తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చాలా ఏళ్ల తర్వాత ‘ఖైదీ’ సినిమాతో స్టార్ అయ్యానని, కానీ విజయ్ దేవరకొండ చాలా వేగంగా అలాంటి ఇమేజ్ సంపాదించాడని మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడంటే విజయ్ ఎదుగుదల ఎలాంటిది అన్నది అర్థం చేసుకోవచ్చు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా లాంటి వరుస హిట్లతో అతను చాలా తక్కువ సమయంలో పెద్ద స్టార్ అయిపోయాడు. పాన్ ఇండియా లెవెల్లో అతడికి మంచి పేరు, ఫాలోయింగ్ వచ్చాయి.
వీటిని సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే విజయ్ ఇంకా పెద్ద రేంజికి వెళ్లేవాడు. పాన్ ఇండియా సూపర్ స్టార్లలో ఒకడయ్యేవాడు. కానీ వరుసగా తప్పటడుగులు వేసి ఇప్పుడు టాలీవుడ్లో కూడా తన కెరీర్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితికి చేరుకున్నాడు. పూరి జగన్నాథ్ను నమ్మి ‘లైగర్’ లాంటి సినిమా చేయడం పెద్ద తప్పయితే.. ఆ సినిమా కోసం చాలా టైం వెచ్చించడం, అలాగే విషయం లేని సినిమా గురించి అతిగా మాట్లాడడం మరింతగా అతడికి చేటు చేశాయి.
విజయ్కి ఒకేసారి పరిస్థితులు కూడా ఎదురు తిరుగుతుండడం విచారకరమైన విషయం. ‘లైగర్’ గాయాలను మాన్పేలా ‘ఖుషి’ సినిమాతో మ్యాజిక్ జరుగుతుందని ఆశిస్తుంటే సమంత అనారోగ్యం పాలై ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఫిబ్రవరికి అనుకున్న సినిమా కాస్తా వేసవికో, ఆ తర్వాత ఇంకెప్పటికో వాయిదా పడేలా ఉంది. సుకుమార్తో ఇంతకుముందు ఘనంగా సినిమా అనౌన్స్ అయితే చేశారు కానీ.. ఆయన విజయ్ కోసం ఖాళీ చేసుకునేలా కనిపించడం లేదు. ఒక దశలో త్రివిక్రమ్ సైతం విజయ్తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడట. కానీ ఆయన కూడా ఇప్పుడు విజయ్తో సినిమా చేసే సంకేతాలు ఎంతమాత్రం కనిపించడం లేదు.
మధ్యలో విజయ్ దగ్గరిక కొన్ని మంచి స్క్రిప్టులు వచ్చినా.. తనకున్న కమిట్మెంట్ల దృష్ట్యా కథలు వినడానికి కూడా అతను ఆసక్తి చూపించలేదని, విన్నవాటికి కూడా నో చెప్పాడని సమాచారం. ఇప్పుడేమో ‘ఖుషి’ ఆగిపోయి.. వెంటనే మరో సినిమా ఏదీ మొదలుపెట్టలేని స్థితిలో ఇబ్బంది పడుతున్నాడు. తనకిలాంటి పరిస్థితి వస్తుందని విజయ్ ఊహించి ఉండకపోవచ్చు.
This post was last modified on November 6, 2022 8:21 pm
భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది.…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హీరో ఇమేజ్, మార్కెట్, క్యాస్టింగ్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది సింగిల్ కే.…
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…