టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం సిద్ధ మైంది. సుదీర్ఘ దూరం.. సుదీర్ఘ కాలం చేయనున్న ఈ పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడం.. వైసీపీని అధికారం నుంచి తప్పించడం అనే రెండు కీలక అంశాలనే ప్రధాన అజెండా చేసుకుని నారా లోకే ష్ ముందుకు సాగనున్నారు. వాస్తవానికి తాను పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్టు ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు వేదికగానే లోకేష్ ప్రకటించారు.
తొలుత చంద్రబాబు పాదయాత్ర చేస్తారని అనుకున్నారు. ఆతర్వాత.. కొన్నాళ్లకు.. లోకేష్ పాదయాత్ర చేయడం ఖాయమని మీడియాకు ఉప్పందించారు. అయితే.. గత నాలుగు మాసాలుగా ఈ విషయం చర్చలకే పరిమితమైంది. అయితే తాజాగా దీనిపై రూట్ మ్యాప్ రెడీ అయితే.. ఈరోజో రేపో దీనిని మీడియాకు విడుదల చేయనున్నారు. అదేసమయంలో అనుమతి కోసం ప్రభుత్వానికి కూడా అర్జీ పెట్టనున్నారు.
ఇక, ప్రస్తుతం అందించిన సమాచారం ప్రకారం షెడ్యూల్ ఏంటంటే.. నారా లోకష్ జనవరి 27న తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఆ రోజు ఉదయం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారా లోకేష్కు ఆయన మాతృమూర్తి నారా భువనేశ్వరి వీర తిలకం దిద్ది హారతి ఇచ్చి.. ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ.. చివరకు ఇచ్ఛాపురం వరకు సాగనుంది. ఈ యాత్రలో గ్రామాలను టచ్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను లోకేష్ ఎండగట్టనున్నారు.
అదేసమయంలో పార్టీని బలోపేతం చేసేలా నిత్యం తమ్ముళ్లతో సమావేశాలు పెడతారు. విరామమెరుగని బాటసారి మాదిరిగా.. నారా లోకేష్ ఆసాంతం నిర్వహించే ఆ పాదయాత్ర వచ్చే 2024 ఎన్నికలకు మూడు లేదా నాలుగు మాసాల ముందు ముగియనుంది. ప్రతి రోజూ 25 నుంచి 30 కిలో మీటర్ల దూరం లోకేష్ నడవనున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ ఈ యాత్ర ముందుకు సాగుతుంది. దీనికి పార్టీ నేతలు..ఆయా జిల్లాల్లో ఏర్పాట్లు చూడాల్సి ఉంటుందని పార్టీ నుంచిఇప్పటి ఒక సెర్క్యులర్ వచ్చినట్టు తెలుస్తోంది.
This post was last modified on November 11, 2022 2:23 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…