నెల కిందట తన అనారోగ్యం గురించి సమంత తొలిసారి వెల్లడించినపుడు సామాన్య అభిమానులే కాదు.. సెలబ్రెటీలు సైతం కదిలిపోయారు. మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నట్లు తెలిసి దాన్నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ వ్యాధి మరీ తీవ్రమైంది కాదు. అలా అని తేలిగ్గా తీసుకునేది కూడా కాదు. జాగ్రత్తగా చికిత్స తీసుకుంటే కొంత కాలానికి నయమవుతుందని తెలిసి సమంత ఎలాగైనా దీన్నుంచి బయటికి రావాలని కోరుకున్నారు.
కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి ఇంటికి చేరుకున్న సామ్.. వైద్యుల పర్యవేక్షణంలో మెడికేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఉన్నట్లుండి ఆమె పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా తయారైందని, దీంతో అత్యవసరంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని తాజాగా మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఐతే ఈ ప్రచారంపై సమంత టీం వెంటనే స్పందించింది. ఈ ప్రచారాన్ని ఖండించింది. ప్రస్తుతం సమంత ఇంట్లోనే ఉందని.. ఆమె ఆరోగ్యం కూడా బాగానే ఉందని సమంత మేనేజర్ స్పష్టం చేశాడు. దీంతో అభిమానుల్లో ఆందోళన తగ్గింది. ఐతే సమంతకు కొన్ని నెలల పాటు మెడికేషన్ అవసరమని.. క్లోజ్ మానిటరింగ్లో ఆమె ఉండాల్సిందే అని.. అంత వరకు ఆమె సినిమాలకు దూరంగానే ఉండబోతోందని తెలుస్తోంది. ఇటీవలే సమంత నటించిన ‘యశోద’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాను సమంత దగ్గరుండి ప్రమోట్ చేసే పరిస్థితి లేకపోయింది. అయినా సరే.. సుమతో ఒక కామన్ వీడియో ఇంటర్వ్యూ చేసి మీడియాకు రిలీజ్ చేసింది సామ్. దానికి మంచి స్పందనే వచ్చింది. ఆ వీడియోలో సామ్ బలహీనంగా కనిపించడం అభిమానులను బాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా ‘యశోద’ ఉన్నంతలో మంచి వసూళ్లే సాధించి సమంత స్టార్ పవర్ను తెలియజేసింది. అనారోగ్యం నుంచి కోలుకున్నాక సామ్ ‘ఖుషి’ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది.
This post was last modified on November 24, 2022 2:18 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…