కొన్ని కొన్ని ఇంటర్యూల్లో ఇద్దరిద్దరు గెస్టులు వస్తుంటారు. ఆ ఇద్దరూ ఎవరూ అనే కాంబినేషన్ మీద కరణ్ జోహార్ వంటి హోస్ట్లు చాలా వర్కవుట్ చేస్తారు. అదే తరహాలో మన దగర కూడా అన్స్టాపబుల్ కోసం ఏ ఇద్దరినీ కలిపి పిలుస్తారా అనే ఆసక్తి చాలానే నెలకొంది. ఇప్పుడు కమెడియన్ ఆలి హోస్ట్ చేసే ‘ఆలితో సరదాగా’ ప్రోగ్రమ్పైన కూడా అటువంటి ఆసక్తే ఉంది. కాని ఈ ప్రోగ్రామ్ లేటెస్ట్ ఎపిసోడ్కు విచ్చేసిన ఇద్దరు గెస్టుల కాంబినేషన్ మాత్రం షాకిచ్చింది.
తల్లి పాత్రలు చేసే సీనియర్ నటీమణి అండ్ మాజీ హీరోయిన్ తులసి.. అలాగే ప్రభాస్ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యి.. తరువాత యాక్టర్గా బిజీ అయిపోయిన ప్రభాస్ శ్రీను ఈ కార్యక్రమానికి కలసి గెస్టులుగా విచ్చేశారు. ”అప్పట్లో డార్లింగ్ సినిమా చేశాం కదా.. అప్పుడు ఈవిడ తగిలింది” అంటూ శ్రీను కామెంట్ చేయడంతో.. అసలు ఏ ఉద్దేశ్యంతో మనోడు ఆ కామెంట్ చేశాడా.. అని అందరూ నోళ్ళెళ్లబెడతున్నారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లేదంటే యాక్టర్ అండ్ మేనేజర్ టైప్ ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ ఏదన్నా ఉందా? అంటూ ఇప్పుడు ఆ ప్రోమో చూశాక చాలా సందేహాలు వచ్చేస్తున్నాయి. అసలు 55 ఏళ్ళ తులసీకి 43 ఏళ్ళ ప్రభాస్ శ్రీనుకు ఉన్న కనక్షన్ ఏంటి.. వాళ్ళిద్దరినీ ఆలీ ఎందుకు కలిపి ఇంటర్యూ చేశాడనేది మాత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్.
ఏదేమైనా కూడా కమెడియన్ ఆలీ మాట్లాడితే ఆ రూమర్ రాసుకోండి ఈ రూమర్ రాసుకోండి అంటూ సెటైర్లు వేస్తుంటాడు కాని, చివరకు తను కూడా రూమర్లకు ఊతమిచ్చే కాంబినేషన్లు సెట్ చేస్తున్నాడు. ఎందుకంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తే సక్సెస్ అవుతాడనే ఫార్ములా ఆయనకు బాగా తెలుసు.
This post was last modified on November 10, 2022 5:29 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…