ధమాకా.. డల్లుగా సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్కు మళ్లీ ఊపు తెస్తుందని అంచనా వేస్తున్న సినిమా. ‘హిట్-2’ తర్వాత సరైన సినిమా లేక టాలీవుడ్ బాక్సాపీస్ వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. గత వారం పేరుకు 17 సినిమాలు రిలీజయ్యాయి కానీ.. వాటిలో ఏదీ నిలబడలేదు.
ఈ వారం బాక్సాఫీస్ను పూర్తిగా ‘అవతార్-2’కే రాసిచ్చేశారు. వారం తర్వాత క్రిస్మస్ కానుకగా రెండు తెలుగు చిత్రాలు, రెండు అనువాదాలు రిలీజవుతుండగా.. అందులో ఎక్కువ అంచనాలు ఉన్నది రవితేజ సినిమా అయిన ‘ధమాకా’ మీదే.
తాజాగా లాంచ్ అయిన ట్రైలర్ ఈ నెల 23న మంచి మాస్ ట్రీట్ గ్యారెంటీ అన్న అంచనాలు రేకెత్తించింది. సినిమా మరీ కొత్తగా ఉంటుందన్న ఆశల్లేవు కానీ.. ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారెంటీ అనిపిస్తోంది. ఈ సినిమా హిట్టవడం రవితేజకు చాలా అవసరం. ఈ ఏడాది మాస్ రాజా నుంచి వచ్చిన ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ దారుణంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే.
ఐతే ఇంతకుముందు సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే.. ఇలా వరుసగా మూడు హిట్లు కొట్టిన రైటర్-డైరెక్టర్ జోడీ ప్రసన్న కుమార్ బెజవాడ-త్రినాథ రావు నక్కిన నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ధమాకా’ మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయాలున్నాయి.
ముఖ్యంగా రైటర్ ప్రసన్న కుమార్ మీద యూత్కు బాగానే గురి ఉంది. అతడి కథలు అంత కొత్తగా ఏమీ ఉండవు. పాత కథలనే అటు ఇటు తిప్పి యూత్కు నచ్చే ఎంటర్టైన్మెంట్తో వడ్డిస్తుంటాడతను. గతంలో విజయ భాస్కర్ ఎలా అయితే త్రివిక్రమ్ అండతో ఎలా హిట్లు కొట్టాడో.. త్రినాథరావు సైతం ప్రసన్నకుమార్ సపోర్ట్తో సక్సెస్లు సాధిస్తున్నాడనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.
అందులోనూ ఈసారి కథ, మాటలతో సరిపెట్టకుండా ‘స్క్రీన్ ప్లే’ క్రెడిట్ కూడా ప్రసన్న కుమారే తీసుకున్నాడు. దర్శకుడిగా మారడానికి కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇలా హోల్ రైటింగ్ క్రెడిట్ తనే తీసుకోవడం విశేషం. కాబట్టి సినిమా బాగా ఆడితే మార్మోగేది అతడి పేరే. ఎక్కువ క్రెడిట్ దక్కేది తనకే నాగార్జున చిత్రంతో అతను దర్శకుడిగా మారనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంల ో ఈ చిత్రం హిట్టయితే ప్రసన్న కుమార్ రాత మారిపోయినట్లే.
This post was last modified on December 16, 2022 8:30 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…