సంక్రాంతి మరీ ఎక్కువ దూరంలో లేదు. ఇంకో నలభై అయిదు రోజులు దాటేస్తే పండగ ముంగిట్లో ఉంటాం. ఈసారి బాక్సాఫీస్ పోరు చాలా ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో అందరి కళ్ళు చిరంజీవి బాలకృష్ణ క్లాష్ మీదే ఉంది. వీటికి తోడు తమిళ డబ్బింగ్ వారసుడుని నిర్మాత దిల్ రాజు ఆ రెండింటికన్నా భారీ విడుదలకు ప్లాన్ చేయడం, దానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఒక నోట్ విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఈలోగా కృష్ణగారి అకాలమరణంతో ఎవరూ ఏమి మాట్లాడలేని పరిస్థితి. నిన్న అంత్యక్రియలు పూర్తయ్యాయి కాబట్టి మళ్ళీ టాపిక్ లోకి రావాల్సిందే.
ఇప్పటిదాకా వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు సంబంధించి ఎలాంటి యాక్టివ్ ప్రమోషన్ జరగలేదు. అటు చూస్తే వారసుడు మొదటి ఆడియో సింగల్ రిలీజైపోయి యాభై మిలియన్ల వ్యూస్ దాటేసి ఛార్ట్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. కానీ మైత్రి సంస్థ మాత్రం ఇంకా చివరి దశ షూటింగులతో బిజీగా ఉండటంతో అప్డేట్స్ కి కావాల్సిన ప్లానింగ్ మిస్ అవుతోంది. మనం ఎవరినైతే పోటీ అనుకుంటున్నామో ప్రమోషన్ పరంగా వాళ్లే ముందున్నారు. దేవిశ్రీప్రసాద్ బాస్ సాంగ్ ఈ వారంలోనే వస్తుందని వీరయ్య గురించి ఊరించాడు కానీ అది నెక్స్ట్ వీక్ కి వాయిదా పడిందనేది కన్ఫర్మ్.
ఇక వీరసింహారెడ్డి కనీసం మొదటి ఆడియో సింగిల్ ఎప్పుడు ప్లాన్ చేశారో చెప్పలేదు. తమన్ పుట్టినరోజుకి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు తప్పించి కానుకగా పాట తాలూకు బిట్ ఏదైనా వదిలి ఉంటే బాగుండేది. వారసుడుకి తమిళనాడులో అజిత్ తునివుతో పోటీ ఉంది కాబట్టి ఇంకొద్ది రోజుల్లో పబ్లిసిటీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తారు. ప్రొడక్షన్ వైపు నుంచే కాక హీరో విజయ్ తరఫున టీమ్ ఇలాంటి వాటిలో ఆరితేరిపోయింది. కానీ చిరు బాలయ్యలు మాత్రం ఇప్పటిదాకా చిన్న టీజర్లతో సర్దుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిది వేకప్ టైం. త్వరగా మేల్కొని ప్లాన్ చేసుకుని పరుగులు పెట్టాల్సిందే.
This post was last modified on November 17, 2022 10:34 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…