ఇండియన్ ఫిలిం హిస్టరీలో ‘పుష్ప’ అనే సినిమాది ఒక ప్రత్యేక అధ్యాయం. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ సినిమాల తరహాలో విడుదల ముంగిట దానికి పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా క్రేజ్ ఏమీ లేదు. తెలుగులో మాత్రమే హైప్ కనిపించింది. కానీ తెలుగులో రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను ఇతర భాషల వాళ్లు ఆదరించిన తీరు అనూహ్యం. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా పెను సంచలనమే రేపింది. నామమాత్రంగా విడుదలై రూ.100 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, ఇందులోని పాటలు అంతర్జాతీయ స్థాయిలో ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. తాజాగా ‘పుష్ప’ 2021 సంవత్సరానికి ఫిలిం ఫేర్ అవార్డులను దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. అనేక విభాగాల్లో అవార్డులు అందుకుంది. దీనికంటే ముందు ‘సైమా’ అవార్డుల్లోనూ ‘పుష్ప’ ఎలా ఆధిపత్యం చలాయించిందో తెలిసిందే.
కాగా ‘సైమా’ అవార్డుల వేడుకను ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటూ ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన డైలాగ్కు సంబంధించి సీక్రెట్ వెల్లడించాడు. అవార్డు అందుకున్న సందర్భంగా కమెడియన్ ఆలీ బన్నీకి ఒక ఫ్లవర్ ఇచ్చి వెళ్లాడు. వాట్ ఎ కోఇన్సిడెన్స్ అంటూ వేదిక మీదే ఉన్న హరీష్ శంకర్ ‘పుష్ప’లో ఒక డైలాగ్కు ఎలా కారణమయ్యాడో వెల్లడించాడు బన్నీ.
‘పుష్ప’ టైటిల్ అనౌన్స్ చేశాక హరీష్ శంకర్ను తాను కలిసినపుడు ఇంత పెద్ద సినిమాకు ‘పుష్ప’ అంటూ పువ్వును సూచించే సాఫ్ట్ టైటిల్ ఏంటి అని అడిగాడని.. ఇదే విషయాన్ని తాను సుకుమార్ దగ్గర ప్రస్తావించగా.. ఆడియన్స్కు కూడా ఇలాంటి సందేహం వస్తుందేమో.. కాబట్టి ‘‘పుష్ప అంటే ప్లవర్ అనుకున్నావా.. ఫైర్’’ అని మనమే డైలాగ్తో చెప్పేద్దాం అంటూ అప్పటికప్పుడు సుక్కు ఈ డైలాగ్ చెప్పినట్లు బన్నీ వెల్లడించాడు. ఈ రకంగా హరీష్ పరోక్షంగా ఈ డైలాగ్కు కారణమైన విషయాన్ని బన్నీ వెల్లడించాడు.
This post was last modified on October 10, 2022 4:42 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…