టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం సిద్ధ మైంది. సుదీర్ఘ దూరం.. సుదీర్ఘ కాలం చేయనున్న ఈ పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడం.. వైసీపీని అధికారం నుంచి తప్పించడం అనే రెండు కీలక అంశాలనే ప్రధాన అజెండా చేసుకుని నారా లోకే ష్ ముందుకు సాగనున్నారు. వాస్తవానికి తాను పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్టు ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు వేదికగానే లోకేష్ ప్రకటించారు.
తొలుత చంద్రబాబు పాదయాత్ర చేస్తారని అనుకున్నారు. ఆతర్వాత.. కొన్నాళ్లకు.. లోకేష్ పాదయాత్ర చేయడం ఖాయమని మీడియాకు ఉప్పందించారు. అయితే.. గత నాలుగు మాసాలుగా ఈ విషయం చర్చలకే పరిమితమైంది. అయితే తాజాగా దీనిపై రూట్ మ్యాప్ రెడీ అయితే.. ఈరోజో రేపో దీనిని మీడియాకు విడుదల చేయనున్నారు. అదేసమయంలో అనుమతి కోసం ప్రభుత్వానికి కూడా అర్జీ పెట్టనున్నారు.
ఇక, ప్రస్తుతం అందించిన సమాచారం ప్రకారం షెడ్యూల్ ఏంటంటే.. నారా లోకష్ జనవరి 27న తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఆ రోజు ఉదయం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారా లోకేష్కు ఆయన మాతృమూర్తి నారా భువనేశ్వరి వీర తిలకం దిద్ది హారతి ఇచ్చి.. ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ.. చివరకు ఇచ్ఛాపురం వరకు సాగనుంది. ఈ యాత్రలో గ్రామాలను టచ్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను లోకేష్ ఎండగట్టనున్నారు.
అదేసమయంలో పార్టీని బలోపేతం చేసేలా నిత్యం తమ్ముళ్లతో సమావేశాలు పెడతారు. విరామమెరుగని బాటసారి మాదిరిగా.. నారా లోకేష్ ఆసాంతం నిర్వహించే ఆ పాదయాత్ర వచ్చే 2024 ఎన్నికలకు మూడు లేదా నాలుగు మాసాల ముందు ముగియనుంది. ప్రతి రోజూ 25 నుంచి 30 కిలో మీటర్ల దూరం లోకేష్ నడవనున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ ఈ యాత్ర ముందుకు సాగుతుంది. దీనికి పార్టీ నేతలు..ఆయా జిల్లాల్లో ఏర్పాట్లు చూడాల్సి ఉంటుందని పార్టీ నుంచిఇప్పటి ఒక సెర్క్యులర్ వచ్చినట్టు తెలుస్తోంది.
This post was last modified on November 11, 2022 2:23 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…