స్టార్ హీరోయిన్లు, పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు చాలా వరకు భాషా పరమైన హద్దులు ఉండవు. వాళ్లు పలు భాషల్లో ఈజీగా సినిమాలు దక్కించుకుంటారు. కానీ హీరోలు చాలా వరకు ఒక భాషకే పరిమితం అవుతుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండు వల్ల వారికి బహు భాషల్లో గుర్తింపు వస్తోంది. ఇక కమెడియన్ల విషయానికి వస్తే.. వాళ్లు అనువాద చిత్రాల ద్వారా వేరే భాషల్లోకి వెళ్తారు తప్ప.. ఇతర భాషల వాళ్లు పిలిచిన అవకాశాలు ఇవ్వడం తక్కువే.
కమెడియన్లు రాణించడంలో భాష కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి.. ఆయా భాషల్లోనే వారికి ఎక్కువ పేరు వస్తుంటుంది. అందుకే ఒక భాషకు చెందిన కమెడియన్ను ఇంకో భాషకు చెందిన సినిమాల కోసం పిలవడం అరుదుగానే జరుగుతుంటుంది. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ కమెడియన్గా ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత హీరోగా మారి.. ఆ స్టింట్ ముగిశాక తిరిగి కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సునీల్.. ఇప్పటిదాకా వేరే భాషల్లో నటించింది లేదు.
ఐతే ఇప్పుడు సునీల్కు ఒక పెద్ద తమిళ చిత్రంలో అవకాశం దక్కింది. ఇటీవలే ‘ప్రిన్స్’ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన శివ కార్తికేయన్ కొత్త చిత్రం ‘మావీరన్’లో సునీల్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రం ‘మహావీరుడు’ పేరుతో ఒకసారి తెలుగులోనూ తెరకెక్కుతోంది. ఇంతకుముందు తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో ‘మండేలా’ అనే సినిమా తీసిన మడోన్నా అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో స్టార్ డైరెక్టర్ శంకర్ తనయురాలు అదితి శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో సునీల్కు ఒక ముఖ్య పాత్ర దక్కింది. అతణ్ని తమ ప్రాజెక్టులోకి ఆహ్వానిస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.
సునీల్ పాత్ర తెలుగు, తమిళం రెండు వెర్షన్లలోనూ ఉంటుందని సమాచారం. మరి తమిళంలో మన కమెడియన్కు ఎలాంటి వెల్కం దక్కుతుందో చూడాలి. ఇటీవలే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో సునీల్ తన కామెడీతో అలరించాడు. హీరో వేషాలు వదిలేసి మళ్లీ కామెడీ రోల్స్ చేశాక కుదురుకోవడానికి సునీల్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఈ మద్య అతడి కామెడీ బాగానే వర్కవుట్ అవుతోంది.
This post was last modified on November 9, 2022 1:49 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…