కొన్ని కొన్ని ఇంటర్యూల్లో ఇద్దరిద్దరు గెస్టులు వస్తుంటారు. ఆ ఇద్దరూ ఎవరూ అనే కాంబినేషన్ మీద కరణ్ జోహార్ వంటి హోస్ట్లు చాలా వర్కవుట్ చేస్తారు. అదే తరహాలో మన దగర కూడా అన్స్టాపబుల్ కోసం ఏ ఇద్దరినీ కలిపి పిలుస్తారా అనే ఆసక్తి చాలానే నెలకొంది. ఇప్పుడు కమెడియన్ ఆలి హోస్ట్ చేసే ‘ఆలితో సరదాగా’ ప్రోగ్రమ్పైన కూడా అటువంటి ఆసక్తే ఉంది. కాని ఈ ప్రోగ్రామ్ లేటెస్ట్ ఎపిసోడ్కు విచ్చేసిన ఇద్దరు గెస్టుల కాంబినేషన్ మాత్రం షాకిచ్చింది.
తల్లి పాత్రలు చేసే సీనియర్ నటీమణి అండ్ మాజీ హీరోయిన్ తులసి.. అలాగే ప్రభాస్ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యి.. తరువాత యాక్టర్గా బిజీ అయిపోయిన ప్రభాస్ శ్రీను ఈ కార్యక్రమానికి కలసి గెస్టులుగా విచ్చేశారు. ”అప్పట్లో డార్లింగ్ సినిమా చేశాం కదా.. అప్పుడు ఈవిడ తగిలింది” అంటూ శ్రీను కామెంట్ చేయడంతో.. అసలు ఏ ఉద్దేశ్యంతో మనోడు ఆ కామెంట్ చేశాడా.. అని అందరూ నోళ్ళెళ్లబెడతున్నారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లేదంటే యాక్టర్ అండ్ మేనేజర్ టైప్ ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ ఏదన్నా ఉందా? అంటూ ఇప్పుడు ఆ ప్రోమో చూశాక చాలా సందేహాలు వచ్చేస్తున్నాయి. అసలు 55 ఏళ్ళ తులసీకి 43 ఏళ్ళ ప్రభాస్ శ్రీనుకు ఉన్న కనక్షన్ ఏంటి.. వాళ్ళిద్దరినీ ఆలీ ఎందుకు కలిపి ఇంటర్యూ చేశాడనేది మాత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్.
ఏదేమైనా కూడా కమెడియన్ ఆలీ మాట్లాడితే ఆ రూమర్ రాసుకోండి ఈ రూమర్ రాసుకోండి అంటూ సెటైర్లు వేస్తుంటాడు కాని, చివరకు తను కూడా రూమర్లకు ఊతమిచ్చే కాంబినేషన్లు సెట్ చేస్తున్నాడు. ఎందుకంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తే సక్సెస్ అవుతాడనే ఫార్ములా ఆయనకు బాగా తెలుసు.
This post was last modified on November 10, 2022 5:29 pm
నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…