Adipurush
ప్రభాస్ నుంచి రాబోతున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’కు సంబంధించి రెండు రోజుల కిందే టీజర్ లాంచ్ ఘనంగా చేశారు. కానీ టీజర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ తేడా కొట్టడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ‘రామాయణం’ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించింది ఒకటి. టీజర్లో చూపించింది ఇంకోటి. హాలీవుడ్లో తెరకెక్కిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ల ఛాయలు ఇందులో కనిపించాయి.
గేమ్ ఆఫ్ థ్రోన్స్, ప్లానెట్ ఆఫ్ ఏప్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి వాటి నుంచి విజువల్ ఎఫెక్ట్స్ను కాపీ కొట్టి సీన్లు తీర్చిదిద్దినట్లుగా అనిపించింది. కొన్ని చోట్ల ఎఫెక్ట్స్ మరీ పేలవంగా అనిపించాయి. దీంతో నెటిజన్లు ఒక రేంజిలో సినిమాను ట్రోల్ చేస్తున్నారు రెండు రోజుల నుంచి. కాగా టీజర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ ‘వీఎఫెక్స్ వాలా’ అనే ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేయడం గమనార్హం.
ఈ వీఎఫెక్స్ వాలా అనేది బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్కు చెందినది. అతడితో ఓం రౌత్ ‘తానాజీ’ అనే బ్లాక్బస్టర్ మూవీ తీశాడు. ఆ చిత్రానికి వీఎఫెక్స్ వాలా సంస్థ పని చేసింది. ‘ఆదిపురుష్’ టీజర్ ట్వీట్లో ఆ సంస్థను ట్యాగ్ చేయడంతో ఈ సినిమాకు కూడా ఆ సంస్థే ఎఫెక్ట్స్ అందించందని నెటిజన్లు భావించారు. ఇవేం చీప్ గ్రాఫిక్స్.. ఇలా కాపీ కొట్టేశారంటి అంటూ వాళ్లను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అజయ్ దేవగణ్ సంస్థ ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది.
‘ఆదిపురుష్’ సినిమాకు తాము పని చేయలేదని, ఆ చిత్రంతో తమకు ఏ సంబంధం లేదని తేల్చేసింది. ట్రోలింగ్ తట్టుకోలేకే ఆ సంస్థ ఇలా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐతే ‘వీఎఫెక్స్ వాలా’ ఈ సినిమాకు పని చేయకున్నా ఓం రౌత్ వాళ్లను ఎందుకు ట్యాగ్ చేశాడన్నది అర్థం కాని విషయం. ఏదేమైనా ‘ఆదిపురుష్’ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయాన్ని మాత్రం చిత్ర బృందం అర్థం చేసుకుని రిలీజ్ లోపు కొంచెం దిద్దుబాటు చర్యలు చేపడితే బెటరేమో.
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…