ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోల పాత సినిమాల రీరిలీజ్ హంగామా నడుస్తోంది. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టింది తెలుగు అభిమానులే. పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, రెబల్, బిల్లా, వర్షం, బాద్షా.. ఇలా గత కొన్ని నెలల్లో చాలా సినిమాలే రీ రిలీజ్ అయ్యాయి. వాటిలో పోకిరి, జల్సా సినిమాలకు నెలకొన్న సందడి అలాంటిలాంటిది కాదు. ఇప్పుడు కోలీవుడ్ అభిమానులు సైతం ఈ ఒరవడిని అందిపుచ్చుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘బాబా’ను పెద్ద స్థాయిలో తమిళనాట రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 12న రజినీకాంత్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా తమిళనాట సందడి చేయబోతోంది. ఐతే ఈ రీ రిలీజ్లో కేవలం అభిమానులు మాత్రమే భాగస్వాములు కావడం లేదు. చిత్ర బృందం కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. బాబా సినిమాను యాజిటీజ్ రిలీజ్ చేయకుండా దానికి కొత్త సొబగులు అద్దుతుండడం విశేషం.
‘బాబా’ను రీ ఎడిట్ చేసి, కొన్ని మార్పులు చేర్పులతో రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్తగా మళ్లీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆయన సినిమా కోసం నరేటర్ అవతారం ఎత్తున్నట్లు తెలుస్తోంది. రజినీ ‘బాబా’ కోసం మళ్లీ డబ్బింగ్ చెబుతున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం మళ్లీ ‘బాబా’ కోసం వర్క్ చేశారట. మరి ఆయన అవసరం ఎందుకొచ్చిందో? ఐతే ఈ సినిమా మీద ఇంత శ్రద్ధ పెడుతుండడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రజినీ కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్లు ఉండగా.. డిజాస్టర్ అయిన ‘బాబా’ను రీ రిలీజ్ చేయడమే చాలామందికి నచ్చట్లేదు. ఆ సినిమాను ఇలా మళ్లీ విడుదల చేయడమే ఎక్కువ అనుకుంటే.. మళ్లీ దాని కోసం రజినీ, ఏఆర్ రెహమాన్ కష్టపడడం ఏంటి అంటున్నారు. ఎంత చేసినా సినిమా అంతకుమించి మెరుగుపడదని.. ఇదంతా వృథా ప్రయాస అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on November 28, 2022 5:39 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…