ఇంకో వారం తిరక్కుండానే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లు బరిలో దిగబోతున్నాయి. ఎన్నడూ లేనిది చిరంజీవి, నాగార్జునలు ఒకేరోజు బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధపడటంతో దసరా పండగ అక్టోబర్ 5న రసవత్తరమైన పోటీ కనిపించనుంది. ఆల్రెడీ థియేటర్లతో ఒప్పందాలు దాదాపుగా జరిగిపోయాయి. పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు అడ్వాన్సులిచ్చేసి స్క్రీన్లను బ్లాక్ చేసుకుంటున్నారు. ఎవరికి వారు వీలైనంత మంచివి దక్కేలా పావులు కదుపుతున్నారు. రెండు సినిమాల వెనుక బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉండటంతో నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఈ కౌంట్ మీద రేపు పొన్నియన్ సెల్వన్ 1 టాక్ కూడా కీలకం కానుంది.
ఇక అసలు విషయానికి వస్తే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లలో ఆసక్తికరమైన ఓ పోలిక ఉంది. రెండు కథల్లో మెయిన్ పాయింట్ సిస్టర్ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. మొదటిదాంట్లో నయనతార పోషించిన పాత్ర చిరంజీవికి చెల్లి వరసలో సాగుతుంది. చనిపోయిన సిఎం కూతురిగా చెడ్డవాడైన భర్తను దాటలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న ఆమెను కాపాడేందుకు ఇరవై సంవత్సరాలు ఆ కుటుంబానికి దూరంగా ఉన్న మెగాస్టార్ సరైన టైంలో ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని, సోదరిని కాపాడేందుకు రంగంలో దిగుతాడు. వీళ్ళ మధ్య బలమైన సీన్స్ ఉంటాయి.
అటు ది ఘోస్ట్ సంగతి చూస్తే ఎప్పుడో దూరమైన అక్కయ్య (గుల్ పనాగ్) శత్రువుల వల్ల ప్రమాదంలో ఉంటే చనిపోయిన తండ్రికిచ్చిన మాట కోసం ఏజెంట్ విక్రమ్ అలియాస్ నాగార్జున ఆమెతో పాటు మేనకోడలిని రక్షించే బాధ్యత తీసుకుంటాడు. గరుడవేగాను మించిన యాక్షన్ టేకింగ్ తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటికే విభిన్న అనుభూతి ఇవ్వబోతున్నామని హామీ ఇచ్చేశాడు. ఫైట్లు ఎన్ని ఉన్నా హీరో పోరాటం మాత్రం అక్కయ్యను కాపాడుకోవడం మీదే ఉంటుంది. మొత్తానికి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లలో ఈ సారూప్యత ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
This post was last modified on September 29, 2022 7:57 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…