నా గురించి చాలా నెగెటివ్గా ప్రచారం చేస్తున్నారు, కాని తట్టుకుని నిలబడతా, అనుకున్నది సాధిస్తానంటూ ఇనస్టాగ్రామ్లో హీరోయిన్ రష్మిక మందన్నా ఒక పెద్ద పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు నిజంగా ట్రోల్స్ వచ్చినప్పుడో లేదంటే ఆమె సినిమాల రిలీజ్ టైములోనో ఎంత ట్రోలింగ్ జరిగినా కూడా స్పందించని ఈ కన్నడ బ్యూటి, ఇప్పుడు సడన్గా ఎందుకు అంత పెద్ద పోస్ట్ పెట్టిందనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటారు?
నిజానికి బాలీవుడ్ లో మన సౌత్ స్టారీమణులు.. చాలా పెద్ద సినిమాలు చేసినప్పుడో లేదంటో ఏదన్నా పెద్ద హిట్ కొట్టినప్పుడో పాపులర్ అవుతారు. అయితే రష్మిక మాత్రం అక్కడ ఒక్క సినిమా కూడా కొట్టకుండానే ఇనస్టాగ్రామ్లో 35 మిలియన్ పైచిలుకు ఫాలోవర్స్ను సంపాదించింది. పుష్ప సినిమాతో తొలిసారి అక్కడ హిట్ చవిచూసినా కూడా, డైరక్ట్ హిందీ మూవీ గుడ్ బాయ్ ఫ్లాప్ అయినా కూడా చేతిలో మరో నాలుగున్నాయ్. ఈ తరుణంలో చాలా మ్యాగజైన్స్ ఆమె ఫోటోల గురించి ఎగబడటం, ఆమె బికినీల్లో అందాలను ఆరబోయడం జరిగిపోయాయ్.
కాకపోతే ఈ మొత్తం వ్యవహారం గురించి బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండను బాగా వాడుకుంటోందని చాలా బాలీవుడ్ వెబ్ సైట్లలో సడన్గా ఆర్టికల్స్ పడటం స్టార్ట్ అయ్యాయ్. అలాగే అక్కడ కూడా చాలామంది రష్మిక విజయ్ను వాడేసుకుని పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో భలే ఛాన్సులు పట్టేస్తోందే అంటూ సెటైర్లు వేస్తున్నారట. అందుకే ఇప్పుడు గాసిప్స్ బాధిస్తున్నాయ్ అంటూ రష్మిక వాపోయినట్లుంది.
మరో ప్రక్కన ఏంటంటే.. అసలు రష్మిక గురించి బయట సాలిడ్ గా ఒక్క కాంట్రోవర్షియల్ రూమర్ కూడా ఏదీ చెక్కర్లకొట్టడంలేదు.. ఈ టైములో నా మీద నెగెటివిటీ వస్తోంది అంటూ అటెన్షన్ కోసం ప్రయత్నిస్తోందా అని కూడా కొన్ని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఎప్పుడూ న్యూస్లో ఎలా ఉండాలో సమంత అండ్ కంగనా రనౌత్ తరహాలో ఇప్పుడు రష్మిక కూడా బాగా నేర్చేసుకుంది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…