వరుస ఫ్లాప్స్ వచ్చాయని నితిన్ ఒక ఏడాది పాటు విరామం తీసుకున్నాడు. ఆ ఏడాది లోటు భర్తీ చేయడానికి ఒకే సారి చాలా సినిమాలు మొదలుపెట్టాడు. భీష్మ సినిమాతో నితిన్ కి మళ్ళీ విజయం దక్కింది. అయితే జూన్ లో విడుదల కావాల్సిన రంగ్ దే షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమా కూడా నితిన్ మొదలు పెట్టాడు.
అది కాకుండా అందాధూన్ రీమేక్ కూడా మొదలు పెట్టేసాడు. ఇన్ని సినిమాలు మొదలై వేర్వేరు దశలలో ఉన్నాయంటే అది చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. అన్ని సినిమాలకు వడ్డీలు పెరుగుతున్నాయి. అదీ కాక ఇప్పుడు షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యాక అన్నిటినీ ముందుకు నడిపించే తలనొప్పి ఒకటి.
అలాగే రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనే డిమాండ్ ఉంది కనుక నితిన్ ఈ సినిమాలు అన్నిటికీ పారితోషికం తగ్గించుకోవాలి. ఏకకాలంలో పలు సినిమాలు పూర్తి చేయాలని నితిన్ వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టాయి ఇప్పుడు తనకు పరి పరి విధాలుగా నష్టాలు తెచ్చి పెడుతోంది. అందుకే నాని, నాగ చైతన్య మాదిరిగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళితే ఈ తలనొప్పులు ఉండవు.
This post was last modified on July 15, 2020 3:43 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…