వరుస ఫ్లాప్స్ వచ్చాయని నితిన్ ఒక ఏడాది పాటు విరామం తీసుకున్నాడు. ఆ ఏడాది లోటు భర్తీ చేయడానికి ఒకే సారి చాలా సినిమాలు మొదలుపెట్టాడు. భీష్మ సినిమాతో నితిన్ కి మళ్ళీ విజయం దక్కింది. అయితే జూన్ లో విడుదల కావాల్సిన రంగ్ దే షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమా కూడా నితిన్ మొదలు పెట్టాడు.
అది కాకుండా అందాధూన్ రీమేక్ కూడా మొదలు పెట్టేసాడు. ఇన్ని సినిమాలు మొదలై వేర్వేరు దశలలో ఉన్నాయంటే అది చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. అన్ని సినిమాలకు వడ్డీలు పెరుగుతున్నాయి. అదీ కాక ఇప్పుడు షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యాక అన్నిటినీ ముందుకు నడిపించే తలనొప్పి ఒకటి.
అలాగే రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనే డిమాండ్ ఉంది కనుక నితిన్ ఈ సినిమాలు అన్నిటికీ పారితోషికం తగ్గించుకోవాలి. ఏకకాలంలో పలు సినిమాలు పూర్తి చేయాలని నితిన్ వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టాయి ఇప్పుడు తనకు పరి పరి విధాలుగా నష్టాలు తెచ్చి పెడుతోంది. అందుకే నాని, నాగ చైతన్య మాదిరిగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళితే ఈ తలనొప్పులు ఉండవు.
This post was last modified on July 15, 2020 3:43 pm
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…