కొందరు హీరోయిన్లకు అనుకోకుండానే చాలా అరుదైన కాంబోలు దొరుకుతాయి. కావాలని ప్లాన్ చేసింది కాకపోయినా అలా కుదిరిపోతుంది. ఒకే బ్యానర్ లో ఇద్దరు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి బాలకృష్ణలతో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలో వాళ్లకు జోడిగా నటిస్తున్న శృతి హాసన్ కు అలాంటి ఆఫరే వచ్చింది. కానీ ఆ సినిమాల ఫస్ట్ లిరికల్ వీడియో వీడియోలు వచ్చి చెరో పది మిలియన్ల వ్యూస్ దాటేసినా ఆమె నుంచి ఎలాంటి ట్వీట్ కానీ స్పందన కానీ లేదు. ఆ పాటల్లో లేకపోవచ్చు కానీ మొత్తం మూవీలో కథానాయిక తనే కాబట్టి ఏదో రూపంలో రెస్పాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ కామెంట్
సరే ప్రమోషన్లకో ప్రీ రిలీజ్ ఈవెంట్ కో వస్తుందనుకుంటే దానికన్నాముందు ఇంకా పాటల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. చెరో డ్యూయెట్ పూర్తి చేయాల్సి ఉందని కాకపోతే నెల రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఒకరికి హ్యాండ్ ఇవ్వొచ్చనే టాక్ కూడా గట్టిగా ఉంది. అందుకే కంపోజ్ చేయించిన ఆల్బమ్స్ లో ముందు అది రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. గోపీచంద్ మలినేనితో వరసగా సినిమాలు చేసిన దృష్ట్యా అతనికి సహకరిస్తుందా లేక చిరుతో మళ్ళీ జట్టు కట్టే ఛాన్స్ వస్తుందో లేదోనని మెగాస్టార్ కు మొగ్గు చూపుతుందా చూడాలి. లేదూ బాలయ్యదీ వదులుకోకూడదంటే నెలంతా హైదరాబాద్లో ఉంటే సరి.
ఒకప్పుడు విజయశాంతి రాధ లాంటి వాళ్ళు ఇలా చిరంజీవి బాలకృష్ణలతో ఒకేసారి ఆడిపాడేవాళ్లు. కానీ తర్వాత ఎవరికీ అలా కుదరలేదు. ఇన్నేళ్ల తర్వాత శృతి ఆ ఛాన్స్ కొట్టేసింది. కాకపోతే ఇప్పటిదాకా బయటికి కనిపించలేదు. జనవరి 12 వీరసింహారెడ్డి, 13న వాల్తేర్ వీరయ్య రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది కానీ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. వారసుడు అఫీషియల్ గా 12ని లాక్ చేసుకుంది. అజిత్ తునివు ఈ రోజో రేపో ఫైనల్ చేస్తారు. ప్రమోషన్ల పరంగానూ స్పీడ్ పెంచాలి కాబట్టి శృతి హాసన్ ఈ నెలలో సగమైనా అందుబాటులో ఉండటం చాలా అవసరం.
This post was last modified on December 1, 2022 11:54 am
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…