ఆల్మోస్ట్ 2002లో ఖడ్గం సినిమాలో లైమ్ లైట్లోకి వచ్చిన టాప్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్.. ఆ తరువాత ఈ రెండు దశాబ్దాల్లో దాదాపు స్టార్ హీరోలందరికీ సినిమాలు చేశాడు. తన మ్యూజిక్ తో యావత్ తెలుగు లోకాన్ని ఉర్రూతలూపేశాడు. అయితే ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా సినిమాలకు కాకుండా సొంతంగా ఒక్క పాట కూడా చేసిందేలేదు. అందుకే ఇప్పుడు తన ఫస్ట్ సింగిల్ సాంగుతో రాబోతున్నట్లు ప్రకటించాడు దేవిశ్రీప్రసాద్.
నిజానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్లందరూ.. ఒక ప్రక్కన సినిమాలు చేస్తూనే.. మరో ప్రక్కన సింగిల్స్ కూడా రిలీజ్ చేస్తుంటారు. ఈ ఇండివిడ్యుయల్ మ్యూజిక్ వీడియోలకు కూడా మిలియన్స్ వ్యూస్ మాత్రమే కాదు.. రకరాలు ఆడియో ఆప్స్ లో కూడా విపరీతమైన ఆదరణ ఉంటుంది. పైగా.. ఒక సినిమాకు పాటలు ఇచ్చేస్తే.. దానికి తాలూకు రైట్స్ అన్నీ సదరు ప్రొడ్యూసర్లకు సదరు ఆడియోను కొనుక్కున్న కంపెనీలకు మాత్రమే ఉంటాయి. ఆ పాటల తాలూకు విజయాన్ని అందులో నటించిన హీరోలకే అప్పజేస్తారు మన ఫ్యాన్స్. కాని ఒక ఆడియో కంపెనీతో కలసి నేరుగా ఇలా సింగిల్ సాంగ్ చెయ్యడం వలన, ఆర్టిస్టుకే రైట్స్ ఎక్కువ ఉండే ఛాన్సుంటుంది. ఆ పాటలను వాళ్ళు హ్యీపీగా పబ్లిక్ కాన్సర్ట్ లో పాడుకోవచ్చు.. వివిధ విదేశీ కంపెనీలకు కూడా రైట్స్ విక్రయించుకోవచ్చు. పైగా క్రెడిట్ అంతా సోలోగా ఆ కంపోజర్ కే వస్తుంది. ఈ బిజినెస్ అంతా మాకెందుకులో అని తెలుగులో చాలామంది సంగీత దర్శకులు కేవలం సినిమాలకే పరిమితం అవుతుంటారు. దేవిశ్రీ కూడా ఇన్నాళ్ళూ అలాగే పరిమితం అయిపోయాడు.
కాకపోతే పుష్ప సినిమా బాలీవుడ్లో విజయం సాధించిన తరువాత.. టి-సిరీస్ కంపెనీవాల్ళు మనోడ్ని బాగానే లైన్లో పెట్టేశారు. ఆల్రెడీ 3-4 హిందీ సినిమాలు కాకుండా, మనోడితో ఇప్పుడు సింగిల్ సాంగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. అవన్నీ దేవిశ్రీప్రసాద్ సొంత యుట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తారో లేకపోతే టి-సిరీస్ ఛానల్ లో రిలీజ్ చేస్తారో తెలియదు కాని, మన రాక్ స్టార్ మాత్రం కొత్త ‘సింగిల్’ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యడానికి చాలా ఎక్సయింటింగా ఉన్నట్లో సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
This post was last modified on September 30, 2022 2:08 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…