ఇంకో వారం తిరక్కుండానే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లు బరిలో దిగబోతున్నాయి. ఎన్నడూ లేనిది చిరంజీవి, నాగార్జునలు ఒకేరోజు బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధపడటంతో దసరా పండగ అక్టోబర్ 5న రసవత్తరమైన పోటీ కనిపించనుంది. ఆల్రెడీ థియేటర్లతో ఒప్పందాలు దాదాపుగా జరిగిపోయాయి. పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు అడ్వాన్సులిచ్చేసి స్క్రీన్లను బ్లాక్ చేసుకుంటున్నారు. ఎవరికి వారు వీలైనంత మంచివి దక్కేలా పావులు కదుపుతున్నారు. రెండు సినిమాల వెనుక బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉండటంతో నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఈ కౌంట్ మీద రేపు పొన్నియన్ సెల్వన్ 1 టాక్ కూడా కీలకం కానుంది.
ఇక అసలు విషయానికి వస్తే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లలో ఆసక్తికరమైన ఓ పోలిక ఉంది. రెండు కథల్లో మెయిన్ పాయింట్ సిస్టర్ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. మొదటిదాంట్లో నయనతార పోషించిన పాత్ర చిరంజీవికి చెల్లి వరసలో సాగుతుంది. చనిపోయిన సిఎం కూతురిగా చెడ్డవాడైన భర్తను దాటలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న ఆమెను కాపాడేందుకు ఇరవై సంవత్సరాలు ఆ కుటుంబానికి దూరంగా ఉన్న మెగాస్టార్ సరైన టైంలో ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని, సోదరిని కాపాడేందుకు రంగంలో దిగుతాడు. వీళ్ళ మధ్య బలమైన సీన్స్ ఉంటాయి.
అటు ది ఘోస్ట్ సంగతి చూస్తే ఎప్పుడో దూరమైన అక్కయ్య (గుల్ పనాగ్) శత్రువుల వల్ల ప్రమాదంలో ఉంటే చనిపోయిన తండ్రికిచ్చిన మాట కోసం ఏజెంట్ విక్రమ్ అలియాస్ నాగార్జున ఆమెతో పాటు మేనకోడలిని రక్షించే బాధ్యత తీసుకుంటాడు. గరుడవేగాను మించిన యాక్షన్ టేకింగ్ తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటికే విభిన్న అనుభూతి ఇవ్వబోతున్నామని హామీ ఇచ్చేశాడు. ఫైట్లు ఎన్ని ఉన్నా హీరో పోరాటం మాత్రం అక్కయ్యను కాపాడుకోవడం మీదే ఉంటుంది. మొత్తానికి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లలో ఈ సారూప్యత ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
This post was last modified on September 29, 2022 7:57 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…