ఆల్మోస్ట్ 2002లో ఖడ్గం సినిమాలో లైమ్ లైట్లోకి వచ్చిన టాప్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్.. ఆ తరువాత ఈ రెండు దశాబ్దాల్లో దాదాపు స్టార్ హీరోలందరికీ సినిమాలు చేశాడు. తన మ్యూజిక్ తో యావత్ తెలుగు లోకాన్ని ఉర్రూతలూపేశాడు. అయితే ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా సినిమాలకు కాకుండా సొంతంగా ఒక్క పాట కూడా చేసిందేలేదు. అందుకే ఇప్పుడు తన ఫస్ట్ సింగిల్ సాంగుతో రాబోతున్నట్లు ప్రకటించాడు దేవిశ్రీప్రసాద్.
నిజానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్లందరూ.. ఒక ప్రక్కన సినిమాలు చేస్తూనే.. మరో ప్రక్కన సింగిల్స్ కూడా రిలీజ్ చేస్తుంటారు. ఈ ఇండివిడ్యుయల్ మ్యూజిక్ వీడియోలకు కూడా మిలియన్స్ వ్యూస్ మాత్రమే కాదు.. రకరాలు ఆడియో ఆప్స్ లో కూడా విపరీతమైన ఆదరణ ఉంటుంది. పైగా.. ఒక సినిమాకు పాటలు ఇచ్చేస్తే.. దానికి తాలూకు రైట్స్ అన్నీ సదరు ప్రొడ్యూసర్లకు సదరు ఆడియోను కొనుక్కున్న కంపెనీలకు మాత్రమే ఉంటాయి. ఆ పాటల తాలూకు విజయాన్ని అందులో నటించిన హీరోలకే అప్పజేస్తారు మన ఫ్యాన్స్. కాని ఒక ఆడియో కంపెనీతో కలసి నేరుగా ఇలా సింగిల్ సాంగ్ చెయ్యడం వలన, ఆర్టిస్టుకే రైట్స్ ఎక్కువ ఉండే ఛాన్సుంటుంది. ఆ పాటలను వాళ్ళు హ్యీపీగా పబ్లిక్ కాన్సర్ట్ లో పాడుకోవచ్చు.. వివిధ విదేశీ కంపెనీలకు కూడా రైట్స్ విక్రయించుకోవచ్చు. పైగా క్రెడిట్ అంతా సోలోగా ఆ కంపోజర్ కే వస్తుంది. ఈ బిజినెస్ అంతా మాకెందుకులో అని తెలుగులో చాలామంది సంగీత దర్శకులు కేవలం సినిమాలకే పరిమితం అవుతుంటారు. దేవిశ్రీ కూడా ఇన్నాళ్ళూ అలాగే పరిమితం అయిపోయాడు.
కాకపోతే పుష్ప సినిమా బాలీవుడ్లో విజయం సాధించిన తరువాత.. టి-సిరీస్ కంపెనీవాల్ళు మనోడ్ని బాగానే లైన్లో పెట్టేశారు. ఆల్రెడీ 3-4 హిందీ సినిమాలు కాకుండా, మనోడితో ఇప్పుడు సింగిల్ సాంగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. అవన్నీ దేవిశ్రీప్రసాద్ సొంత యుట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తారో లేకపోతే టి-సిరీస్ ఛానల్ లో రిలీజ్ చేస్తారో తెలియదు కాని, మన రాక్ స్టార్ మాత్రం కొత్త ‘సింగిల్’ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యడానికి చాలా ఎక్సయింటింగా ఉన్నట్లో సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
This post was last modified on September 30, 2022 2:08 pm
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…