Movie News

‘పుష్ప’లో ఆ డైలాగ్ వెనుక హరీష్ శంకర్

ఇండియన్ ఫిలిం హిస్టరీలో ‘పుష్ప’ అనే సినిమాది ఒక ప్రత్యేక అధ్యాయం. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ సినిమాల తరహాలో విడుదల ముంగిట దానికి పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా క్రేజ్ ఏమీ లేదు. తెలుగులో మాత్రమే హైప్ కనిపించింది. కానీ తెలుగులో రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను ఇతర భాషల వాళ్లు ఆదరించిన తీరు అనూహ్యం. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా పెను సంచలనమే రేపింది. నామమాత్రంగా విడుదలై రూ.100 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, ఇందులోని పాటలు అంతర్జాతీయ స్థాయిలో ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. తాజాగా ‘పుష్ప’ 2021 సంవత్సరానికి ఫిలిం ఫేర్ అవార్డులను దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. అనేక విభాగాల్లో అవార్డులు అందుకుంది. దీనికంటే ముందు ‘సైమా’ అవార్డుల్లోనూ ‘పుష్ప’ ఎలా ఆధిపత్యం చలాయించిందో తెలిసిందే.

కాగా ‘సైమా’ అవార్డుల వేడుకను ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటూ ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన డైలాగ్‌కు సంబంధించి సీక్రెట్ వెల్లడించాడు. అవార్డు అందుకున్న సందర్భంగా కమెడియన్ ఆలీ బన్నీకి ఒక ఫ్లవర్ ఇచ్చి వెళ్లాడు. వాట్ ఎ కోఇన్సిడెన్స్ అంటూ వేదిక మీదే ఉన్న హరీష్ శంకర్ ‘పుష్ప’లో ఒక డైలాగ్‌కు ఎలా కారణమయ్యాడో వెల్లడించాడు బన్నీ.

‘పుష్ప’ టైటిల్ అనౌన్స్ చేశాక హరీష్ శంకర్‌ను తాను కలిసినపుడు ఇంత పెద్ద సినిమాకు ‘పుష్ప’ అంటూ పువ్వును సూచించే సాఫ్ట్ టైటిల్ ఏంటి అని అడిగాడని.. ఇదే విషయాన్ని తాను సుకుమార్ దగ్గర ప్రస్తావించగా.. ఆడియన్స్‌కు కూడా ఇలాంటి సందేహం వస్తుందేమో.. కాబట్టి ‘‘పుష్ప అంటే ప్లవర్ అనుకున్నావా.. ఫైర్’’ అని మనమే డైలాగ్‌తో చెప్పేద్దాం అంటూ అప్పటికప్పుడు సుక్కు ఈ డైలాగ్ చెప్పినట్లు బన్నీ వెల్లడించాడు. ఈ రకంగా హరీష్ పరోక్షంగా ఈ డైలాగ్‌కు కారణమైన విషయాన్ని బన్నీ వెల్లడించాడు.

This post was last modified on October 10, 2022 4:42 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

44 minutes ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

44 minutes ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

48 minutes ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago