RX 100 దర్శకుడు అజయ్ భూపతి ఎప్పట్నుంచో మహా సముద్రం అనే చిత్రాన్ని మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మొదట హీరోలు దొరకలేదు. రవితేజ ఓకే అనుకుంటే అన్నీ సెట్ అయ్యాక తప్పుకున్నాడు. ఆ తర్వాత శర్వానంద్ చేస్తానని చెప్పాడు. సితార బ్యానర్ లో చేయాలనే ప్లాన్ ఉంది కానీ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు.
అజయ్ భూపతి అయితే మిగతా తారాగణం ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడు. మొదట అదితి రావు హైదరి, ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అన్నారు. కానీ ఇప్పుడు రాశి ఖన్నా ఫైనల్ అని చెప్తున్నారు. మరి రాశి ఖన్నా అయినా ఈ సముద్రాన్ని పొంగిస్తుందా లేదా అనేది చూడాలి.
ఇందులో మరో హీరో క్యారెక్టర్ కూడా ఉంది. రవితేజ హీరో అనుకున్నప్పుడు సిద్ధార్థ్ ని అనుకున్నారు. శర్వానంద్ పక్కన అతడినే తీసుకుంటారా లేక వేరే హీరోని సంప్రదిస్తారా అనేది ఇప్పటికైతే సస్పెన్సు.
Gulte Telugu Telugu Political and Movie News Updates