వరుస ఫ్లాప్స్ వచ్చాయని నితిన్ ఒక ఏడాది పాటు విరామం తీసుకున్నాడు. ఆ ఏడాది లోటు భర్తీ చేయడానికి ఒకే సారి చాలా సినిమాలు మొదలుపెట్టాడు. భీష్మ సినిమాతో నితిన్ కి మళ్ళీ విజయం దక్కింది. అయితే జూన్ లో విడుదల కావాల్సిన రంగ్ దే షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమా కూడా నితిన్ మొదలు పెట్టాడు.
అది కాకుండా అందాధూన్ రీమేక్ కూడా మొదలు పెట్టేసాడు. ఇన్ని సినిమాలు మొదలై వేర్వేరు దశలలో ఉన్నాయంటే అది చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. అన్ని సినిమాలకు వడ్డీలు పెరుగుతున్నాయి. అదీ కాక ఇప్పుడు షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యాక అన్నిటినీ ముందుకు నడిపించే తలనొప్పి ఒకటి.
అలాగే రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనే డిమాండ్ ఉంది కనుక నితిన్ ఈ సినిమాలు అన్నిటికీ పారితోషికం తగ్గించుకోవాలి. ఏకకాలంలో పలు సినిమాలు పూర్తి చేయాలని నితిన్ వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టాయి ఇప్పుడు తనకు పరి పరి విధాలుగా నష్టాలు తెచ్చి పెడుతోంది. అందుకే నాని, నాగ చైతన్య మాదిరిగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళితే ఈ తలనొప్పులు ఉండవు.
This post was last modified on July 15, 2020 3:43 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…