మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగి పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ లో పాల్గొన్న సినిమాకు విరూపాక్ష టైటిల్ ని లాక్ చేశారు. ఇది ముందే లీకైనప్పటికీ అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. రిపబ్లిక్ లో మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ ఆడియన్స్ ని మెప్పించడంతో దేవ కట్టా ఫెయిలవ్వడంతో సాయి ధరమ్ తేజ్ మరో విభిన్న అంశంతో వస్తున్నాడు. పల్లెటూళ్ళలో ఉండే మూఢనమ్మకాలు, బ్లాక్ మేజిక్ అంటే చేతబడి లాంటి వ్యవహారాలు, జనంలో ఉండే అజ్ఞానం భయం తాలూకు పరిణామాల నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ దండు ఇందులో చూపించబోతున్నాడు. సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
విరూపాక్షలో తీసుకున్న బ్యాక్ డ్రాప్ ఆసక్తి కలిగించేలా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో అది పర్ఫెక్ట్ గా ఎలివేట్ అయ్యింది. సాధారణంగా ఇలాంటి కథలు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ఎక్కువగా వస్తుంటాయి. మన దర్శకులెవరూ ఇలాంటివి ట్రై చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఇటీవలే వచ్చిన మసూదలోనూ దీనికి సంబంధించిన పాయింట్ తీసుకుని హారర్ లవర్స్ ని మెప్పించారు. కానీ సాయి ధరమ్ తో పూర్తిగా దెయ్యాలు భూతాలను డీల్ చేయలేరు కాబట్టి కమర్షియల్ కోటింగ్ ని జోడించి తన ఇమేజ్ కి తగ్గట్టు సెట్ చేశారు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శామ్ దత్ ఛాయాగ్రహణం టెక్నికల్ గా తోడ్పడనున్నాయి.
విడుదల తేదీని 2023 ఏప్రిల్ 21కి ముందస్తుగా లాక్ చేశారు. ప్రస్తుతానికి ఆ డేట్ కి ఎలాంటి క్లాష్ లేదు. అదే నెల 14న చిరంజీవి భోళా శంకర్, రజినీకాంత్ జైలర్ లు వస్తున్నాయి. ఒకవేళ శాకుంతలం ఫిబ్రవరిలో రాకపోతే ఈ టైంలోనే వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి గ్యాప్ తీసుకున్న సుప్రీమ్ హీరోకి సరైన సినిమానే తగిలింది. మూస ప్రేమకథలు, సూట్ కానీ ఓవర్ ఎలివేషన్ల మసాలా సినిమాలు కాకుండా ఇలా విరూపాక్ష లాంటి జానర్ ని ఎంచుకోవడం మంచి ప్రయత్నమే. బయట ప్రపంచానికి అంతగా తెలియని రహస్య ప్రదేశం లాంటి గ్రామంలో జరిగే కథే ఈ విరూపాక్షని తెలిసింది.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…