బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్పిల్ బర్గ్ రాజమౌళి ఎప్పుడెప్పుడు మహేష్ బాబు సినిమా మొదలుపెడతారా అని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికింకా చాలా టైం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ చిన్న లీకైనా సరే విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగిస్తోంది. పైకి పనులేం జరుగుతున్నట్టు కనిపించడం లేదు కానీ జక్కన్న మాత్రం ఆల్రెడీ క్యాస్టింగ్ విషయంలో తీవ్ర కసరత్తులు మొదలుపెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా ఆయన సినిమాల్లో హీరోతో సమానంగా విలన్లు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో తెలిసిందే.
ఇప్పుడు దీనికి కూడా అలాంటి మాస్టర్ ప్లాన్ వేశారట. మహేష్ కు ధీటుగా ఇందులో రెండు ప్రతినాయక పాత్రలుంటాయి. అందులో ఒకదాని కోసం కార్తీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వినికిడి. లైన్ విన్న తమిళ స్టార్ హీరో పాజిటివ్ గానే స్పందించాడని, ఇప్పుడు దీన్ని వదులుకుంటే మళ్ళీ రాజమౌళితో చేసే అవకాశం వస్తుందో రాదోనన్న ఆలోచనతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెన్నై టాక్. అయితే అధికారికంగా కన్ఫర్మ్ గా చేయలేదు కానీ ఇదంతా అనఫీషియలే. కార్తీ గతంలో నాగార్జునతో ఊపిరి చేశాడు. దాని హిట్ లో కీలక భాగస్వామ్యం వహించాడు. ఇప్పుడు మహేష్ తో జట్టు కడితే అంచనాలు డబులవుతాయి.
హీరోగా మంచి స్వింగ్ లో ఉన్న టైంలో కార్తీ విలన్ గా చేస్తాడానే సందేహం రావొచ్చు కానీ రాజమౌళి డిజైన్ చేసిన పాత్ర వేరే స్థాయిలో ఉందట. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ఎంటర్ టైనర్ ఏ జానరనే లీక్ స్పష్టంగా బయటకి రాలేదు. ఒకసారి ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ అడ్వెంచర్ అంటారు, మరోసారి జేమ్స్ బాండ్ టైపులో స్పై థ్రిల్లర్ అంటారు. ఏది కరెక్టో తెలియాలంటే మాత్రం ఇంకో అయిదారు నెలలు ఎదురు చూడక తప్పదు. ఆలోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా పూర్తి చేసి ప్రిన్స్ ఫ్రీ అవుతాడు. ఆ తర్వాత రాజమౌళి కోసం ఎన్నేళ్లు త్యాగం చేయాలో.
This post was last modified on October 13, 2022 9:03 pm
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…
కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…
నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…