ఇంకో వారం తిరక్కుండానే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లు బరిలో దిగబోతున్నాయి. ఎన్నడూ లేనిది చిరంజీవి, నాగార్జునలు ఒకేరోజు బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధపడటంతో దసరా పండగ అక్టోబర్ 5న రసవత్తరమైన పోటీ కనిపించనుంది. ఆల్రెడీ థియేటర్లతో ఒప్పందాలు దాదాపుగా జరిగిపోయాయి. పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు అడ్వాన్సులిచ్చేసి స్క్రీన్లను బ్లాక్ చేసుకుంటున్నారు. ఎవరికి వారు వీలైనంత మంచివి దక్కేలా పావులు కదుపుతున్నారు. రెండు సినిమాల వెనుక బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉండటంతో నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఈ కౌంట్ మీద రేపు పొన్నియన్ సెల్వన్ 1 టాక్ కూడా కీలకం కానుంది.
ఇక అసలు విషయానికి వస్తే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లలో ఆసక్తికరమైన ఓ పోలిక ఉంది. రెండు కథల్లో మెయిన్ పాయింట్ సిస్టర్ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. మొదటిదాంట్లో నయనతార పోషించిన పాత్ర చిరంజీవికి చెల్లి వరసలో సాగుతుంది. చనిపోయిన సిఎం కూతురిగా చెడ్డవాడైన భర్తను దాటలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న ఆమెను కాపాడేందుకు ఇరవై సంవత్సరాలు ఆ కుటుంబానికి దూరంగా ఉన్న మెగాస్టార్ సరైన టైంలో ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని, సోదరిని కాపాడేందుకు రంగంలో దిగుతాడు. వీళ్ళ మధ్య బలమైన సీన్స్ ఉంటాయి.
అటు ది ఘోస్ట్ సంగతి చూస్తే ఎప్పుడో దూరమైన అక్కయ్య (గుల్ పనాగ్) శత్రువుల వల్ల ప్రమాదంలో ఉంటే చనిపోయిన తండ్రికిచ్చిన మాట కోసం ఏజెంట్ విక్రమ్ అలియాస్ నాగార్జున ఆమెతో పాటు మేనకోడలిని రక్షించే బాధ్యత తీసుకుంటాడు. గరుడవేగాను మించిన యాక్షన్ టేకింగ్ తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటికే విభిన్న అనుభూతి ఇవ్వబోతున్నామని హామీ ఇచ్చేశాడు. ఫైట్లు ఎన్ని ఉన్నా హీరో పోరాటం మాత్రం అక్కయ్యను కాపాడుకోవడం మీదే ఉంటుంది. మొత్తానికి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లలో ఈ సారూప్యత ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…