ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోల పాత సినిమాల రీరిలీజ్ హంగామా నడుస్తోంది. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టింది తెలుగు అభిమానులే. పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, రెబల్, బిల్లా, వర్షం, బాద్షా.. ఇలా గత కొన్ని నెలల్లో చాలా సినిమాలే రీ రిలీజ్ అయ్యాయి. వాటిలో పోకిరి, జల్సా సినిమాలకు నెలకొన్న సందడి అలాంటిలాంటిది కాదు. ఇప్పుడు కోలీవుడ్ అభిమానులు సైతం ఈ ఒరవడిని అందిపుచ్చుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘బాబా’ను పెద్ద స్థాయిలో తమిళనాట రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 12న రజినీకాంత్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా తమిళనాట సందడి చేయబోతోంది. ఐతే ఈ రీ రిలీజ్లో కేవలం అభిమానులు మాత్రమే భాగస్వాములు కావడం లేదు. చిత్ర బృందం కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. బాబా సినిమాను యాజిటీజ్ రిలీజ్ చేయకుండా దానికి కొత్త సొబగులు అద్దుతుండడం విశేషం.
‘బాబా’ను రీ ఎడిట్ చేసి, కొన్ని మార్పులు చేర్పులతో రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్తగా మళ్లీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆయన సినిమా కోసం నరేటర్ అవతారం ఎత్తున్నట్లు తెలుస్తోంది. రజినీ ‘బాబా’ కోసం మళ్లీ డబ్బింగ్ చెబుతున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం మళ్లీ ‘బాబా’ కోసం వర్క్ చేశారట. మరి ఆయన అవసరం ఎందుకొచ్చిందో? ఐతే ఈ సినిమా మీద ఇంత శ్రద్ధ పెడుతుండడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రజినీ కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్లు ఉండగా.. డిజాస్టర్ అయిన ‘బాబా’ను రీ రిలీజ్ చేయడమే చాలామందికి నచ్చట్లేదు. ఆ సినిమాను ఇలా మళ్లీ విడుదల చేయడమే ఎక్కువ అనుకుంటే.. మళ్లీ దాని కోసం రజినీ, ఏఆర్ రెహమాన్ కష్టపడడం ఏంటి అంటున్నారు. ఎంత చేసినా సినిమా అంతకుమించి మెరుగుపడదని.. ఇదంతా వృథా ప్రయాస అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on November 28, 2022 5:39 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…