‘పెళ్లి సందడి’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ కొట్టి అక్కడి నుండి నైజాం రాజు గా ఎదిగి దిల్ సినిమాతో నిర్మాతగా కేరీర్ మొదలు పెట్టాడు దిల్ రాజు. ఇప్పుడు స్టార్ నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నాడు.
ప్రస్తుతం హిందీ, తమిళ్ లో కూడా నిర్మాతగా సినిమాలు తీస్తున్న దిల్ రాజు పై కొన్నేళ్లుగా ఓ కామెంట్ వినిపిస్తుంటుంది. కెరీర్ ఆరంభంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దిల్ రాజు ప్రస్తుతం కొత్త దర్శకులతో సినిమాలు చేయడం లేదనేది ఆ కామెంట్.
తాజాగా ఓ చిన్న సినిమాతో ఆ కామెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు దిల్. తన ఫ్యామిలీ నుండి హర్షిత్ రెడ్డి , హన్శిత లను నిర్మాతలుగా పరిచయం చేస్తూ కాన్సెప్ట్ సినిమాలు తీసే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా మరో బేనర్ స్టార్ట్ చేశారు రాజు. దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే సబ్ బేనర్ స్టార్ట్ చేసి కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్నాడు.
ఈ బేనర్ నుండి కమెడియన్ వేణు టిల్లును మొదటి దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. కమెడియన్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి ‘బలగం’ అనే సినిమా రాబోతుంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి తన కొత్త బేనర్ లోగో కూడా లాంచ్ చేశారు రాజు.
వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు పోస్టర్ రిలీజ్ చేయగానే రాజు గారు ఎన్నాళ్లకెన్నాళ్ళకి కొత్త దర్శకుడితో సినిమా అంటూ సోషల్ మీడియా లో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇకపై ఇదే కంటిన్యూ చేసి మళ్ళీ మునుపటిలా కొత్త వారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. మరి దిల్ రాజు ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లా మొదట్లో అందించినట్టుగా ఉత్తమ సినిమాలను అందిస్తుందా ? చూడాలి.
This post was last modified on December 16, 2022 8:26 pm
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజంగానే పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా సాగుతున్నారు. గిరిజనుల సమస్యల…