లైగర్ సినిమా విడుదలై మూడు నెలలు దాటిపోయింది. కానీ దాని తాలూకు చేదు అనుభవాలు మాత్రం చిత్ర బృందాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమా వల్ల దారుణంగా నష్టపోయిన బయ్యర్లు పరిహారం కోసం పూరి జగన్నాథ్ ఆఫీసు ముందు ధర్నాకు సిద్ధం కావడం.. వారికి పూరి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం.. దీని చుట్టూ నడిచిన వివాదం తెలిసిందే. ఆ వివాదం కాస్త సద్దుమణిగేలోపే కొత్త తలనొప్పి తప్పలేదు పూరి అండ్ కోకు.
‘లైగర్’ పెట్టుబడుల్లో బ్లాక్మనీ ఉందని.. కొందరు రాజకీయ నేతలు, బడా బాబులు ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశారనే అనుమానంతం కొన్ని రోజులుగా ఈడీ అధికారులు ఈ టీంలో ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను ఈడీ అధికారులు విచారించడం తెలిసిందే. తాజాగా లైగర్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈడీ అధికారుల విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అతను హైదరాబాద్ల ఈడీ ఈఫీసుకు వచ్చాడు.
దాదాపు రాత్ర 8 గంటల దాకా విచారణ జరగడం విశేషం. ఆ తర్వాత బయటికి వచ్చిన విజయ్ కోసం మీడియాకు కాచుకుని ఉంది. అతడిపై ప్రశ్నల వర్షం కురిపించింది. వీటికి బదులిస్తూ.. సినిమాల వల్ల వచ్చే పాపులారిటీ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా తప్పవని.. అందులో భాగంగానే ఇలా ఈడీ విచారణకు హాజరవ్వాల్సి వచ్చిందన్నట్లుగా మాట్లాడాడు విజయ్.
ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్పానని అతను వివరించాడు. మళ్లీ విచారణకు రావాలని అధికారులు కోరారా అని అడిగితే.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు విజయ్. ఎన్ని గంటల పాటు విచారణ జరిగిందని అడగ్గా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి అంటే మీరే లెక్కేసుకోండి అనేసి అక్కడి నుంచి బయల్దేరాడు విజయ్.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…