కొందరు హీరోయిన్లకు అనుకోకుండానే చాలా అరుదైన కాంబోలు దొరుకుతాయి. కావాలని ప్లాన్ చేసింది కాకపోయినా అలా కుదిరిపోతుంది. ఒకే బ్యానర్ లో ఇద్దరు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి బాలకృష్ణలతో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలో వాళ్లకు జోడిగా నటిస్తున్న శృతి హాసన్ కు అలాంటి ఆఫరే వచ్చింది. కానీ ఆ సినిమాల ఫస్ట్ లిరికల్ వీడియో వీడియోలు వచ్చి చెరో పది మిలియన్ల వ్యూస్ దాటేసినా ఆమె నుంచి ఎలాంటి ట్వీట్ కానీ స్పందన కానీ లేదు. ఆ పాటల్లో లేకపోవచ్చు కానీ మొత్తం మూవీలో కథానాయిక తనే కాబట్టి ఏదో రూపంలో రెస్పాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ కామెంట్
సరే ప్రమోషన్లకో ప్రీ రిలీజ్ ఈవెంట్ కో వస్తుందనుకుంటే దానికన్నాముందు ఇంకా పాటల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. చెరో డ్యూయెట్ పూర్తి చేయాల్సి ఉందని కాకపోతే నెల రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఒకరికి హ్యాండ్ ఇవ్వొచ్చనే టాక్ కూడా గట్టిగా ఉంది. అందుకే కంపోజ్ చేయించిన ఆల్బమ్స్ లో ముందు అది రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. గోపీచంద్ మలినేనితో వరసగా సినిమాలు చేసిన దృష్ట్యా అతనికి సహకరిస్తుందా లేక చిరుతో మళ్ళీ జట్టు కట్టే ఛాన్స్ వస్తుందో లేదోనని మెగాస్టార్ కు మొగ్గు చూపుతుందా చూడాలి. లేదూ బాలయ్యదీ వదులుకోకూడదంటే నెలంతా హైదరాబాద్లో ఉంటే సరి.
ఒకప్పుడు విజయశాంతి రాధ లాంటి వాళ్ళు ఇలా చిరంజీవి బాలకృష్ణలతో ఒకేసారి ఆడిపాడేవాళ్లు. కానీ తర్వాత ఎవరికీ అలా కుదరలేదు. ఇన్నేళ్ల తర్వాత శృతి ఆ ఛాన్స్ కొట్టేసింది. కాకపోతే ఇప్పటిదాకా బయటికి కనిపించలేదు. జనవరి 12 వీరసింహారెడ్డి, 13న వాల్తేర్ వీరయ్య రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది కానీ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. వారసుడు అఫీషియల్ గా 12ని లాక్ చేసుకుంది. అజిత్ తునివు ఈ రోజో రేపో ఫైనల్ చేస్తారు. ప్రమోషన్ల పరంగానూ స్పీడ్ పెంచాలి కాబట్టి శృతి హాసన్ ఈ నెలలో సగమైనా అందుబాటులో ఉండటం చాలా అవసరం.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…