కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘బింబిసార’ తో ఈ ఏడాది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అనిపించుకున్నాడు వసిష్ఠ. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటున్నాడు. నెక్స్ట్ గీతా ఆర్ట్స్ నుండి ఓ అడ్వాన్స్ అందుకున్నాడు. అలాగే బాలయ్య కూడా సినిమా చేద్దాం కథ సిద్దం చేసుకోమని చెప్పేశాడు. మరో వైపు బింబిసార 2 కథ రెడీ గా ఉంది. వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళబోతుందని చెప్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే వసిష్ఠ రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీ కాంత్ కి ఓ స్క్రిప్ట్ చెప్పి వచ్చాడు. బింబిసార రిలీజ్ అయిన వెంటనే డైరెక్ట్ గా చెన్నై లో వాలిపోయి రజినీతో ప్రాజెక్ట్ లాక్ చేసుకొచ్చాడు. తాజాగా రజినీ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి స్పెషల్ గా విషెస్ చెప్పాడు. ఈ పోస్ట్ తో వసిష్ఠ రజినీతో చేయబోయే ప్రాజెక్ట్ ను ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసినట్టయింది.
అయితే ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదు. ఇంకా టైం పట్టొచ్చు. బింబిసార 2 తర్వాతే వసిష్ఠ నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ ఉండనుంది. మరి ఆ సినిమా రిలీజ్ తర్వాతే సూపర్ స్టార్ తో చేయబోయే ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి కళ్యాణ్ రామ్ ను ఎవరూ ఊహించని రోల్ లో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి మేస్మరైజ్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ సూపర్ స్టార్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…