Movie News

చిరు బాలయ్యలు కల్పించుకుంటారా

అందరూ భయపడినట్టే సంక్రాంతికి థియేటర్ల రచ్చ మొదలైపోయింది. వారసుడుకి మంచి స్క్రీన్లు, ఎక్కువ కౌంట్ వచ్చేలా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పేట రిలీజ్ టైంలో ఇలాంటి వివాదమే వచ్చినప్పుడు రజినీకాంత్ అయినంత మాత్రాన స్ట్రెయిట్ సినిమాలను పక్కనపెట్టలేం కదాని ఒక ఇంటర్వ్యూలో రాజుగారు అన్న మాటలను వీడియో రూపంలో తవ్వి తీసి మరీ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ లాంటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ నుంచి థియేటర్ల పేర్లు బయటికి రావడం ఈ రచ్చకు కారణం.

ఇది నిజమైనా కాకపోయినా ఈ సమస్య ఖచ్చితంగా వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. స్వంత చిత్రం కాబట్టి దిల్ రాజు సహజంగానే తన లీజులో ఉన్నవి, స్వంతంగా నడుపుతున్నవి అధిక శాతం వాటిలో వారసుడు వేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. అలాంటప్పుడు బిసి సెంటర్లలో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు ఇది ఇబ్బందే. షోలు పంచుకోవాల్సి ఉంటుంది. విజయ్ కున్న ఇమేజ్ ని పరిగణనలోకి తీసుకుంటే ఏ కోణంలోనూ చిరు బాలయ్యల దరిదాపుల్లో లేడు. తమిళనాడులో అతను వందల కోట్ల బడా స్టారే కావొచ్చు. కానీ రిలీజ్ టైంలో ఆ అంశం కన్నా ఇక్కడ బిజినెస్ ఎంత చేయగలడనేదే ముఖ్యం.

ఒకవేళ విడుదల దగ్గర పడుతున్న టైంలో ఈ ఇష్యూ కనక పెద్దదైతే చిరంజీవి బాలకృష్ణలు ఇద్దరూ తమ నిర్మాతలు ఒకరే కాబట్టి దీన్ని పరిష్కరించే దిశగా ఒత్తిడి తెస్తారా లేక దిల్ రాజుకే నేరుగా కమ్యూనికేట్ చేస్తారానేది ఇప్పడే చెప్పలేం కానీ ఫ్యాన్స్ మాత్రం కల్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేదో మొత్తం థియేటర్ల లిస్టు బయటికి వచ్చాక తేలుతుంది కానీ ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. ఒకవైపు స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు నడపబోతున్న మైత్రి అధినేతలు ఈ ఒత్తిడిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. కోట్లతో కాదు మాటలతో జరిగే పనులాయే.

Satya

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

1 hour ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

1 hour ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

2 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

3 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

3 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

4 hours ago