అద్నాన్ సమి.. పేరుకు పాకిస్థానీ అయినా.. ఈ లెజెండరీ సింగర్కు ఎక్కువ పేరు వచ్చింది ఇండియన్ సినిమాలతోనే. ఒక దశలో తన పాటతో ఎంతగా ఆకట్టుకున్నాడో.. 200 కిలోలకు పైగా బరువుతో, భారీ అవతారంలో అదే స్థాయిలో జనాల దృష్టిని ఆకర్షించాడు. అంత బరువున్న వాడు తర్వాత సర్జరీ చేయించుకుని సన్నగా మారడం ఓ సంచలనం. ఇక అద్నాన్ పాడిన హిందీ, తెలుగు పాటల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.
తెలుగులో నచ్చావే నైజాం పోరి (వర్షం), ఏ జిల్లా ఏ జిల్లా (శంకర్ దాదా ఎంబీబీఎస్), భూగోళమంత సంచిలోనా (శంకర్ దాదా జిందాబాద్), నేనంటే నాకు (ఊసరవెల్లి) లాంటి పాటలతో ఆయన ఇక్కడ బాగానే అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ పాటలన్నీ కూడా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినవే అన్న సంగతి తెలిసిందే. ఐతే ‘ఊసరవెల్లి’ తర్వాత అద్నాన్ తెలుగులో పాటలు పాడినట్లు లేడు.
పాకిస్థాన్కు గుడ్బై చెప్పేసి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుని మనదేశంలోనే సెటిలైపోయిన అద్నాన్ సమి.. ఎక్కువ హిందీ చిత్రాలకే పరిమితం అయిపోయాడు. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ సింగర్ తెలుగులో పాట పాడడం విశేషం. ఇప్పటికే చిరంజీవికి రెండు పాటలు పాడిన సమి.. రీఎంట్రీ కూడా చిరు సినిమాతోనే ఇస్తున్నాడు.
మరోసారి దేవిశ్రీ ప్రసాదే ఆయనతో పాట పాడించాడు. ‘వాల్తేరు వీరయ్య’ కోసం ఇదంతా జరిగింది. ఈ సినిమా నుంచి ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ అంటూ సాగే పాట గురించి చిరు స్వయంగా లీక్ చేసిన సంగతి తెలిసిందే. చిరు లీక్ చేసిన ట్రాక్లో దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ వినిపించింది. నిజంగా ఆ పాటను దేవీనే పాడాడేమో అని కొందరు కంగారు పడ్డారు. కానీ ఒరిజినల్ సాంగ్ పాడింది అద్నాన్ సమి అని తెలిసి హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంత గ్యాప్ తర్వాత చిరు కోసం మళ్లీ అద్నాన్ తెలుగు పాట పాడడంతో అది చాలా స్పెషల్గా ఉంటుందన్న అంచనాతో ఉన్నారు. కొన్ని రోజుల్లోనే ఈ పాట రిలీజ్ కాబోతోంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…