సంక్రాంతి మరీ ఎక్కువ దూరంలో లేదు. ఇంకో నలభై అయిదు రోజులు దాటేస్తే పండగ ముంగిట్లో ఉంటాం. ఈసారి బాక్సాఫీస్ పోరు చాలా ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో అందరి కళ్ళు చిరంజీవి బాలకృష్ణ క్లాష్ మీదే ఉంది. వీటికి తోడు తమిళ డబ్బింగ్ వారసుడుని నిర్మాత దిల్ రాజు ఆ రెండింటికన్నా భారీ విడుదలకు ప్లాన్ చేయడం, దానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఒక నోట్ విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఈలోగా కృష్ణగారి అకాలమరణంతో ఎవరూ ఏమి మాట్లాడలేని పరిస్థితి. నిన్న అంత్యక్రియలు పూర్తయ్యాయి కాబట్టి మళ్ళీ టాపిక్ లోకి రావాల్సిందే.
ఇప్పటిదాకా వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు సంబంధించి ఎలాంటి యాక్టివ్ ప్రమోషన్ జరగలేదు. అటు చూస్తే వారసుడు మొదటి ఆడియో సింగల్ రిలీజైపోయి యాభై మిలియన్ల వ్యూస్ దాటేసి ఛార్ట్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. కానీ మైత్రి సంస్థ మాత్రం ఇంకా చివరి దశ షూటింగులతో బిజీగా ఉండటంతో అప్డేట్స్ కి కావాల్సిన ప్లానింగ్ మిస్ అవుతోంది. మనం ఎవరినైతే పోటీ అనుకుంటున్నామో ప్రమోషన్ పరంగా వాళ్లే ముందున్నారు. దేవిశ్రీప్రసాద్ బాస్ సాంగ్ ఈ వారంలోనే వస్తుందని వీరయ్య గురించి ఊరించాడు కానీ అది నెక్స్ట్ వీక్ కి వాయిదా పడిందనేది కన్ఫర్మ్.
ఇక వీరసింహారెడ్డి కనీసం మొదటి ఆడియో సింగిల్ ఎప్పుడు ప్లాన్ చేశారో చెప్పలేదు. తమన్ పుట్టినరోజుకి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు తప్పించి కానుకగా పాట తాలూకు బిట్ ఏదైనా వదిలి ఉంటే బాగుండేది. వారసుడుకి తమిళనాడులో అజిత్ తునివుతో పోటీ ఉంది కాబట్టి ఇంకొద్ది రోజుల్లో పబ్లిసిటీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తారు. ప్రొడక్షన్ వైపు నుంచే కాక హీరో విజయ్ తరఫున టీమ్ ఇలాంటి వాటిలో ఆరితేరిపోయింది. కానీ చిరు బాలయ్యలు మాత్రం ఇప్పటిదాకా చిన్న టీజర్లతో సర్దుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిది వేకప్ టైం. త్వరగా మేల్కొని ప్లాన్ చేసుకుని పరుగులు పెట్టాల్సిందే.
This post was last modified on November 17, 2022 10:34 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…