ఇంకా మూడు నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ రాబోయే సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ఎవరెవరు ఉంటారనే సస్పెన్స్ అంతకంతా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇప్పటిదాకా ఆ సీజన్ కు ఖచ్చితంగా వస్తామని చెప్పింది ఒక్క చిరంజీవి వాల్తేర్ వీరయ్యనే. టైటిల్ ఇంకా అఫీషియల్ కాలేదు కానీ హీరో దర్శకుడు ఇద్దరూ పలు సందర్భాల్లో చెప్పేశారు. అలా అని ఆ డేట్ కే కట్టుబడే ఉంటారని గ్యారెంటీగా చెప్పలేం. ఆ టైంకి ఏర్పడే పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు ఉండొచ్చు. అన్నింటిని మించి డిసెంబర్ కంతా షూటింగ్ పూర్తి చేయడం చాలా కీలకం.
దీని కన్నా బాలకృష్ణ 107 చిత్రీకరణ మెరుగ్గా ఉంది. డిసెంబర్ రిలీజ్ సాధ్యపడకపోతే పొంగల్ కే వెళదామని బాలయ్య అంటున్నారట. కానీ పైన చెప్పిన మెగా మూవీ, ఇది రెండూ మైత్రి మూవీ మేకర్స్ వే. సో ఒకటి డ్రాప్ కాక తప్పదు. ప్రభాస్ ఆది పురుష్ రావడం కన్ఫర్మ్ అయితే అప్పుడో కొత్త సమస్య వస్తుంది. థియేటర్ల కౌంట్, బిజినెస్ లెక్కలు దాని కథ వేరే. అక్టోబర్ మొదటి వారంలో టీజర్ లాంచ్ అన్నారు కాబట్టి అది చూసాక విడుదల గురించి క్లారిటీ వస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా రూపొందుతున్న వారసుడుని ఎట్టి పరిస్థితుల్లో ఫెస్టివల్ కి దింపాలని డిసైడ్ అయ్యారట. ఎవరొచ్చినా రాకపోయినా మార్పు ఉండకపోవచ్చు.
ఇవన్నీ కాకుండా అఖిల్ ఏజెంట్ కనక డిసెంబర్ ని మిస్ చేసుకుంటే అదీ సంక్రాంతి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తుంది. మొత్తానికి ఎవరుంటారు ఎవరాగుతారనేది అంచనా వేయడం కష్టమే. కొరోనా పూర్తిగా మాయమయ్యాక ఎలాంటి భయాలు లేకుండా వస్తున్న సంక్రాంతి కావడంతో వీలైనంత మేరకు ఈ అవకాశాన్ని వాడుకునేందుకు అందరూ పావులు కదుపుతున్నారు. ఈ ఏడాది దసరా తర్వాత మళ్ళీ ఎక్కువ హాలిడేస్ వచ్చేది జనవరిలోనే. అప్పటిదాకా బాక్సాఫీస్ కొంత నెమ్మదిగానే ఉంటుంది. మరి ఫైనల్ రేస్ లో నిలబడే పందెం కోళ్లు ఏవో వేచి చూడాలి
This post was last modified on September 21, 2022 6:44 am
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…