Movie News

తప్పు ఎవరిదైనా శిక్ష అభిమానులకే

పండగ థియేటర్ల గొడవ విషయంలో ఎవరికి వారు మా తప్పేం లేదని చెప్పేసుకుంటున్నారు. దిల్ రాజు వారసుడు సంక్రాంతికి వస్తుందని నేనే ముందు చెప్పాను, మైత్రి వాళ్ళు ఒకేసారి రెండు పెద్ద హీరోల సినిమాలు తీసుకొస్తే దానికి నేనెలా బాధ్యుణ్ణి అవుతానని అంటున్నారు. మరోవైపు ఏడాదికి ఒకసారి వచ్చే కీలకమైన సీజన్ కాబట్టి చిరంజీవి బాలకృష్ణలు ఇద్దరూ అదే డేట్ కావాలని కోరుకోవడంలో తప్పేముందని మైత్రి వాళ్ళు భావిస్తున్నారు. అందరూ రైటే అందరూ రాంగే అన్నట్టుంది పరిస్థితి. మరోవైపు బిజినెస్ అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. పేర్లు, ఏరియాల వారిగా కౌంట్ బయటికి చెప్పడం లేదు కానీ గుట్టుగా లాక్ అవుతున్నాయి

ఈ పరిణామం వల్ల వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు అన్యాయం జరుగుతోందన్నది ఫ్యాన్స్ బాధ. ఉదాహరణకు వైజాగ్ లో ఆరు వారసుడుకి చిరు బాలయ్యలకు చెరో నాలుగు కేటాయించారనే వార్త ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు మార్కెట్ పెద్దగా లేని విజయ్ ని కేవలం తాను నిర్మించిన కారణంగా దిల్ రాజు ఇంత పెద్ద రిలీజ్ ఎలా ఇస్తారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. తమిళనాడులో మాత్రం వరిసుకి ఎక్స్ ట్రా స్క్రీన్లు కావాలి ఇక్కడ మాత్రం ఇవ్వకూడదనే ధోరణి ఎంత వరకు కరెక్టని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ విషయం మీదే దిల్ రాజు ప్రెస్ మీట్ పెడితే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.

ఎవరికి ఎక్కువైనా తక్కువైనా చివరికి శిక్షగా ఫీలయ్యేది మాత్రం అభిమానులే. ఎందుకంటే ఇద్దరు హీరోల ఊర మాస్ బొమ్మలు మంచి రికార్డులతో హిట్లు కొట్టాలని ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో రెండు డబ్బింగ్ మూవీస్, రెండు చిన్న సినిమాలతో థియేటర్లు పంచుకోవాల్సి రావడం వల్ల చిరు బాలయ్య స్టామినాలకు తగ్గట్టు కలెక్షన్లు రావని బాధపడుతున్నారు. అదే జరిగితే వీళ్ళ మార్కెట్ గురించి సోషల్ మీడియాలో అనవసరంగా నెగటివ్ క్యాంపైన్ జరుగుతుంది. అది ఇంకో నరకం. టైం చూస్తేనేమో దగ్గర పడుతోంది. పాతిక రోజులు ఇట్టే కరిగిపోతాయి. ఇంకా ఏమేం జరగనుందో చూడాలి.

This post was last modified on December 17, 2022 5:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

53 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago