Adipurush
ప్రభాస్ నుంచి రాబోతున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’కు సంబంధించి రెండు రోజుల కిందే టీజర్ లాంచ్ ఘనంగా చేశారు. కానీ టీజర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ తేడా కొట్టడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ‘రామాయణం’ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించింది ఒకటి. టీజర్లో చూపించింది ఇంకోటి. హాలీవుడ్లో తెరకెక్కిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ల ఛాయలు ఇందులో కనిపించాయి.
గేమ్ ఆఫ్ థ్రోన్స్, ప్లానెట్ ఆఫ్ ఏప్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి వాటి నుంచి విజువల్ ఎఫెక్ట్స్ను కాపీ కొట్టి సీన్లు తీర్చిదిద్దినట్లుగా అనిపించింది. కొన్ని చోట్ల ఎఫెక్ట్స్ మరీ పేలవంగా అనిపించాయి. దీంతో నెటిజన్లు ఒక రేంజిలో సినిమాను ట్రోల్ చేస్తున్నారు రెండు రోజుల నుంచి. కాగా టీజర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ ‘వీఎఫెక్స్ వాలా’ అనే ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేయడం గమనార్హం.
ఈ వీఎఫెక్స్ వాలా అనేది బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్కు చెందినది. అతడితో ఓం రౌత్ ‘తానాజీ’ అనే బ్లాక్బస్టర్ మూవీ తీశాడు. ఆ చిత్రానికి వీఎఫెక్స్ వాలా సంస్థ పని చేసింది. ‘ఆదిపురుష్’ టీజర్ ట్వీట్లో ఆ సంస్థను ట్యాగ్ చేయడంతో ఈ సినిమాకు కూడా ఆ సంస్థే ఎఫెక్ట్స్ అందించందని నెటిజన్లు భావించారు. ఇవేం చీప్ గ్రాఫిక్స్.. ఇలా కాపీ కొట్టేశారంటి అంటూ వాళ్లను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అజయ్ దేవగణ్ సంస్థ ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది.
‘ఆదిపురుష్’ సినిమాకు తాము పని చేయలేదని, ఆ చిత్రంతో తమకు ఏ సంబంధం లేదని తేల్చేసింది. ట్రోలింగ్ తట్టుకోలేకే ఆ సంస్థ ఇలా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐతే ‘వీఎఫెక్స్ వాలా’ ఈ సినిమాకు పని చేయకున్నా ఓం రౌత్ వాళ్లను ఎందుకు ట్యాగ్ చేశాడన్నది అర్థం కాని విషయం. ఏదేమైనా ‘ఆదిపురుష్’ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయాన్ని మాత్రం చిత్ర బృందం అర్థం చేసుకుని రిలీజ్ లోపు కొంచెం దిద్దుబాటు చర్యలు చేపడితే బెటరేమో.
This post was last modified on October 4, 2022 6:21 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…