 18, 2022 10:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

10 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

50 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago