Movie News

‘బాబా’ రీ రిలీజ్.. కొత్తగా రజినీ డబ్బింగ్

ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోల పాత సినిమాల రీరిలీజ్ హంగామా నడుస్తోంది. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టింది తెలుగు అభిమానులే. పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, రెబల్, బిల్లా, వర్షం, బాద్‌షా.. ఇలా గత కొన్ని నెలల్లో చాలా సినిమాలే రీ రిలీజ్ అయ్యాయి. వాటిలో పోకిరి, జల్సా సినిమాలకు నెలకొన్న సందడి అలాంటిలాంటిది కాదు. ఇప్పుడు కోలీవుడ్ అభిమానులు సైతం ఈ ఒరవడిని అందిపుచ్చుకుంటున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘బాబా’ను పెద్ద స్థాయిలో తమిళనాట రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 12న రజినీకాంత్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా తమిళనాట సందడి చేయబోతోంది. ఐతే ఈ రీ రిలీజ్‌లో కేవలం అభిమానులు మాత్రమే భాగస్వాములు కావడం లేదు. చిత్ర బృందం కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. బాబా సినిమాను యాజిటీజ్ రిలీజ్ చేయకుండా దానికి కొత్త సొబగులు అద్దుతుండడం విశేషం.

‘బాబా’ను రీ ఎడిట్ చేసి, కొన్ని మార్పులు చేర్పులతో రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్తగా మళ్లీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆయన సినిమా కోసం నరేటర్ అవతారం ఎత్తున్నట్లు తెలుస్తోంది. రజినీ ‘బాబా’ కోసం మళ్లీ డబ్బింగ్ చెబుతున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం మళ్లీ ‘బాబా’ కోసం వర్క్ చేశారట. మరి ఆయన అవసరం ఎందుకొచ్చిందో? ఐతే ఈ సినిమా మీద ఇంత శ్రద్ధ పెడుతుండడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రజినీ కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉండగా.. డిజాస్టర్ అయిన ‘బాబా’ను రీ రిలీజ్ చేయడమే చాలామందికి నచ్చట్లేదు. ఆ సినిమాను ఇలా మళ్లీ విడుదల చేయడమే ఎక్కువ అనుకుంటే.. మళ్లీ దాని కోసం రజినీ, ఏఆర్ రెహమాన్ కష్టపడడం ఏంటి అంటున్నారు. ఎంత చేసినా సినిమా అంతకుమించి మెరుగుపడదని.. ఇదంతా వృథా ప్రయాస అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on November 28, 2022 5:39 pm

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

3 minutes ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

33 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

49 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

1 hour ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

3 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago