ఇప్పటికే సంక్రాంతి రేస్ నుంచి ఆది పురుష్ ని తప్పించినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ బాగా కోపంగా ఉన్నారు. సరే ఏదో గ్రాఫిక్స్ వర్క్ అంటున్నారు కాబట్టి క్వాలిటీ ముఖ్యం లెమ్మని సర్దుకున్నారు. మార్చి 30న శ్రీరామనవమిని టార్గెట్ చేసుకుని రిలీజ్ ఖాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే అప్పుడు కూడా సాధ్యమయ్యేలా లేదని ముంబై టాక్. పోస్ట్ ప్రొడక్షన్ ఆపేసి విఎఫెక్స్ వర్క్ కు సంబంధించి కొత్తగా మళ్ళీ పనులు మొదలుపెడతారట. టీజర్ కు వచ్చిన కంప్లయింట్స్ ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు మొత్తం సిజి మళ్ళీ చేయించాలని నిర్ణయించుకున్నట్టు వినికిడి.
ఇందుకుగాను వంద కోట్లు అదనంగా టి సిరీస్ సంస్థ కేటాయించినట్టు ఫిలింనగర్ టాక్. ఈసారి హడావిడి పడకుండా మొత్తం ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుని రాజమౌళి లాంటి ఇండస్ట్రీలోని అతి ముఖ్యులకు ప్రీమియర్ వేసి వాళ్ళ ద్వారా వచ్చే జెన్యూన్ ఫీడ్ బ్యాక్ ని బట్టి డేట్ అనౌన్స్ ఎప్పుడు చేయాలో డిసైడ్ చేస్తారట. ఇదంతా జరగాలంటే 2023 వేసవి సరిపోదు. ఇంకా ఎక్కువ టైం కావాలి. ప్రభాస్ సైతం రాజీ పడొద్దని తేల్చి చెప్పడంతో అభిమానులను తాత్కాలికంగా సంతృప్తి పరచడం కోసం విడుదల చేసి నెగటివిటీ మూటగట్టుకోవడం కంటే నెమ్మదిగా వెళ్లి బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడమే ప్రధానమని గుర్తించారు.
ఒకవేళ ఇదే కనక జరిగితే ఆది పురుష్ ని దసరాకో దీపావళికో చూడాల్సి ఉంటుంది. లేదూ 2024 సంక్రాంతికి వెళ్లాలంటే అప్పుడేం పరిస్థితులు ఉంటాయో చెప్పలేం. ఎందుకంటే ప్రభాస్ సినిమా ఉందని తెలిసి కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మార్కెట్ చేసుకునే చిరంజీవి బాలకృష్ణలే వెనక్కు తగ్గలేదు అలాంటిది మరోసారి ఇదే సిచువేషన్ రిపీట్ అయితే ఓపెనింగ్స్ కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ఆరు నూరైనా సోలో రిలీజ్ కే ఆది పురుష్ టీమ్ మొగ్గు చూపుతోంది. సరిగా కట్ చేయని టీజర్ వంద కోట్ల భారాన్ని మోపిందనుకోవాలా లేక వందల కోట్ల నష్టాన్ని ముందే కంట్రోల్ చేసిందని భావించాలా. లెట్ సీ
This post was last modified on November 5, 2022 10:24 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…