తెలుగులో వచ్చిన అత్యుత్తమ ప్రేమకథా చిత్రాల లిస్టు తీస్తే అందులో అగ్రభాగాన ఉండే సినిమా గీతాంజలి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెలుగులో తీసిన ఏకైక చిత్రమిది. కానీ ఒక్క సినిమానే చేసినా అది తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా తీర్చదిద్దాడు. శివ సినిమాతో తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించిన అక్కినేని నాగార్జునను ఒక క్యాన్సర్ పేషెంట్గా చూపించి, హీరోయిన్కు కూడా ప్రాణాంతక జబ్బు ఉన్నట్లు చూపించి అంత పెద్ద హిట్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు.
ఇలాంటి కథను ఒప్పుకున్న నాగార్జున, ఈ సినిమాను నిర్మించిన నరసారెడ్డి అభినందనీయులు. ఐతే గీతాంజలి విడుదలకు ముందు నిర్మాత నరసారెడ్డిని ఒక డిస్ట్రిబ్యూటర్ బాగా ఇబ్బంది పెట్టాడంటూ ఒక షాకింగ్ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంచుకోవడం విశేషం. అదేంటంటే..
గీతాంజలి విడుదలకు వారం ముందు డిస్ట్రిబ్యూటర్లకు ప్రివ్యూ వేశారట. అందులో చాలామంది సినిమా పట్ల పెదవి విరిచారట. గుంటూరుకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ అయితే.. హీరో క్యాన్సర్ పేషెంట్ ఏంటి.. హీరోయిన్కు జబ్బు ఉండడం ఏంటి అని అభ్యంతర పెడుతూ.. సినిమాలో ఇలాంటి నెగెటివ్ విషయాలకు సంబంధించి నాలుగు ముఖ్యమైన సన్నివేశాలను ఫైనల్ కట్ నుంచి తీసేయాలని, అప్పుడే తాను డబ్బులు కట్టి సినిమా తీసుకుంటానని కండిషన్ పెట్టాడట. ఐతే ఫైనాన్స్ క్లియర్ చేయాల్సి ఉండడంతో దర్శకుడు మణిరత్నంకు తెలియకుండా నిర్మాత ఆ సీన్లు తీసేసి అతడికి ఫైనల్ కాపీ ఇచ్చాడట. గుంటూరు వరకు సినిమా అలాగే రిలీజైందట.
ఐతే గీతాంజలి రిలీజైన వారానికి గట్టిగా పుంజుకుని సూపర్ హిట్టయిందని.. కీలక సన్నివేశాలులేకుండానే గుంటూరులో సైతం హిట్ టాక్ తెచ్చుకుందని వర్మ వెల్లడించాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మణిరత్నం.. రెండో వారం నుంచి అయినా ఆ సీన్లు కలపమని అడిగితే సినిమా ఇక్కడ బాగానే ఆడుతోంది కదా.. మళ్లీ కెలకడం ఎందుకని ఆ డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోలేదని వర్మ తెలిపాడు.
This post was last modified on October 23, 2022 8:39 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…