Movie News

శృతి హాసన్ డబుల్ బొనాంజ

ఒక హీరోయిన్ సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కావడం ఒకప్పుడు పరిపాటిగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చాలా అరుదైపోయింది. కారణం కౌంట్ బాగా తగ్గిపోవడమే. అందులోనూ ఫామ్ తగ్గిన శృతి హాసన్ లాంటి వాళ్ళ గురించి చెప్పదేముంది. అయితే ఈసారి 2023 కమల్ తనయకు చాలా స్పెషల్ గా మిగిలిపోనుంది. సాలిడ్ మూవీస్ తో పవర్ ఫుల్ కంబ్యాక్ సెట్ చేసుకుంది. ఇది అనుకుని చేసింది కాకపోయినా అవకాశాలు అలా కలిసి వచ్చాయి. విషయానికి వస్తే చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి రెండింటిలో తనే కథానాయికన్న సంగతి తెలిసిందే. మొదటిసారి ఇద్దరు సీనియర్ హీరోలతో జట్టుకట్టింది.

రెండు ఒకే బ్యానర్ నుంచి వస్తున్నాయి. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్లు. అభిమానులను అలరించడమే టార్గెట్ గా పెట్టుకుని ఆయా దర్శకులు వీటిని రూపొందిస్తున్నారు. సో సంక్రాంతికి శృతి హాసన్ డబుల్ బొనాంజా ఉంటుందన్న మాట. గతంలో ఈ తరహా అనుభవం సిమ్రాన్ కు దక్కింది. 2001 జనవరిలో మృగరాజు, నరసింహనాయుడులు ఒకే రోజు తలపడ్డాయి. బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సాధించగా చిరంజీవికి డిజాస్టర్ పడింది. ఆ టైంలో సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఫ్యాన్ వార్ ఓ రేంజ్ లో ఉండేది. వీటిలో సిమ్రానే హీరోయిన్.

మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే చిరు బాలయ్యల సరసన శృతి హాసన్ ఆడి పడనుంది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి యంగ్ జెనరేషన్ స్టార్లతో నటించిన శృతికి కాటమరాయుడు తర్వాత బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా రీ ఎంట్రీ. ఇవి రెండే కాదు ప్రభాస్ సలార్ లో కూడా తనే గ్లామర్ బ్యూటీ. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మంచి రోలే ఇచ్చారనే టాక్ ముందు నుంచి ఉంది. వీటిలో ఏ రెండు బ్లాక్ బస్టర్ అయినా కొత్త ఇన్నింగ్స్ మళ్ళీ వేగమందుకుంటుంది. లేదూ మూడూ హిట్ అయ్యాయంటే మాత్రం గబ్బర్ సింగ్ నాటి డిమాండ్ ని రిపీట్ చేయొచ్చు

This post was last modified on October 23, 2022 12:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

31 minutes ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

1 hour ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

1 hour ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

3 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

4 hours ago

బెంగాల్ కోసం మోదీ ఎంత పరితపించారో

దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…

5 hours ago