తోటి యాంకర్ విష్ణుప్రియతో తనకు విభేదాలున్నట్లు వచ్చిన వార్తలను ఢీ జోడీ యాంకర్ వర్షిణి ఖండించింది. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విష్ణుప్రియ గురించి ఆమె మాట్లాడింది. మీకు విష్ణుప్రియతో విభేదాలున్నట్లు రకరకాల రూమర్లు వినిపిస్తుంటాయి.. వాటిపై ఏమంటారు అని అడిగితే.. అలాంటిదేమీ లేదని, ఇలాంటి వార్తలు ఎందుకొస్తాయో తెలియదని వర్షిణి అంది. అలాగే మరో యాంకర్ శ్రీముఖితో విభేదాలంటూ వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించింది. ఐతే వీళ్లిద్దరితో తనకు పెద్దగా స్నేహం లేదని కూడా ఆమె స్పష్టం చేసింది. హాయ్, బాయ్ చెప్పుకునే వరకే వారితో స్నేహం ఉన్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం తెలుగులో ఉన్న యాంకర్లకు ర్యాంకులు ఎలా ఇస్తారని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. సుమకు నంబర్ వన్ ర్యాంకు ఇచ్చింది వర్షిణి. ఆ తర్వాత వరుసగా ఝాన్సీ, శ్రీముఖి, రష్మి, అనసూయల పేర్లు చెప్పి తర్వాతి స్థానాన్ని తనకు ఇచ్చుకుంది. చివరగా విష్ణుప్రియ పేరు చెప్పింది. విష్ణుప్రియ పేరు చివర్లో చెప్పారేంటి అని అడిగితే.. చివరి స్థానం నాకు ఇచ్చుకోమంటారా అని వర్షిణి నవ్వుతూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే విష్ణుప్రియతో విభేదాల గురించి ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. అదంతా ఏమీ లేదని స్పష్టం చేసింది వర్షిణి. కొన్ని సినిమాల్లో నటించినా బ్రేక్ అందుకోలేకపోయిన వర్షిణి.. ప్రస్తుతం బుల్లితెరకే పరిమితం అయిపోయింది.
This post was last modified on July 13, 2020 7:28 pm
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…