టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం సిద్ధ మైంది. సుదీర్ఘ దూరం.. సుదీర్ఘ కాలం చేయనున్న ఈ పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడం.. వైసీపీని అధికారం నుంచి తప్పించడం అనే రెండు కీలక అంశాలనే ప్రధాన అజెండా చేసుకుని నారా లోకే ష్ ముందుకు సాగనున్నారు. వాస్తవానికి తాను పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్టు ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు వేదికగానే లోకేష్ ప్రకటించారు.
తొలుత చంద్రబాబు పాదయాత్ర చేస్తారని అనుకున్నారు. ఆతర్వాత.. కొన్నాళ్లకు.. లోకేష్ పాదయాత్ర చేయడం ఖాయమని మీడియాకు ఉప్పందించారు. అయితే.. గత నాలుగు మాసాలుగా ఈ విషయం చర్చలకే పరిమితమైంది. అయితే తాజాగా దీనిపై రూట్ మ్యాప్ రెడీ అయితే.. ఈరోజో రేపో దీనిని మీడియాకు విడుదల చేయనున్నారు. అదేసమయంలో అనుమతి కోసం ప్రభుత్వానికి కూడా అర్జీ పెట్టనున్నారు.
ఇక, ప్రస్తుతం అందించిన సమాచారం ప్రకారం షెడ్యూల్ ఏంటంటే.. నారా లోకష్ జనవరి 27న తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఆ రోజు ఉదయం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారా లోకేష్కు ఆయన మాతృమూర్తి నారా భువనేశ్వరి వీర తిలకం దిద్ది హారతి ఇచ్చి.. ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ.. చివరకు ఇచ్ఛాపురం వరకు సాగనుంది. ఈ యాత్రలో గ్రామాలను టచ్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను లోకేష్ ఎండగట్టనున్నారు.
అదేసమయంలో పార్టీని బలోపేతం చేసేలా నిత్యం తమ్ముళ్లతో సమావేశాలు పెడతారు. విరామమెరుగని బాటసారి మాదిరిగా.. నారా లోకేష్ ఆసాంతం నిర్వహించే ఆ పాదయాత్ర వచ్చే 2024 ఎన్నికలకు మూడు లేదా నాలుగు మాసాల ముందు ముగియనుంది. ప్రతి రోజూ 25 నుంచి 30 కిలో మీటర్ల దూరం లోకేష్ నడవనున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ ఈ యాత్ర ముందుకు సాగుతుంది. దీనికి పార్టీ నేతలు..ఆయా జిల్లాల్లో ఏర్పాట్లు చూడాల్సి ఉంటుందని పార్టీ నుంచిఇప్పటి ఒక సెర్క్యులర్ వచ్చినట్టు తెలుస్తోంది.
This post was last modified on November 11, 2022 2:23 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…