‘పుష్ప’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు తొలిసారి అనౌన్స్ చేసినపుడు.. ఇది పేరుకే పాన్ ఇండియా మూవీ అనుకున్నారు చాలామంది. మహా అయితే బన్నీకి కేరళలో ఫాలోయింగ్ ఉంది అక్కడ ఆడొచ్చేమో అనుకున్నారే తప్ప.. మిగతా భాషల్లో ఈ సినిమా సత్తా చాటుతుందని అంచనా వేయలేదు. అందులోనూ రిలీజ్ రోజు డివైడ్ టాక్ రావడంతో తెలుగులో అయినా సినిమా అనుకున్నట్లుగా ఆడుతుందనే అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ చిత్రం తెలుగును మించి ఇతర భాషల్లో విజయవంతం అయింది.
హిందీలో అయితే అసాధారణ వసూళ్లతో బ్లాక్బస్టర్ స్టేటస్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో బన్నీ డైలాగ్స్, మేనరిజమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. యూరప్లో జరిగే ఫుట్బాల్ లీగ్స్లో, యుఎస్లో డబ్ల్ల్యూడబ్ల్యూఈ పోటీల్లో బన్నీ మేనరిజమ్స్ను అనుకరించారంటే ఈ సినిమా రీచ్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ‘పుష్ప-2’ షూట్ జరుగుతుండగా.. ‘పుష్ప’ సినిమా రష్యా భాషలో పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధం అవుతుండడం విశేషం. డిసెంబరు 8న ఈ చిత్రం రష్యన్లో రిలీజ కానుంది. డిసెంబరు 1న రష్యా రాజధాని మాస్కోలో, 3న పీటర్స్బర్గ్లో ఈ ‘పుష్ప’కు స్పెషల్ ప్రిమియర్స్ కూడా వేయబోతున్నారు. బన్నీ, సుకుమార్ ఇతర టీం మెంబర్స్ ఈ ప్రిమియర్స్కు హాజరు కాబోతున్నారు. ఈ లోపు సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
ఇంతకుముందు ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేసిన ట్రైలర్నే రష్యన్ భాషలో వదిలారు. కొత్తగా మార్పులు చేర్పులేమీ లేవు.
ఐతే ఒక ప్రాంతీయ చిత్రం ఇలా రష్యన్ భాషలో అనువాదం కావడం.. డైలాగులన్నీ రష్యన్లో వినడం మన జనాలకు చాలా కొత్తగా, ఆశ్చర్యకరంగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా కథలో రష్యా కనెక్షన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. రష్యాలో తయారైన ఒక వస్తువుకు మూలం మన దగ్గరున్న ఎర్రచందనమే అన్నట్లు చూపిస్తారు. మరి ఈ సినిమాతో రష్యన్లు ఏమేర కనెక్టవుతారో చూడాలి.
This post was last modified on November 29, 2022 3:06 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…