Movie News

‘ఆదిపురుష్’తో మాకు సంబంధం లేదు


ప్రభాస్ నుంచి రాబోతున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’కు సంబంధించి రెండు రోజుల కిందే టీజర్ లాంచ్ ఘనంగా చేశారు. కానీ టీజర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ తేడా కొట్టడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ‘రామాయణం’ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించింది ఒకటి. టీజర్లో చూపించింది ఇంకోటి. హాలీవుడ్లో తెరకెక్కిన పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల ఛాయలు ఇందులో కనిపించాయి.

గేమ్ ఆఫ్ థ్రోన్స్, ప్లానెట్ ఆఫ్ ఏప్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి వాటి నుంచి విజువల్ ఎఫెక్ట్స్‌ను కాపీ కొట్టి సీన్లు తీర్చిదిద్దినట్లుగా అనిపించింది. కొన్ని చోట్ల ఎఫెక్ట్స్ మరీ పేలవంగా అనిపించాయి. దీంతో నెటిజన్లు ఒక రేంజిలో సినిమాను ట్రోల్ చేస్తున్నారు రెండు రోజుల నుంచి. కాగా టీజర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ ‘వీఎఫెక్స్ వాలా’ అనే ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేయడం గమనార్హం.

ఈ వీఎఫెక్స్ వాలా అనేది బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్‌కు చెందినది. అతడితో ఓం రౌత్ ‘తానాజీ’ అనే బ్లాక్‌బస్టర్ మూవీ తీశాడు. ఆ చిత్రానికి వీఎఫెక్స్ వాలా సంస్థ పని చేసింది. ‘ఆదిపురుష్’ టీజర్ ట్వీట్‌లో ఆ సంస్థను ట్యాగ్ చేయడంతో ఈ సినిమాకు కూడా ఆ సంస్థే ఎఫెక్ట్స్ అందించందని నెటిజన్లు భావించారు. ఇవేం చీప్ గ్రాఫిక్స్.. ఇలా కాపీ కొట్టేశారంటి అంటూ వాళ్లను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అజయ్ దేవగణ్ సంస్థ ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది.

‘ఆదిపురుష్’ సినిమాకు తాము పని చేయలేదని, ఆ చిత్రంతో తమకు ఏ సంబంధం లేదని తేల్చేసింది. ట్రోలింగ్ తట్టుకోలేకే ఆ సంస్థ ఇలా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐతే ‘వీఎఫెక్స్ వాలా’ ఈ సినిమాకు పని చేయకున్నా ఓం రౌత్ వాళ్లను ఎందుకు ట్యాగ్ చేశాడన్నది అర్థం కాని విషయం. ఏదేమైనా ‘ఆదిపురుష్’ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయాన్ని మాత్రం చిత్ర బృందం అర్థం చేసుకుని రిలీజ్ లోపు కొంచెం దిద్దుబాటు చర్యలు చేపడితే బెటరేమో.

This post was last modified on October 4, 2022 6:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

24 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago