వరుస ఫ్లాప్స్ వచ్చాయని నితిన్ ఒక ఏడాది పాటు విరామం తీసుకున్నాడు. ఆ ఏడాది లోటు భర్తీ చేయడానికి ఒకే సారి చాలా సినిమాలు మొదలుపెట్టాడు. భీష్మ సినిమాతో నితిన్ కి మళ్ళీ విజయం దక్కింది. అయితే జూన్ లో విడుదల కావాల్సిన రంగ్ దే షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమా కూడా నితిన్ మొదలు పెట్టాడు.
అది కాకుండా అందాధూన్ రీమేక్ కూడా మొదలు పెట్టేసాడు. ఇన్ని సినిమాలు మొదలై వేర్వేరు దశలలో ఉన్నాయంటే అది చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. అన్ని సినిమాలకు వడ్డీలు పెరుగుతున్నాయి. అదీ కాక ఇప్పుడు షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యాక అన్నిటినీ ముందుకు నడిపించే తలనొప్పి ఒకటి.
అలాగే రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనే డిమాండ్ ఉంది కనుక నితిన్ ఈ సినిమాలు అన్నిటికీ పారితోషికం తగ్గించుకోవాలి. ఏకకాలంలో పలు సినిమాలు పూర్తి చేయాలని నితిన్ వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టాయి ఇప్పుడు తనకు పరి పరి విధాలుగా నష్టాలు తెచ్చి పెడుతోంది. అందుకే నాని, నాగ చైతన్య మాదిరిగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళితే ఈ తలనొప్పులు ఉండవు.
This post was last modified on July 15, 2020 3:43 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…