నా గురించి చాలా నెగెటివ్గా ప్రచారం చేస్తున్నారు, కాని తట్టుకుని నిలబడతా, అనుకున్నది సాధిస్తానంటూ ఇనస్టాగ్రామ్లో హీరోయిన్ రష్మిక మందన్నా ఒక పెద్ద పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు నిజంగా ట్రోల్స్ వచ్చినప్పుడో లేదంటే ఆమె సినిమాల రిలీజ్ టైములోనో ఎంత ట్రోలింగ్ జరిగినా కూడా స్పందించని ఈ కన్నడ బ్యూటి, ఇప్పుడు సడన్గా ఎందుకు అంత పెద్ద పోస్ట్ పెట్టిందనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటారు?
నిజానికి బాలీవుడ్ లో మన సౌత్ స్టారీమణులు.. చాలా పెద్ద సినిమాలు చేసినప్పుడో లేదంటో ఏదన్నా పెద్ద హిట్ కొట్టినప్పుడో పాపులర్ అవుతారు. అయితే రష్మిక మాత్రం అక్కడ ఒక్క సినిమా కూడా కొట్టకుండానే ఇనస్టాగ్రామ్లో 35 మిలియన్ పైచిలుకు ఫాలోవర్స్ను సంపాదించింది. పుష్ప సినిమాతో తొలిసారి అక్కడ హిట్ చవిచూసినా కూడా, డైరక్ట్ హిందీ మూవీ గుడ్ బాయ్ ఫ్లాప్ అయినా కూడా చేతిలో మరో నాలుగున్నాయ్. ఈ తరుణంలో చాలా మ్యాగజైన్స్ ఆమె ఫోటోల గురించి ఎగబడటం, ఆమె బికినీల్లో అందాలను ఆరబోయడం జరిగిపోయాయ్.
కాకపోతే ఈ మొత్తం వ్యవహారం గురించి బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండను బాగా వాడుకుంటోందని చాలా బాలీవుడ్ వెబ్ సైట్లలో సడన్గా ఆర్టికల్స్ పడటం స్టార్ట్ అయ్యాయ్. అలాగే అక్కడ కూడా చాలామంది రష్మిక విజయ్ను వాడేసుకుని పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో భలే ఛాన్సులు పట్టేస్తోందే అంటూ సెటైర్లు వేస్తున్నారట. అందుకే ఇప్పుడు గాసిప్స్ బాధిస్తున్నాయ్ అంటూ రష్మిక వాపోయినట్లుంది.
మరో ప్రక్కన ఏంటంటే.. అసలు రష్మిక గురించి బయట సాలిడ్ గా ఒక్క కాంట్రోవర్షియల్ రూమర్ కూడా ఏదీ చెక్కర్లకొట్టడంలేదు.. ఈ టైములో నా మీద నెగెటివిటీ వస్తోంది అంటూ అటెన్షన్ కోసం ప్రయత్నిస్తోందా అని కూడా కొన్ని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఎప్పుడూ న్యూస్లో ఎలా ఉండాలో సమంత అండ్ కంగనా రనౌత్ తరహాలో ఇప్పుడు రష్మిక కూడా బాగా నేర్చేసుకుంది.
This post was last modified on November 10, 2022 9:08 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…